Showing posts with label Br. Joseph Thamby. Show all posts
Showing posts with label Br. Joseph Thamby. Show all posts

బ్రదర్ జోసఫ్ తంబిగారి మహోత్సవములు 15 జనవరి 2021

 బ్రదర్ జోసఫ్ తంబిగారి మహోత్సవములు 15 జనవరి 2021

బ్రదర్ జోసఫ్ తంబిగారికి చాలా ఇష్టమైన బైబులు వాక్యమును చదువుకొని, ఈ వాక్యపరిచర్యను ప్రారంభించుకుందాం. 1 పేతురు 1:24-25: “మానవులందరు గడ్డిమొక్కల వంటివారు; వారి వైభవము గడ్డిపూల వంటిది; గడ్డి నశించును, పూలు రాలిపోవును, కాని దేవుని వాక్కు ఎల్లప్పుడును నిలుచును.” జోసఫ్ తంబిగారు ఉత్తరభారత దేశములోని ‘ఝాన్సి’ అను ప్రాంతములో ఉండగా, పర్యటించుచుండగా, సువార్తాపరిచర్య చేయుచుండగా, అక్కడ తోమాసు అనే వ్యక్తితో పరిచయం, స్నేహం ఏర్పడింది. ఈ తోమాసు అనే వ్యక్తి వ్రాతపూర్వకముగా ఇచ్చిన సాక్ష్యములో, బ్రదర్ జోసఫ్ తంబిగారు తనకు ఇచ్చిన ఆధ్యాత్మిక సలహా ఈ బైబులు వాక్యం అని సాక్ష్యమియ్యడం జరిగింది.

ప్రభువునందు ప్రియ సహోదరీ సహోదరులారా! దైవసేవకుడు బ్రదర్ జోసఫ్ తంబిగారి 76వ వర్ధంతి మహోత్సవాల సందర్భముగా, 9 రోజుల ప్రార్ధనలు, 3 రోజుల మహోత్సవాలను ఘనముగా, భక్తియుతముగా పూర్తిచేసుకొనియున్నాము. కనుక, ఈ సాయంసమయమున, పెద్దవుటపల్లిలోని బ్రదర్ జోసఫ్ తంబి ఆశ్రమం గురువులందరం కలిసి ఈ కృతజ్ఞతా సమిష్టి దివ్యబలి పూజను అర్పిస్తున్నాం. నవదిన ప్రార్ధనల ఆరంభమునుండి ఈసమయము వరకు కూడా బ్రదర్ జోసఫ్ తంబిగారి మధ్యస్థ ప్రార్ధనలద్వారా దేవుని నుండి మనం ఎన్నో మేలులను, అనుగ్రహాలను పొందియున్నాము. కనుక, ఈ కృతజ్ఞతాబలిని అర్పిస్తున్నాము.

మన జీవితములో కృతజ్ఞతాభావం ఎంతో అవసరం. మన హృదయాలు కృతజ్ఞతాభరితం కావాలి. కృతజ్ఞతలేని హృదయాలు ఎప్పుడూ సంతోషముగా ఉండలేవు. కృతజ్ఞత అనేది కేవలం కొన్నిపరిస్థితులకు ప్రతిస్పందించడం కాదు. ఎదో నోటిమాటగా, “వందనాలు” లేదా “Thank You” అని చెబితే సరిపోదు. అలా స్పందిస్తే అది చంచల మనస్తత్వం అవుతుంది. గుండె లోతుల్లోనుండి వస్తేనే అది నిజమైన కృతజ్ఞత అవుతుంది. అలాగే, మనకు అనుకూల పరిస్థితులు కలిగినప్పుడు మాత్రమే కృతజ్ఞత కలిగి యుండటం కాదు. ప్రతికూల పరిస్థితులలోకూడా కృతజ్ఞతాభావమును కలిగి యుండాలి.

ముందుగా, మనం దేవుని పట్ల కృతజ్ఞతాస్తుతిభావాన్ని కలిగి యుండాలి: దేవుడు స్తోత్రార్హుడు. మన స్తుతికి పాత్రుడు. కనుక ఆయనను మనం స్తుతించాలి. దేవుడు చేసిన ఉపకారములను బట్టి, ఆయన అనుగ్రహాన్ని బట్టి, ఆయన పరాక్రమ కార్యాలను బట్టి, ఆయనను స్తుతించాలి. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి.

దేవుడు మన జీవితములో ఎన్నో మేలులు చేయుచున్నాడు. మనలను కంటికి రెప్పలా కాచికాపాడుతున్నాడు. కనుక, ప్రతీదినం మనం దేవున్ని స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. “మీరు ప్రభువును స్తుతింపుడు. భక్త సమాజమున అతనిని స్తుతింపుము” అని కీర్తన 149:1లో చదువుచున్నాము. దేవుడు మన ప్రభువు కనుక ఆయనను స్తుతించాలి. ఆయన సర్వాధికారి, సర్వశక్తుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. సర్వసృష్టికి మూలము. అన్నింటికన్న మహోన్నతుడు కనుక మనం దేవున్ని స్తుతించాలి.

దేవున్ని స్తుతించడంద్వారా ఆయనను మహిమపరుస్తున్నాము... ఘనపరుస్తున్నాము. కీర్తన 50:23లో ఇలా చదువుచున్నాం: కృతజ్ఞతాస్తుతి అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. ఆయనను మహిమ పరచడమే నిశ్చయముగా దేవుని ప్రజల గొప్ప కోరికగా ఉండాలి.”

దేవుడు మనలను ఆజ్ఞాపిస్తున్నాడు కనుక మనం ఆయనను స్తుతించాలి. ప్రభువును స్తుతించుట ఒక సలహానో, విన్నపమో కాదు అదొక ఆజ్ఞ. కీర్తన 117:1లో ఇలా చదువుచున్నాం: “ఎల్లజాతులారా! ప్రభువును స్తుతింపుడు. ఎల్లప్రజలారా! అతనిని కీర్తింపుడు.”

తంబిగారి జీవితం కృతజ్ఞతాస్తుతి ప్రార్ధనా జీవితం:

తంబిగారి జీవితం దేవునిపట్ల కృతజ్ఞతతో కూడినటువంటి జీవితం. సూర్యోదయమునుండి సూర్యాస్తమయము వరకు, రోజంతా, ఆయన జీవించినంతకాలం, సర్వవేళలయందు, సమస్తమునుగూర్చి ఆయన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. కీర్తన 113:3లో “తూర్పునుండి పడమరవరకును ప్రభువు నామము వినుతింపబడునుగాక!” అని చదువుచున్నట్లుగా, తంబిగారు తన జీవితముతో దేవున్ని స్తుతించాడు. ఎఫెసీ పత్రిక 5:20లో చదువుచున్నట్లుగా, “మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రియగు దేవునకు సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుడు” అని చదువుచున్నట్లుగా, తంబిగారు తన జీవితములోని సమస్తమునుగూర్చి, ప్రతి విషయమునుగూర్చి దేవున్ని స్తుతించాడు.

తంబిగారు గొప్ప ప్రార్ధనాపరుడు. ఆయన “ప్రార్ధనకు ప్రతిరూపం” అని చెప్పవచ్చు. మనకు తెలిసినది తంబిగారికి జపమాల ప్రార్ధన అంటే చాలా ఇష్టం అని. విశ్వాసులను ప్రార్ధన కూటాలకు నడిపించి జపమాలను చెప్పించేవాడు. ప్రార్ధన కూటాలను నడిపించేవాడు. బైబులును వివరించేవాడు. అలాగే, దివ్యబలిపూజ అన్నను, దివ్యసత్ప్రసాద ఆరాధన అన్నను, తంబిగారికి ఎంతో ఇష్టం, ప్రేమ. భక్తిగా పాల్గొని ఆ ప్రార్ధనలలో పరవశుడై పోయేవాడు.

అలాగే, తంబిగారు గంటలు తరబడి వ్యక్తిగత ప్రార్ధనలో గడిపేవాడు. ఆయన రాత్రంతయు మోకరిల్లి, చేతులెత్తి మౌనస్తుతిప్రార్ధన చేసేవాడని చెప్పడానికి మనకు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మానికొండ గ్రామ వాస్తవ్యులైన గుత్తికొండ దోమినిక్ గారు అలాగే వేమూరి పరంధామయ్యగారు బ్రదర్ జోసఫ్ తంబిగారితో చాలా సన్నిహితముగా ఉండేవారు. తరుచుగా, మానికొండనుండి అవుటపల్లికి వచ్చి తంబిగారిని కలిసి ఇక్కడే ఆయన గదిలోనే బసచేసేవారు. వారు ఇచ్చిన సాక్ష్యం ప్రకారం, అర్ధరాత్రి సమయములో లేచి చూడగా, జోసఫ్ తంబిగారు మోకరించి, చేతులు పైకెత్తి ప్రార్ధిస్తూ కనిపించేవారు. చాలా రాత్రులు ఒక గంట మాత్రమే పడుకునే వారని సాక్ష్యాలను బట్టి మనకు తెలియుచున్నది. బోయపాటివారి యింటిలో జోసఫ్ తంబిగారు, క్లారమ్మగారు కలిసి దివారాత్రులు ప్రార్దిచేవారని ఇప్పటికి ఆ కుటుంబ సభ్యులు సాక్ష్యమిచ్చుచున్నారు. తెలగతోటి ప్రభుదాసుగారి సాక్ష్యం ప్రకారం, రాత్రంతయు గంటల తరబడి ఎడతెగక ప్రార్ధించేవాడు తంబిగారు. ప్రార్ధనలో తంబిగారి ముఖము తేజోవంతముగా వెలిగేదని సాక్ష్యమిచ్చాడు. ఈవిధముగా, తంబిగారి జీవితం ఒక ప్రార్ధనా మారింది.

తంబిగారు అన్ని సమయాలలో దేవున్ని స్తుతించాడు, కృతజ్ఞతలు చెల్లించాడు. కృతజ్ఞతా స్తుతిప్రార్ధన చేసాడు. అనుకూల పరిస్థితులలోను, ప్రతికూల పరిస్థితులలోను దేవున్ని స్తుతించాడు. ఆయనను ప్రజలు అర్ధం చేసుకున్నప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు, ఇతరులకు సహాయం చేసినప్పుడు దేవున్ని స్తుతించాడు. అలాగే, ప్రతికూల పరిస్థితులలో దేవున్ని స్తుతించాడు. తనను దొంగస్వామిగా భావించినప్పుడు దేవున్ని స్తుతించాడు. పిచ్చోడని భావించి తనపై రాళ్ళు విసిరినప్పుడు ఆయన దేవున్ని స్తుతించాడు. ఎటు వెళ్ళాలో తెలియక దిక్కుతోచని పరిస్థితులలో ఆయన దేవున్ని స్తుతించాడు. తన బాధలలో, శ్రమలలో దేవున్ని స్తుతించాడు: తాను పంచాగాయాలను పొందినప్పుడు పొందిన వేదనలో, ఆవేదనలో, బాధలో, శ్రమలో దేవున్ని స్తుతించాడు.

దైవసేవకుడైన బ్రదర్ జోసఫ్ తంబిగారి కృతజ్ఞతా ప్రార్ధన జీవితం మనకు ఎంతో ఆదర్శం. మన జీవితములో కూడా ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. అన్ని సమయాలలో దేవున్ని స్తుతించుదాం.

మనం అన్నివేళలా దేవున్ని స్తుతించకపోవడానికి కారణాలు: మనలోనున్న అనుమానం, స్వార్ధం, లోకవ్యామోహాలు, అన్నింటిని చెడుగా చూడటం (మంచిని చూడకపోవడం), అసహనం లేదా ఓపిక లేకపోవడం, గోరువెచ్చతనముగా జీవించడం మరియు కోపం. జోసఫ్ తంబిగారి మధ్యస్థ ప్రార్ధనద్వారా ఈ దుష్టశక్తులనుండి విముక్తిని పొందుదాం. దేవున్ని ఎల్లప్పుడూ స్తుతించుదాం. కృతజ్ఞతాభావముతో నిండిన హృదయాలతో జీవించుదాం.

నేటి సువిశేష పఠనాన్ని ధ్యానించుదాం: పదిమంది కుష్టరోగుల గురించి ఉన్నాము. పదిమందిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి, ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగివచ్చి, యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. కుష్టరోగులు అనగానే, జోసఫ్ తంబిగారి జీవితములో కూడా ఒక కుష్టరోగితో అనుభవం పొందాడు. తంబిగారి ద్వారా దేవుడు అద్భుతకార్యాన్ని చేసాడు. తంబిగారు కేసరపల్లిలో ఉండగా జరిగిన యధార్ధ సంఘటన. ఒకరోజు సాయంత్రం, తంబిగారు గన్నవరం వెళుతూ, పుల్లెల్లి అంథోని మరియు జోజప్ప అను ఇద్దరు పిల్లలు గుడిదగ్గర ఆడుకొనుచుండగా, వారిని పిలిచి, అప్పట్లో కేసరపల్లికి, గన్నవరంకి మధ్యన ఉన్న పెద్ద మర్రిచెట్టు వరకు తనతో రమ్మన్నాడు. అక్కడ ఆ కాలములో కుష్టరోగులకు ఒక ఆసుపత్రి ఉండేది. ఒక కుష్టరోగి ఆ చెట్టుకింద కూర్చొని ఉండటం చూసారు. కప్పుకోవడానికి సరియైన బట్టలుకూడా లేకపోవడముతో ఆ కుష్టరోగి చలికి బాగా వణికిపోతున్నాడు. తంబిగారు అతనిదగ్గరకు వెళ్ళగా, ఆ వ్యక్తి తంబిగారివంక దీనముగా చూసాడు. అప్పుడు జోసఫ్ తంబి తాను కట్టుకున్న లుంగీని తీసి ఆతనిపై కప్పాడు. వెంటనే, అద్భుతరీతిన ఇంకొక లుంగీ వచ్చి జోసఫ్ తంబిగారిని కప్పివేసింది.

ప్రియ సహోదరీ సహోదరులారా! ఆనాడు కుష్టరోగం. నేడు కరోన రోగం. ఇంకా ఎన్నో రోగాలతో బాధపడుతున్నాం. అన్నింటికన్న పెద్ద రోగమైన పాపరోగముతో బాధపడుచున్నాము. కుష్టరోగికి సహాయం చేసిన అదే తంబిగారు నేడు మన మధ్యలోనే ఉన్నారు. తన ప్రార్ధన ద్వారా మనకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నారు. మనపై పవిత్రత అనే వస్త్రమును కప్పుటకు సిద్ధముగా ఉన్నారు.  

1. మన పాపము వలన ఈ కుష్టరోగులవలె మనము కూడా దేవుని ఎదుట ఆశుద్దులమే! కనుక మొదటిగా మనము దేవున్ని ప్రార్ధించాలి. దేవుని కనికరము కొరకు ప్రార్ధించాలి. వారివలె మనము కూడా “ఓ యేసుప్రభువా! మమ్ము కనికరింపుము” అని గొంతెత్తి కేకలు పెట్టాలి, గొంతెత్తి ప్రార్ధించాలి. యేసుప్రభువు తప్పక ఆలకిస్తాడు. వారు స్వస్థత కొరకు ప్రార్ధన చేయలేదు. అద్భుతం కొరకు ప్రార్ధన చేయలేదు. దేవుని కనికరము కొరకు ప్రార్ధన చేసారు. స్వస్థతకు అర్హులని వారు భావించారు. పాపముతో నిండిన మనం ఇదే వైఖరితో దేవుని యొద్దకు రావాలి. దేవుడు మనపై కనికరం చూపుతాడు. ఆయన కనికరముగల దేవుడు. రోమీ 10:12-13లో ఇలా చదువుచున్నాము: “తనను ప్రార్ధించు వారిని అందరిని ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలయన, ప్రభు నామమున ప్రార్ధించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును.”

2. మన విశ్వాసం పరీక్షింప బడును: యేసు వారిని చూచి, “మీరు వెళ్లి యాజకులకు కనిపింపుడు” అని చెప్పాడు. వారి విశ్వాసానికి పెద్ద పరీక్ష. ఆ పదిమంది పది రకాలుగా ఆలోచించి ఉండవచ్చు. స్వస్థత లేకుండా, అసలు యాజకులు మమ్ములను కలువనిస్తారా అని ఒకరు, ఇదే మనకున్న చివరి అవకాశం, ఆశ అని ఇంకొకరు అనుకోవచ్చు! రెండవ రాజుల గ్రంధములో చూస్తున్నాము (5వ అధ్యాయం).

సిరియారాజు సైన్యాధిపతి అయిన నామాను మహాశూరుడు, కాని కుష్టరోగి. ఎలీషా వద్దకు రాగా, “నీవు వెళ్లి యోర్దాను నదిలో ఏడు సార్లు స్నానము చేయుము. నీ శరీరమునకు మరల ఆరోగ్యము చేకూరును” అని చెప్పాడు. అందుకు నామాను ఉగ్రుడయ్యాడు. మా దేశములో నదులు లేవా? అక్కడ మునిగి ఆరోగ్యము పొందలేనా? అని ప్రశ్నించాడు. ఆయన విశ్వాసానికి పరీక్ష. ప్రవక్తను ప్రశ్నించాడు. కాని, తరువాత నామాను ఎప్పుడైతే, తన తప్పును తెలుసుకొని, యిశ్రాయేలు దేవుడు తప్ప మరియొక దేవుడు లేడని అంగీకరించినప్పుడు, ఆయన స్వస్థత పొందాడు.

మరి ఈ పదిమంది కుష్టరోగులు ప్రభువు చెప్పింది చేసారు. అందుకే వారు మార్గ మధ్యముననే శుద్ధి పొందారు. వారు అడుగకపోయినను యేసు వారిని స్వస్థపరచాడు.

3. యేసు స్వస్థతను గమనించాలి: దేవుడు మన జీవితములో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. స్వస్థతలు చేస్తున్నాడు. మనం గమనించడం లేదు. అందుకే మనం దేవున్ని స్తుతించలేక పోవుచున్నాము. ఆరాధించలేక పోవుచున్నాము. ఘనపరచలేక పోవుచునన్నాము. మహిమపరచలేక పోవుచున్నాము.

అద్భుత వ్యక్తి అయిన బ్రదర్ జోసఫ్ తంబిగారి మధ్యస్థ ప్రార్ధనల ద్వారా మనం ఎన్నో మేలులు పొంది ఉంటాము. ఆ కుష్టరోగివలె మనం గమనించాలి. గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి, యేసు పాదములవద్ధ సాగిలపడి కృతజ్ఞత తెలిపాడు. యాజకుల వద్దకు వెళ్ళకుండా, యేసు ప్రభువే యాజకులకు యాజకుడని గుర్తించి తిరిగి ఆయన వద్దకు వచ్చాడు. ఈరోజు మనం చేయవలసినది అదే. దేవుడు మన జీవితములో చేసిన అద్భుత కార్యాలను గమనించి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం.

దైవసేవకుడు బ్రదర్ జోసఫ్ తంబిగారి మహోత్సవాలను ముగుంచుకొను మనము కృతజ్ఞత కలిగిన హృదయాలతో దేవున్ని స్తుతిస్తూ తిరిగి వెళదాం. జోసఫ్ తంబి గారు మనకోసం ఎల్లప్పుడూ ప్రార్ధన చేయుగాక! దేవుడు మనలనందరినీ దీవించుగాక!

4. పౌలు ఫిలేమోనునకు వ్రాసిన లేఖ

 4. పౌలు ఫిలేమోనునకు వ్రాసిన లేఖ
4.1. ఉపోద్ఘాతము
4.2. లేఖ వ్రాయు సందర్భము
4.3. లేఖ ప్రాముఖ్యత
4.4. లేఖ సారాంశము
4.4.1. లేఖను పంపినవారు (1)
4.4.2. లేఖను పొందినవారు, శుభాకాంక్షలు (1-3)
4.4.3. కృతజ్ఞత, ప్రార్ధన (4-7)
4.4.4. ఓనేసిమును గూర్చిన మనవి (8-22)
4.4.5. ముగింపు: తుది శుభాకాంక్షలు (22-25)

4.1. ఉపోద్ఘాతము

పౌలు లేఖలలో అతి చిన్న లేఖ. కేవలము 25 వచనాలు. ఫిలేమోను అను వ్యక్తికి ఎంతో సున్నితముగా వ్రాయబడినది. ఫిలేమోను ఆసియా మైనరులోని లికుస్ లోయలలోని కొలొస్సీయ వాస్తవ్యుడు. ఫిలేమోనుతో పాటు ఆప్ఫియకు (బహుశా ఫిలేమోను భార్య), అర్కిప్పునకు (బహుశా వారి కుమారుడు) మరియు దైవ సంఘమునకు పౌలు ఈ లేఖను వ్రాయుచున్నాడు (ఫిలే. 1:2). ఫిలేమోను పౌలుచేత విశ్వాసమును పొందియున్నాడని 1:19 వచనంద్వారా తెలియుచున్నది. ఫిలేమోను యింట దైవసంఘము ప్రార్ధనకు గుమికూడెడిది. ఫిలేమోను నివసించు ప్రాంతము బహుశా పౌలు ప్రేషిత పరిచర్య ఫలితం అయుండవచ్చు.

పౌలు ఈ లేఖను చెరనుండి వ్రాసాడు (ఫిలే. 1:1, 9-10, 13, 23). బహుశా, పౌలు ఎఫెసు చెరలో ఉండగా (క్రీ.శ. 56-57) వ్రాసియుండవచ్చు.

4.2. లేఖ వ్రాయు సందర్భము

ఫిలేమోనుకు ఒనేసిము అనే బానిస ఉండేవాడు. అతడు యజమాని యింటినుండి పారిపోయి రోము నగరములోని చెరలో నున్న పౌలు వద్దకు చేరుకున్నాడు (ఫిలే. 1:11, 18). పౌలుపై ఫిలేమోనుకు ఉన్న గౌరవ మర్యాదల గురించి ఒనేసిము బాగా ఎరిగి యున్నాడు. ఏదో విధముగా, పౌలు ఒనేసిముకు ఆశ్రయ మిచ్చి, చివరికి అతనిని క్రైస్తవ విశ్వాసములోనికి నడిపించియున్నాడు. ఈ క్రమములో ఒనేసిము ఫిలేమోను బానిస అని పౌలు తెలుసుకున్నాడు. తన ప్రేషిత పరిచర్యలో సాయము చేయుటకు ఒనేసిమును తనతోపాటే ఉంచదలచుకొన్నను, ఫిలేమోను హక్కును గుర్తించి తిరిగి ఒనేసిమును ఫిలేమోను వద్దకు పంపదలచ పౌలు నిర్ణయించుకున్నాడు (ఫిలే. 1:14, 16).

ఆకాలములో బానిసత్వం చట్టపరమైనది. యజమానినుండి పారిపోయిన బానిసలపట్లగాని, వారికి సహాయము చేసిన వారిపట్లగాని తీవ్రముగా వ్యవహరించెడివారు. ఒనేసిము విషయములో పౌలుకున్న బాధ్యత ఏమనగా, ఫిలేమోనుతో అతనిని సఖ్యపరచి తిరిగి పంపడమే. బానిసత్వ చట్టం ప్రకారం, ఒనేసిము ఫిలేమోను వద్దకు తిరిగి రావలసి ఉంది. 1 కొరి. 7:21-24 మరియు ఎఫెసీ. 6:5-9 ప్రకారం, ఆనాటి సామాజిక వ్యవస్థను అంగీకరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందులకే, ఒనేసిమును ఫిలేమోను వద్దకు పంపుటకు నిర్ణయించుకున్నాడు. అయితే, పౌలు ఒనేసిముతో ఫిలేమోనుకు ఒక లేఖను వ్రాసి పంపుచున్నాడు. ఈ లేఖ సారాంశం ఏమిటంటే, యజమానుడు అయిన ఫిలేమోను బానిస అయిన ఒనేసిము మధ్యనున్న బంధానికి పౌలు ఒక కొత్త నిర్వచనాన్ని ఇస్తున్నాడు. “ఇప్పుడు అతడు సేవక మాత్రుడు కాడు. సేవకుని కంటె ఎన్నియో రెట్లు అధికుడు. అతడు ప్రత్యేకముగ నాకు ప్రియ సహోదరుడు. ఇక శరీర విషయమున, ప్రభువు విషయమున, నీకు అతడు ఎంతటివాడు కాగలడో! కనుక, నన్ను నీ భాగస్వామిగ నీవు ఎంచినచో, నాకు నీవు స్వాగత మిచ్చునట్లే అతనికి స్వాగత మిమ్ము. అతడు నీకు ఏమైన ఋణపడి ఉన్నను, అది నా లెక్కలో కట్టుకొనుము” (ఫిలే. 1:15-18).

పారిపోయిన బానిసయైన ఒనేసిమును ఇక “సేవకునిగగాక, ప్రియ సహోదరునిగ” (1:16) తిరిగి స్వాగతించమని పౌలు ఫిలేమోనును వేడుకొనుచున్నాడు. చట్టరీత్యా అతనిపై ఎలాంటి శిక్షకు గురిచేయవద్దని తెలియజేయు చున్నాడు. అతడు ఏమైన ఋణపడి ఉన్నను పౌలు తన లెక్కలో కట్టుకొనుము అని చెప్పియున్నాడు.

ఒనేసిము: కొలోస్సీ. 4:9 ప్రకారం, ఒనేసిము కొలొస్సీయుడని అర్ధమగుచున్నది. బహుశా కొలోస్సీ. 4:17లో చెప్పబడిన అర్కిప్పు బానిస అయి ఉండవచ్చు. బహుశా, ఒనేసిము తరువాత తిరిగి వచ్చి పౌలు ప్రేషిత పరిచర్యలో సహాయకుడిగా పనిచేసి ఉండవచ్చు. ఒనేసిము అనగా ‘ఉపయోగపడు’ అని అర్ధము.

4.3. లేఖ ప్రాముఖ్యత

ఈ లేఖ ఫిలేమోను పేర వ్రాయబడినప్పటికిని, ఫిలేమోను కుటుంబముతో సహా, వారి గృహము వద్ద సమావేశమగు దైవ సంఘమునకు వ్రాయబడినది. పౌలు తన అపోస్తోలికత్వ అధికారముతో ఫిలేమోనును శాసించే సాహసము కలిగి యున్నాడు (ఫిలే. 1:8). గమనించ వలసిన విషయాలు: (అ). బానిసయైన ఒనేసిము పట్ల పౌలు చూపించిన ఆప్యాయత, (ఆ). ఒనేసిమును తిరిగి ఫిలేమోను వద్దకు పంపడము వలన, పౌలు ఆనాటి సమాజములో నున్న బానిసత్వమును నిర్మూలించుటకు ప్రయత్నం చేయలేదు, (ఇ). బానిసత్వమను సామాజిక వ్యవస్థను దైవ సంఘములో పౌలు మార్చడానికి ప్రయత్నం చేసాడు.

ఒనేసిమును సహోదరునిగా స్వీకరించమని ఫిలేమోనును పౌలు కోరుచున్నాడు, ఎందుకన, “ప్రభువుచే పిలువబడిన సేవకుడు ప్రభువునకు చెందిన స్వతంత్రుడే. అట్లే క్రీస్తుచే పిలువబడిన స్వతంత్రుడు ఆయనకు సేవకుడే” (1 కొరి. 7:22). అలాగే, “క్రీస్తులో జ్ఞానస్నానము వారు క్రీస్తును ధరించి యున్నారు. కావున, యూదుడని, అన్యుడని లేదు. బానిసని, స్వతంత్రుడని లేదు. స్త్రీయని, పురుషుడని లేదు. క్రీస్తు యేసు నందు అందరు ఒక్కరే” (గలతీ. 3:27-28).

4.4. లేఖ సారాంశము

4.4.1. లేఖను పంపినవారు (1)

పౌలు ఈ లేఖను వ్రాసినప్పటికిని, పౌలుతో పాటు తిమోతి పేరు కూడా పేర్కొనబడింది (1). పౌలు తననుతాను ‘క్రీస్తుయేసు కొరకు బందీ’యని చెప్పుకొనియున్నాడు. వాస్తవముగా, పౌలు క్రీస్తు కొరకు ప్రస్తుతం ఎఫెసు చెరలో ఉన్నాడు. అలాగే, పౌలు తన జీవితాన్ని సంపూర్ణముగా క్రీస్తుకు అంకితం చేసుకొని క్రీస్తు బందీ అయ్యాడు.

4.4.2. లేఖను పొందినవారు, శుభాకాంక్షలు (1-3)

ప్రధానముగా, ఈ లేఖను స్వీకరించినది ఫిలేమోను, “సహోదరియగు ఆప్ఫియ, తోడి సైనికుడగు అర్కిప్పు మరియు దైవసంఘము.” కనుక, ఈ లేఖ ఫిలేమోనునకు వ్యక్తిగతముగా వ్రాసిన లేఖ ఎంతమాత్రము కాదు. ఫిలేమోను యింట సమావేశమగు దైవసంఘమునకు వ్రాయబడినది. పౌలు ఈ లేఖ ద్వారా రెండు విషయాలను సాధిస్తున్నాడు: ఒకటి, పౌలు, ఓనేసిమును గూర్చి, ఫిలేమోనునకు చేయు తన వ్యక్తిగత అభ్యర్ధనను అక్కడనున్న దైవసంఘమునకు కూడా తెలియజేయు చున్నాడు. తన అభ్యర్ధనను ఫిలేమోను తప్పక నెరవేర్చుటకు, దైవసంఘమునుండి ఒత్తిడిని పెంచుతున్నాడు. రెండవది, పౌలు అభ్యర్ధనను దైవసంఘము ఎదుట తిరస్కరించుటకు, ఫిలేమోను ఇబంది పడవచ్చు. పౌలు అభ్యర్ధనను ఫిలేమోను తిరస్కరించినను, దైవసంఘము అతనిని వేడుకొనే అవకాశం ఉంటుంది. 3వ వచనములో పౌలు దైవసంఘమునకు తన శుభాకాంక్షలను తెలియజేయు చున్నాడు.

4.4.3. కృతజ్ఞత, ప్రార్ధన (4-7)

క్రీస్తునందు మరియు తోటి క్రైస్తవులపట్ల ఫిలేమోనుయొక్క విశ్వాసమును, ప్రేమను పౌలు జ్ఞాపకము చేసుకొంటూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేయు చున్నాడు. పౌలు ఫిలేమోను మంచి క్రైస్తవుడని నొక్కిచెప్పుట వలన, ఓనేసిమును గూర్చి ఫిలేమోనునకు తన అభ్యర్ధనను తెలియజేయుటకు సంసిద్ధము చేయుచున్నాడు.

4.4.4. ఓనేసిమును గూర్చిన మనవి (8-22)

ఫిలేమోనును విధేయించమని శాసించే అధికారము అపోస్తలునిగా పౌలుకు ఉన్నదని గుర్తుచేయుచున్నాడు. అయితే, పౌలు ఆజ్ఞను జారిచేయడానికి బదులుగా, ఫిలేమోను సానుభూతి చూపాలని “తోటి క్రైస్తవుడు” ఓనేసిము తరుపున మనవి చేయుచున్నాడు.” (8-9). ఓనేసిముకు తండ్రిగా మారానని పౌలు తెలియజేస్తూ, తన బిడ్డ కొరకు ఈ మనవి చేయుచున్నాను అని వ్రాయుచున్నాడు (10). ఓనేసిము అనగా ‘ఉపయోగపడు’ అని అర్ధము. ఆ నామార్ధముగానే, ఒకప్పుడు ఉపయోగములేని ఓనేసిము ఇప్పుడు ఉపయోగపడును అని పౌలు ప్రకటించు చున్నాడు. “సువార్త కొరకు చెరయందు ఉన్నపుడు నీకు బదులుగా నాకు సాయపడును” (13) అని ఓనేసిము ఎలా ఉపయోగపడునో పౌలు స్పష్టముగ చెప్పియున్నాడు.

ఓనేసిమును తన వద్దనే ఉంచుకొనవలయునని ఉన్నదని పౌలు స్పష్టముగా చెప్పుచునే, అతనిని ఫిలేమోను వద్దకు, రెండు కారణాల వలన తిరిగి పంపుచున్నాడు: (అ). ఓనేసిము, ఫిలేమోను సేవకుడు కనుక, ఫిలేమోను సమ్మతి లేకుండా ఓనేసిమును పౌలు ఉంచుకొనవలయునని ఆశించలేదు. (ఆ). ఓనేసిమును సేవలు నిర్బంధముగా కాకుండా, స్వచ్చందముగా ఇవ్వాలని పౌలు ఆశిస్తున్నాడు. ఫిలేమోను, పౌలును భాగస్వామిగ ఎంచి, ఎలా స్వాగతిస్తున్నాడో, అలాగే ఓనేసిమును కూడా స్వాగతించాలని పౌలు కోరుచున్నాడు (17). ఓనేసిము ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసము వలన క్రైస్తవునిగా, సహోదరునిగా మారాడు. కనుక, పారిపోయిన తన సేవకుడిని, ఎలాంటి శిక్షకు గురిచేయకుండా ఫిలేమోను స్వాగతించవలెను. ఫిలేమోనుపట్ల ఓనేసిము ఏదైనా తప్పుచేసి యున్నను లేక ఏమైన ఋణపడి యున్నను అది తన లెక్కలో కట్టుకొనుము అని పౌలు తెలియజేయు చున్నాడు. ఆత్మ విషయములో ఫిలేమోను పౌలుకు ఋణపడి యున్నాడు కాబట్టి, ఈ ఉపకారము చేయుట వలన, తిరిగి ఋణము తీర్చుకొనే అవకాశము  ఫిలేమోనుకు వచ్చినదని పౌలు గుర్తుచేయు చున్నాడు.

తాను కోరినట్లు చేయునని, నిజముగ తాను చెప్పిన దాని కంటే ఎక్కువయే ఫిలేమోను చేయునని పౌలు దృఢమైన నమ్మకముతో ఈ లేఖను వ్రాయుచున్నాడు.

4.4.5. ముగింపు: తుది శుభాకాంక్షలు (22-25)

తన చెర కాలము త్వరలో ముగియునని ఆశిస్తూ, కొలోస్సీ నందుయున్న ఫిలేమోనును, దైవసంఘమును సందర్శించాలని భావిస్తూ, తన కోసం ఒక వసతి గదిని సిద్ధము చేయుమని పౌలు, ఫిలేమోనును కోరుచున్నాడు. బందీయైన తన తోడి ఎపఫ్రా (కొలోస్సీ. 1:7, 4:12), తన తోడి పనివారైన మార్కు, అరిస్టార్కు (కొలోస్సీ. 4:10-11), దేమా, లూకా యొక్క శుభాకాంక్షలను అందజేయుచున్నాడు (23-24). పౌలు తన లేఖను ఆశీర్వచనాలతో ముగిస్తున్నాడు (25).

దైవసేవకుని 75వ వర్ధంతి మహోత్సవాలు

దైవసేవకుని 75వ వర్ధంతి మహోత్సవాలు (Editorial, "Thamby Velugu" January 2020)

ప్రియ ‘‘తంబి వెలుగు’’ పాఠకులారా!
జనవరి మాసం రాగానే, మనకందరికీ ‘దైవసేవకుడు’ బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి వర్ధంతి మహోత్సవాలు గుర్తుకొస్తాయి. 13,14,15 తారీఖులలో అవుటపల్లిలోని ఆ మహాశయుని సమాధిని దర్శించుకొని, ప్రార్ధించి, దివ్యపూజాబలిలో పాల్గొని, మొక్కుబడులు చెల్లించుకొని, క్రీస్తు యేసు శాంతి, సమాధానము పొందుకొని సంతోషంతో, ఆనందముతో యింటికి తిరిగి వెళ్లాని బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి భక్తుంలందరూ ఎదురుచూస్తూ ఉంటారు.

ఈ సంవత్సరం బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి 75వ వర్ధంతి మహోత్సవాలు. ఆ పునీతుడు మరణించి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. దేవుని పట్ల భయభక్తులుగలు వారికి ఆయన మధ్యస్థ ప్రార్ధన ద్వారా ఎన్నో మేలులు అద్భుతాలు చేస్తున్నారు. దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ మహనీయుని గురించి తెలుసుకుందాం... 

కుటుంబము, బ్యాము, యౌవ్వనము
బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి తల్లిదండ్రులు తంబుసామి శవరిముత్తు, రోసమల్లె మరియ (అన్నమలె). వీరి స్వస్థం దక్షిణ భారతదేశముననున్న తమిళనాడు రాష్టములోని పాండిచ్చేరి సమీపములోని ‘కరైకల్‌’ గ్రామము. తండ్రి శవరిముత్తు ప్రభుత్వ ఉద్యోగి. తల్లి రోసమల్లె మరియ గృహిణి.

ఉద్యోగం నిమిత్తమై, శవరిముత్తు తన భార్యను తీసుకొని ఆగ్నేయ ఆసియాలోని ‘సైగోన్‌’ దేశమునకు వెళ్ళాడు. వారు ఆచటనుండగనే, 11 నవంబరు 1890వ సంవత్సరములో వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. ఆ ముద్దు బిడ్డకు ‘రాయప్ప జోసఫ్‌ శౌరి’ అని పేరును పెట్టారు. అయితే, ప్రస్తుతం, ‘బ్రదర్‌ జోసఫ్‌ తంబి’గా ప్రసిద్ధి గాంచారు.

జోసఫ్‌ తంబికి రెండేళ్ళ వయస్సు ఉన్నప్పుడు, అనగా 1892వ సంవత్సరములో శవరిముత్తు, రోసమల్లె మరియు తన కుమారుని తీసుకొని భారత దేశమునకు తిరిగి వచ్చారు.

జోసఫ్‌ తంబికి ఏడు సంవత్సరము వయస్సు ఉన్నప్పుడు అనగా 1897వ సంవత్సరములో తల్లి రోసమల్లె మరియ మరణించినది. అప్పుడు అతని తండ్రి శవరిముత్తు ‘మేరి తెరేసా’ను రెండవ వివాహము చేసుకున్నాడు. అయితే సవతి తల్లి జోసఫ్‌ తంబిని ఇష్టపడలేదు. రోజూ చిటపటలు, చికాకులే! జోసఫ్‌ తంబిని ఎన్నో హింసలకు గురిచేసింది. రోజూ సరిగా భోజనం కూడా పెట్టేది కాదు.

సవతి తల్లి పెట్టే హింసలను, బాధలను తాళలేక జోసఫ్‌ తంబి యింటిని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. యింటినుంచి పారిపోయిన తంబి కేరళ రాష్ట్రమునకు వెళ్ళాడు. ఎర్నాకుళం అను ప్రదేశములో ఒక పుణ్యాత్మురాలి చల్లని పిలుపు తంబికి వినబడినది. ఆమె సంరక్షణలో, ఆలనాపాలనలో, ఊరడింపులో, ఆదరణలో విద్యాబుద్ధులు నేర్చుకొంటూ పెరిగాడు. నిండైన ఆత్మవిశ్వాసములోను, క్రైస్తవ విశ్వాసములోను అంచలంచలుగా ఎదిగాడు.

పెరిగి పెద్దవాడైన జోసఫ్‌ తంబి, శ్రీసభ విశ్వాసములో ఎదిగాడు. కేరళలోని ‘వేరాపొలి’ మేత్రాసణములోను, ఆ తరువాత కార్మలైట్‌ మిషనరీ ఆధ్వర్యములోను జోసఫ్‌ తంబి, గురువుకు సహాయకునిగా ఉంటూ, ఉపదేశిగా దైవ సన్నిధిలో తన సేవను అందించియున్నాడు.

మానవత్వమున్న ప్రతీ మనిషిలో కన్నవారిపై, తోబుట్టువులపై, బంధువులపై, ఆప్తులపై మరచిపోలేని మమకారాలు సహజముగా ఉంటాయి. జోసఫ్‌ తంబి తరచుగా స్వస్థలమును సందర్శించేవాడు. కాని ఎవరును ఆయనను గుర్తించేవారు కాదు, ఎందుకన, భిక్షాటన చేస్తూ వెళ్ళేవాడు.

వేషం మారింది, రూపం మారింది, వయోజనుడయ్యాడు. అందుకే ఎవరూ తనను గుర్తింప లేకపోయిరి. ఒకానొక సందర్భములో కన్నతండ్రి కూడా అతనిని గుర్తించలేదు. ఒక అణా ధర్మం చేసి పంపించివేసాడు. జోసఫ్‌ తంబి కూడా తన గురించి ఎవరికి చెప్పేవాడు కాదు.

అయితే, ఒకసారి, అతని బంధువుని అంత్యక్రియలో పాల్గొనుటకు వచ్చిన జోసఫ్‌ తంబిగారిని అతని నాయనమ్మ గుర్తించడం జరిగింది. ఈవిధముగా, జోసఫ్‌ తంబిగారి ప్రారంభ జీవితము కొనసాగినది.

పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ ‘తృతీయ సభ’ సభ్యుడు
కేరళలోని ‘వేరాపొలి’ మేత్రాసణములో కార్మలైట్‌ మిషనరీ ఆధ్వర్యములో జోసఫ్‌ తంబి      ఉపదేశిగా తన సేవను అందించుచున్న సమయములోనే, కార్మలైట్‌ మిషనరీ ద్వారా 1929 లేదా 1930 సంవత్సరాలో ‘కొల్లం’ (‘కోయిలోన్‌’) అను ప్రదేశానికి, ఫ్రెంచ్‌ కపూచిన్‌ మిషనరీ ఆగమనం గురించి జోసఫ్‌ తంబిగారు తెలుసుకొని యున్నాడు. జోసఫ్‌ తంబి ఫ్రెంచ్‌ పౌరసత్వమును కలిగియుండటము వలన, అలాగే ఫ్రెంచ్‌ భాషకూడా వచ్చియుండుట వలన, ఫ్రెంచ్‌ కపూచిన్‌ మిషనరీలను కలుసుకొనుటకు ఆసక్తిని చూపాడు.

ఈవిధంగా, జోసఫ్‌ తంబి ఫ్రెంచ్‌ కపూచిన్‌ మిషనరీలను ‘కొల్లం’ అను ప్రదేశములో కలుసుకొని, వారితో కొంత కాలము గడిపియున్నాడు. బహుశా, సభలో చేరి కపూచిన్‌ మఠసభ సభ్యునిగా అగుటకు నిర్ణయించుకొని కూడా ఉండవచ్చు. ఆ కాలములో కపూచిన్‌ సభలో చేరిన ఆరంభములోనే పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారి ‘తృతీయ సభ’కు చెందిన అంగీని ఇచ్చెడివారు. ఆవిధముగానే, జోసఫ్‌ తంబి 1930వ సంవత్సరములో ‘కొల్లం’లోని కపూచిన్‌ మఠములో చేరినప్పుడు ‘తృతీయ సభ’కు చెందిన అంగీని స్వీకరించి ధరించాడు.

ఆరంభ తర్ఫీదు అనంతరం, కపూచిన్‌ మఠవాసు జోసఫ్‌ తంబిని తరువాతి తర్ఫీదునకు తీసుకొనుటకు నిరాకరించారు. దీనికి ముఖ్య కారణం, జోసఫ్‌ తంబి కుడికాలు బోదకాులు అగుటవన, అలాగే తరుచూ భక్తి భావోద్రేకములకు లోనై మూర్చవ్యాధి లక్షణములను కలిగియుండుట వలన, మఠమును వీడి వెళ్ళవసి వచ్చినది. మఠమును వీడినప్పటికిని ‘తృతీయ సభ’ అంగీని ధరించే అనుమతి ఉండెడిది. ఈవిధంగా, జోసఫ్‌ తంబి కపూచిన్‌ సభ మఠమును వీడినప్పటికిని, స్థానిక మేత్రాణుల అనుమతితో తృతీయ సభ అంగీని ధరించియున్నాడు. బహుశా జోసఫ్‌ తంబి 1933వ సంవత్సరములో కపూచిన్‌ సభ మఠమును వీడి ఉండవచ్చు. కపూచిన్‌ సభ మఠమును వీడిన తరువాత, అనేక సార్లు స్వస్థలమైన పాండిచ్చేరిని సందర్శించి అచ్చటి ప్రజలకు అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారు స్థాపించిన ‘తృతీయ సభ’ గురించి తెలియజేశాడు. అస్సీసిపుర ఫ్రాన్సిస్‌వారి జీవితమును ఆదర్శముగా తీసుకొని, తాను ఎక్కడికి వెళ్ళినను ‘తృతీయ సభ’ను గూర్చి తెలియజేస్తూ, సభ సంఘాలను లేదా శాఖలను ఏర్పాటు చేస్తూ తన జీవితాన్ని కొనసాగించాడు.

ఈవిధముగా, తను ఎక్కడికి వెళ్ళినను ఫ్రాన్సిస్‌వారి ‘తృతీయ సభ’ను వ్యాప్తిచేయుటకు  ప్రయత్నం చేసాడు. పాండిచ్చేరిలో ప్రజలు జోసఫ్‌ తంబిగారిని ఎంతో ఆప్యాయంగా ఆదరించేవారు. ప్రేమగా ఆయనను ‘‘తంబి’’ అని పిలిచేవారు.

‘మణత్తిడల్‌’లో దైవసేవ, తృతీయ సభ స్థాపన
1933వ సంవత్సరములో, జోసఫ్‌ తంబి పాండిచ్చేరిని వీడి ప్రస్తుతం ‘కుంభకోణం’ అతిమేత్రాసణములో ఉన్న ‘మణత్తిడల్‌’ గ్రామమునకు వెళ్ళారు. అప్పటిలో ‘మణత్తిడల్‌’ గ్రామము ‘మైకేల్‌పట్టి’ అను విచారణ క్రింద ఉండెడిది. గురుశ్రీ జ్ఞానాధిక్యం వారు విచారణ గురువుగా ఉన్నారు. కొద్ది కాములోనే తన మంచి ప్రవర్తనతో, మాటలతో అచ్చటి ప్రజల మన్ననలను చూరగొన్నాడు. వారుకూడా జోసఫ్‌ తంబిగారిని గొప్ప దైవ సేవకునిగా గుర్తించారు. అచ్చటి ప్రజలు దేవాలయ ఆవరణలో ఒక చిన్న ఇంటిని నిర్మించి దానిలో ఉండుటకు ఏర్పాటు చేసారు. దేవాలయము వద్దకు తరచుగా ప్రజలను పిలచి ప్రార్ధనలు చేసేవారు. జబ్బు పడిన వారికి తనకు తెలిసిన ఆకులతో మందును తయారు చేసి ఇచ్చేవారు. ప్రార్ధనచేసి, వారి రోగాలను స్వస్థపరచేవారు. చిన్న పిల్లలకు సత్యోపదేశ సంక్షేపాన్ని బోధించేవారు. పిల్లలను ఎంతో ఆప్యాయముగా చేరదీసేవారు. వారు విధేయించని యెడల, వారి ఎదుట మోకరిల్లి విధేయించమని ప్రాధేయపడెడివారు.

‘మణత్తిడల్‌’ గ్రామములోనున్న కతోలిక క్రైస్తవులను, దివ్యపూజాబలిలో, ఆరాధనలో పాల్గొనడానికి, ప్రతీ ఆదివారము మరియు మొదటి శుక్రవారము ప్రోగుచేసి ‘మైకేల్‌పట్టి’ విచారణ దేవాలయమునకు తీసుకొని వెళ్లేవారు. 1933-1934 సంవత్సర కాలములో, జోసఫ్‌ తంబిగారు ‘మణత్తిడల్‌’ గ్రామములో అస్సీసిపుర ఫ్రాన్సిస్‌వారి ‘తృతీయ సభ’ను స్థాపించియున్నారు.

‘మణత్తిడల్‌’ గ్రామమును విచారణగా చేయడానికి జోసఫ్‌ తంబిగారు ఎంతగానో కృషి చేశారు. అప్పటి మేత్రాణుల వద్దకు వెళ్లి, ‘మణత్తిడల్‌’ గ్రామములో స్థానికముగా ఉండుటకు ఒక గురువును పంపుమని కోరియున్నారు. దాని ఫలితముగానే మేత్రాణులు గురుశ్రీ పి.ఎస్‌. ఇగ్నేషియస్‌ వారిని ‘మణత్తిడల్‌’ గ్రామమునకు పంపియున్నారు.

తమ ఆధ్యాత్మిక బాగోగులు చూసుకోవడానికి వారి మధ్యన ఒక గురువు వచ్చినందుకు ‘మణత్తిడల్‌’ ప్రజలు ఎంతగానో సంతోషించారు, సంబరపడ్డారు. కాని జోసఫ్‌ తంబిగారు మాత్రం వారితో, ‘‘ఇప్పుడు మీ ఆధ్యాత్మిక బాగోగులు చూసుకోవడానికి ఒక గురువు మీ మధ్యన ఉన్నారు. ఇక నేను మీనుండి సెవు తీసుకొని దైవసేవను కొనసాగించుటకు వేరొక చోటుకు వెళతాను’’ అని చెప్పియున్నారు. అది విన్న ప్రజలు ఎంతగానో బాధపడ్డారు. వెళ్లిపోవద్దని జోసఫ్‌ తంబిగారిని ఎంతగానో ప్రాధేయపడ్డారు. కాని జోసఫ్‌ తంబిగారు 1936వ సంవత్సరములో అచటనుండి సువార్తా నిమిత్తమై వేరొక చోటుకు వెళ్ళిపోయారు.

‘పచ్చమలై’కు పయనం
1936వ సంవత్సరములో ‘మణత్తిడల్‌’ గ్రామమునకు గురుశ్రీ ఇగ్నేషియస్‌ వారి రాకతో జోసఫ్‌ తంబిగారు ముందుగా ‘కొత్త పాల్యం’ అను విచారణకు వెళ్ళారు. అక్కడ విచారణ గురువులైన గురుశ్రీ అధిరూపం వద్ద పదిరోజులు ఉన్నారు. తక్కువ సమయములోనే గురుశ్రీ అధిరూపంతో జోసఫ్‌ తంబిగారికి చక్కటి స్నేహం ఏర్పడినది.

‘కొత్త పాల్యం’ నుండి ‘తొండమదురై’ అను స్థమునకు వెళ్లి అచటనుండి ‘పచ్చమలై’ అను మారుమూల గ్రామమునకు వెళ్లియున్నారు. ఇది ‘కొత్త పాల్యం’ విచారణకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ‘పచ్చమలై’ అనునది తిరుచునాపల్లి జిల్లాలోని కొండ ప్రాంతం. ‘కుంభకోణం’ మేత్రాసణములోని ‘తొండమన్‌దురై’ విచారణ సమీపములో ఉన్నది. ఇది గిరిజనుల ప్రాంతం. ఆ గ్రామములో జోసఫ్‌ తంబిగారు స్వయముగా ఒక గుడిసెను నిర్మించుకొని దానిలో నివసించేవారు. తను భిక్షాటన చేసి సంపాదించిన భోజనమును, దుస్తులను, సొమ్మును వారికి సహాయం చేసేవాడు. సాధారణముగా వారు ఎప్పుడు సగం దిగంబరులై ఉండేవారు. తరుచూ పాండిచ్చేరి వెళ్లి బట్టలను, సొమ్మును తీసుకొని వచ్చి తనవంతూ ఈ కొండజాతి ప్రజలకు సహాయం చేసేవారు. నిదానముగా వారికి దేవుని గూర్చి, దేవుని ప్రేమ, మహిమగూర్చి వివరించడం మొదలు పెట్టారు. ఒకరినొకరు సహాయం చేసుకోవాలని బోధించారు. జోసఫ్‌ తంబిగారు తనకు తెలిసిన నాటుమందు సహాయముతో వారికి వైద్య సహాయాన్ని అందించేవారు.

కేరళ రాష్ట్రములో...
తమిళనాడు నుండి కేరళ చేరుకున్న జోసఫ్‌ తంబి అనేక చోట్ల తిరిగి త్రిశూరు జిల్లాకు చేరుకున్నాడు. అచ్చట లతీను దేవాలయమును కనుగొని, ప్రతిరోజు క్రమం తప్పకుండా అక్కడ ఉన్నన్ని రోజులు దివ్యపూజలో పాల్గొన్నాడు. ఈ సమయంలో రాత్రులో ‘పుత్తూరు’ (‘పొన్నుకర’)లోని మిషన్‌ దేవాలయములో పడుకొనెడివాడు. అప్పుడప్పుడు సిరియన్‌ గురువు చేసే దివ్యపూజా బలిలో కూడా పాల్గొనేవాడు. జోసఫ్‌ తంబి తన ప్రేషిత సేవను ఎక్కువగా ‘ఎర్నాకులం,’ అనే ప్రాంతములో కొనసాగించి యున్నాడు. ‘కొచ్చిన్‌’ అను ప్రదేశములో వీధులో తిరిగుతూ పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌వారి గురించి, ‘తృతీయ సభ’ గురించి బోధించాడు. జోసఫ్‌ తంబి అక్కడినుండి వెళ్ళిపోయి ‘వీరాపోలి’ అగ్రమేత్రాసణ అగ్రపీఠాధిపతులైన జోసఫ్‌ అట్టిపెట్టి వారిని కుసుకున్నాడు. పీఠాధిపతులు జోసఫ్‌ తంబిని తన ఆధ్యాత్మిక జీవితమును జీవించుటను కొనసాగించుమని ప్రోత్సహించాడు. అగ్రపీఠాధిపతులైన జోసఫ్‌ అట్టిపెట్టి వారు జోసఫ్‌ తంబిగారిని ‘థెరేసియన్‌ సహోదరుల’ సభ కేంద్రమైన, త్రిశూరు జిల్లాలోని ‘పుత్తూర్‌’ అను స్థలమునకు వెళ్ళమని 1936వ సంవత్సరము చివరిలో కోరియున్నారు. అగ్రపీఠాధిపతులు ఇద్దరు థెరేసియన్‌ సహోదరును ‘పుత్తూరు’లో ఉంచియున్నారు. వారు ఆ విచారణలో తమ సేవలను అందిస్తూ ఉండేవారు. ‘పుత్తూరు’లో ఉంటూ, ఆ ఇరువురు సహోదరులకు తర్ఫీదు ఇవ్వుమని, ఆధ్యాత్మిక విషయాలలో వారికి సహాయము చేయమని పీఠాధిపతులు జోసఫ్‌ తంబిగారిని కోరియున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ - బిట్రగుంటలో పరిచర్య
1937వ సంవత్సరములో జోసఫ్‌ తంబిగారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమునకు ఏతెంచారు. మొదటగా నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట అను ప్రదేశములో నాలుగు నెలల పాటు ఉన్నారు. బిట్రగుంటలో తమిళనాడు నుండి రైల్వే ఉద్యోగులుగా పనిచేయుచున్నవారి మధ్యన తన ప్రేషిత కార్యాన్ని కొనసాగించారు. వారితో తమిళ భాషలో సంభాషించేవారు.

కేసరపల్లిలో పరిచర్య
1937వ సంవత్సరము చివరిలో జోసఫ్‌ తంబిగారు విజయవాడ నుండి 20 కి.మీ. దూరమున ఉన్న కేసరపల్లి గ్రామమునకు వచ్చియున్నారు. కేసరపల్లిలో పునీత పాదువాపురి అంథోని వారి పేరిట ఒక చిన్న దేవాలయము ఉన్నది. ప్రార్ధన చేసుకోవడానికి ఆ దేవాయములోనికి ప్రవేశిస్తుండగా, కొంతమంది అతనిని ‘పిచ్చివాడు’ అని భావించి అక్కడనుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేసారు. తెలుగు భాషకూడా అప్పటికి జోసఫ్‌ తంబిగారికి వచ్చేదికాదు, కనుక వారితో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడియున్నాడు. ఎక్కడనుండి వచ్చాడో, ఏ ఉద్దేశ్యం కొరకు వచ్చాడో ప్రజలకు కూడా ఏమీ అర్ధం కాలేదు.

నెమ్మదిగా, జోసఫ్‌ తంబిగారి విశ్వాస జీవితాన్ని, ప్రార్ధన జీవితాన్ని గమనించిన కొంతమంది కతోలిక క్రైస్తవులు పశ్చాత్తాప హృదయముతో వచ్చి గ్రామస్థులు చేసిన అవమానాలకు, దూషణలకు, వారిని క్షమించమని వేడుకున్నారు. జోసఫ్‌ తంబిగారు వారిని క్షమించడం మాత్రమేగాక, వారితో ఎంతో స్నేహపూర్వకమైన బంధాన్ని ఏర్పరచుకున్నారు.

కొద్ది కాలములోనే కేసరపల్లిలోని కతోలిక సంఘస్తుందరు కూడా, తమ బాగోగుపట్ల ఆసక్తిగల పుణ్యాత్ముడైన జోసఫ్‌ తంబిగారు వారి గ్రామములో ఉండటం సంతోషపడ్డారు. గ్రామస్తుందరూ కూడా జోసఫ్‌ తంబిగారంటే గౌరవం, ఇష్టం కలిగింది. పిల్లలు, పెద్దలు, ఉపాధ్యాయులు అందరు కూడా ఆయనను గౌరవించేవారు.

కేసరపల్లి గ్రామము, అవుటపల్లి విచారణకు అనుసంధానమైన గ్రామము. అయినప్పటికిని ఆదివారాలలో కూడా దివ్యపూజాబలి ఉండేది కాదు. అప్పుడప్పుడు మాత్రమే దివ్యపూజాబలి ఉండేది. కనుక, తరుచుగా, జోసఫ్‌ తంబిగారు విశ్వాసులను ప్రోగుచేసి దివ్యపూజాబలిలో పాల్గొనుటకు, ముఖ్యముగా ఆదివారములలోను, పండుగ రోజులలోను అవుటపల్లి విచారణ దేవాయమునకు తీసుకొని వెళ్ళేవాడు.

అవుటపల్లిలో నివాసం
అవుటపల్లి (పెదావుటపల్లి) గ్రామము విజయవాడ మేత్రాసనములోని పురాతన విచారణలో ఒకటి. 1925వ సంవత్సరములో అవుటపల్లి గ్రామము విచారణగా ఏర్పడిరది.

1939వ సంవత్సరమునుండి జోసఫ్‌ తంబిగారు తన నివాసాన్ని అవుటపల్లిలో ఏర్పరచుకున్నారు. అప్పటి విచారణ గురువు గురుశ్రీ జాన్‌ బి. కల్దెరారో ఇటలీ దేశస్థుడు. 14 సెప్టెంబరు 1927వ సంవత్సరములో అవుటపల్లికి చేరుకున్న వీరు 1 మార్చి 1928వ సంవత్సరములో విచారణ గురువుగా బాధ్యతలు తీసుకున్నారు. విచారణ గురువుగా 1969 వరకు కొనసాగారు. అవుటపల్లి గ్రామము జోసఫ్‌ తంబిగారి ఆధ్యాత్మిక కార్యాలకు ప్రధాన కేంద్రం అయ్యింది. 1939వ సంవత్సరము నుండి 1945వ సంవత్సరము వరకు ఇక్కడే నివసిస్తూ చుట్టుప్రక్క గ్రామాలలో సువార్తను బోధిస్తూ జీవించారు. విచారణ గురువుకు అన్ని విషయాలో తన వంతు సహాయ సహకారాలను అందించి యున్నారు. అతి త్వరలోనే అవుటపల్లి గ్రామస్తులు, అలాగే చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు జోసఫ్‌ తంబిగారు ఒక పుణ్యాత్ముడని గుర్తించారు.

చుట్టుప్రక్కల గ్రామాలో దైవసేవ
జోసఫ్‌ తంబిగారు అవుటపల్లిలో తన నివాసాన్ని ఏర్పరచుకున్నప్పటికిని, తరుచుగా దైవసేవ నిమిత్తమై చుట్టుప్రక్క గ్రామాలకు వెళుతూ ఉండేవారు. ‘‘అవుటపల్లి అపోస్తుడు’’గా పేరు గాంచిన జోసఫ్‌ తంబిగారు, చుట్టుప్రక్క గ్రామాలలో సాధ్యమైనంత వరకు ప్రజలను రక్షకుడైన క్రీస్తు రక్షణ ‘మార్గము’లో నడిపింపాలనే ధ్యేయముతో, సంకల్పముతో తన సువార్తా పరిచర్యను తనదైన శైలిలో కొనసాగించాడు. దైవాశీస్సులతో జోసఫ్‌ తంబిగారు తన ప్రేషిత కార్యమును అవుటపల్లి చుట్టుప్రక్క గ్రామాలలో విస్తరింప చేసియున్నాడు. జోసఫ్‌ తంబిగారు సందర్శించిన గ్రామాలు మానికొండ, తేలప్రోలు, ఉయ్యూరు, వట్లూరు, దెందుూరు, ఉప్పూరు, కేసరపల్లి, వేంపాడు, అజ్జంపూడి, అ్లపురం, భూతమల్లిపాడు, ప్రొద్దుటూరు, మర్రీడు, కోడూరుపాడు, కిష్టవరం, గొల్లపల్లి, వల్లూరుపాలెం, తొట్లవల్లూరు, అలాగే గుంటూరు జిల్లాలోని పాతరెడ్డిపాలెం మొదగునవి.

తుది ఘడియు...పరలోక పయనం
జోసఫ్‌ తంబిగారు తన మరణమును ముందుగానే ఎరిగియున్నాడు. దానికోసమై ఆధ్యాత్మికముగా సిద్ధపడ్డాడు. తాను 15 జనవరి 1945వ రోజున చనిపోతానని మూడు నెలలకు ముందుగానే కొంతమందితో చెప్పియున్నారు. దాని నిమిత్తమై మూడు నెలలకు ముందుగానే శవపేటికను చేయించుకొని తన గదిలో పెట్టించుకున్నాడు. అది 1944వ సంవత్సరం. క్రిస్మస్‌ పండుగ అయిపోగానే మానికొండ గ్రామమునకు వెళ్ళారు. 6 జనవరి 1945న తీవ్ర జ్వరముతో అవుటపల్లిలోని తన నివాసానికి తిరిగి వచ్చారు. 15 జనవరి 1945 రానే వచ్చింది. ఆరోగ్యము బాగా లేకున్నను ఆరోజు ఉదయము దేవాలయములోనికి తీసుకొని పోవసినదిగా అక్కడ ఉన్నవారిని అడిగారు. జోసఫ్‌ తంబిగారు నీరసముగా ఉన్నప్పటికిని బోయపాటివారి యింటికి చేరుకున్నాడు. వారి యింటిలో తానే స్వయముగా నిర్మించి, అస్సీసిపుర ఫ్రాన్సిస్‌వారికి అంకితం చేసిన పీఠము చెంత మడత కుర్చీలో కూలబడ్డారు. బోయపాటి దంపతులు బాధతో, ఆశ్చర్యముతో జోసఫ్‌ తంబిగారినే చూస్తూ ఉండిపోయారు, ఎందుకన తాను మరణిస్తానని చెప్పిన రోజు అదే కనుక!
సాయంత్రం నాలుగు గంటలకల్ల, జోసఫ్‌ తంబిగారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇక ఏమీ మాట్లాడలేక పోతున్నారు. ఆ తదుపరి సాయంత్రం ఐదు గంటల సమయానికి తన తుది శ్వాస విడిచారు.

దైవ సేవకుడు బ్రదర్‌ జోసఫ్‌ తంబి

దైవ సేవకుడు బ్రదర్‌ జోసఫ్‌ తంబి (Editorial, "Thamby Velugu" Jan 2019)

తంబిగారి భక్తులకు, ‘తంబి వెలుగు’ పాఠకులకు జనవరి మాసము రాగానే గుర్తుకు వచ్చేది, పెదావుటపల్లిలో జరిగే బ్రదర్‌ జోసఫ్‌తంబి గారి మూడురోజుల మహోత్సవములు (జనవరి 13,14,15). ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాష్ట్రాలనుండి ఎన్నో వేలమంది క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవేత్తరులు ఈ మహోత్సవములో పాలుగొని తంబిగారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా, దైవాశీస్సులను, అనుగ్రహాలను, మేులులను, అద్భుతాలను, శాంతి, సమాధానములను పొంది సంతోషముతో తిరిగి వెళ్లుచున్నారు. వారి జీవితాలో జరిగిన అద్భుతాలకు, మేులులకు సాక్ష్యమిస్తూ ఉన్నారు.
దైవసేవకుడైన బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి జీవితంలో ఎన్నో ప్రత్యేకతులున్నాయి. అద్భుత వ్యక్తిగా పేరుగాంచాడు, ఆయన బ్రతికుండగానే ఎన్నో అద్భుతాలు చేసాడు, ఎంతో మందికి స్వస్థతను చేకూర్చాడు. వివిధ  రాష్ట్రాలో(తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌)  సువార్తను బోధించాడు, గ్రామగ్రామాలకు వెళ్ళి యేసు శుభవార్తను తనదైన శైలిలో బోధించాడు. ప్రజలతోనే ఉండి వారు ఇచ్చిన బోజనాన్ని భుజించేవాడు, ఇచ్చిన స్థములో నివాసముండెడివాడు.
పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారి వలె పేదరికాన్ని హత్తుకొని జీవించాడు. ఫ్రాన్సిస్‌వలె పూర్తిగా దేవునిపై ఆధారపడి జీవించాడు. పేదవారిపట్ల ఎనలేని ఇష్టాన్ని కలిగియున్నాడు. తన జీవితాదర్శము ద్వారా, సువార్త ప్రచారాన్ని కొనసాగించాడు. ప్రజలను ప్రార్థనలో, దివ్యపూజా బలిలో పాల్గొనాలని ప్రోత్సహించాడు.
హైదరాబాద్‌ అగ్రపీఠాధిపతులు మారంపూడి జోజిగారు చెప్పినట్లుగా, ‘‘బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి వినయపూర్వక జీవితం, ఉత్సాహపూరిత ప్రేషిత కార్యం పెదావుటపల్లిలోను, చుట్టుప్రక్కల విచారణ గ్రామాలోని వట్లూరు, కేసరపల్లి, మానికొండ,          ఉప్పులూరులోను ఆయన దైవాంకిత జీవితములో అత్యంత ప్రాముఖ్యమయిన అంశం ఏమిటంటే, మానవజాతికి ముఖ్యముగా పేదవారికి, నిస్సహాయులకు, వెనుకబడిన వారికి తన సేవను అందించడం.
ప్రార్థనా పరుడు: బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారు గొప్ప ప్రార్థనాపరుడు. రాత్రింబవళ్ళు గంటల తరబడి మౌన ప్రార్థనలో గడిపెడివాడు. రాత్రిళ్ళు మోకాళ్ళూని ప్రార్థన చేసేవాడు. తన సువార్త ప్రచారములో కూడా ఎక్కడకు వెళ్ళినను స్లీవను తీసుకొని వెళ్ళేవాడు. ప్రజలను ఇంటి వద్ద గాని, గుడిలోగాని కలిసి ప్రార్థన చేయుటకు ఆహ్వానించేవాడు. ఆయనే స్వయముగా ప్రార్థన కూటాన్ని నడిపించేవాడు.
తన ప్రార్థనలో ఎక్కువగా పరలోక తండ్రి దేవుని దయార్ధ్ర హృదయాన్ని, ప్రేమను ధ్యానించేవాడు. అందరిని గౌరవించేవాడు. అందరూ ఒకే దేవుని పోలికలో సృజింపబడినారని ప్రతీ ఒక్కరు దేవుని ప్రతిబింబాన్ని కలిగియున్నారని దృఢముగా విశ్వసించేవాడు. ఆయన హృదయం యేసుపై నాటుకొని పోయింది. తన ప్రేమనంతా సిలువలో మరణించిన యేసుపై చూపి ఆయన సహవాసములో ఉండెడివాడు. క్రీస్తు పొందిన శ్రమలను తానుపొంది, క్రీస్తు శ్రమలకు ఉపశమనాన్ని కలిగించాలనే ఆయన ఆత్మ ఎంతగానో ఆరాటపడేది. అందుకే ఆయన పంచగాయాలాను పొంది, క్రీస్తు శ్రమలలో భాగస్థులైనాడు.
తను ప్రార్థనలో పొందిన దైవ శక్తితో ఇతరును కూడా ఆధ్యాత్మికముగా ఎదుగుటకు ప్రేమకే రూపమైన క్రీస్తులో జీవించుటకు సహాయము చేసెడివాడు. తను పవిత్రతలో ఎదుగుతూ ఇతరులను పవిత్ర జీవితములోనికి నడిపించాడు. యువతీ యువకులను సన్మార్గములో నడిపించడానికి ఎంతో శ్రద్ధను, ఆసక్తిని చూపించాడు. ఆయన ప్రార్థన జీవితము పశ్చాత్తాపము తపస్సుతో బలపడినది. ఇది నిజముగా ఆయనను ఆధ్యాత్మిక మనిషిగా, దేవుని మనిషిగా జీవించుటకు తోడ్పడినది.
ఆయన ప్రార్ధన జీవితం ఒకే ఒక ఆశతో కొనసాగింది. అదే ప్రియ ప్రభునిలో ఎదగడం. వెనుతిరిగి చూడక, ఎ్లప్పుడూ దేవుడు చూపించిన బాటలో కొనసాగుతూ పరిపూర్ణత మార్గములో ముందుకు సాగిపోయేవాడు.
దివ్యపూజా బలి అనగా తంబిగారికి ఎనలేని భక్తి అలాగే మరియతల్లి యెడల, జపమాలయనిన తంబిగారికి ఎనలేని భక్తి, విశ్వాసం. ఆయన ప్రార్థన జీవితములో ఇవి విడదీయరానివి. తనతో ఎప్పుడూ ఒక శిలువను తీసుకొని వెళ్తూ ఉండేవాడు. జపమాలను ధరించేవాడు. వీనిని ఎల్లప్పుడూ ధరించి, ఎక్కడికి వెళ్ళినను తీసుకొని వెళ్ళెడివాడు. తన జీవితమంతా కూడా ప్రజలను ఎ్లప్పుడూ దివ్యపూజా బలిలో పాల్గొనడానికి నడిపించెడివాడు. వారితో కలిసి జపమాలను ప్రార్ధించేవాడు.
స్వస్ధతా పరుడు: తంబిగారు ప్రత్యేకమయిన దేవుని స్వస్ధతా వరమును పొందియున్నాడని అవుటపల్లి చుట్టుప్రక్కల ప్రతీ ఒక్కరికి తెలిసిన సత్యమే, వాస్తవమే! కొన్ని ఆకులు, అలములతో వైద్యం చేస్తూ స్వస్థత పరచేవాడు. కొన్నిసార్లు గుంపులుగుంపులుగా ప్రజలు స్వస్థతను పొందుటకు తను నివసిస్తున్న గృహానికి వచ్చెడివారు. ఎక్కువగా శుక్రవారం వచ్చెడివారు. ఎందుకన, ప్రతీ శుక్రవారం తంబిగారు క్రీస్తు పంచగాయాను పొందెడివాడు, కనుక, ఎక్కడికి వెళ్ళక తన గృహములోనే ఉండెడివాడు. లేనిచో, వారిపై జాలితో దయార్ధ్ర హృదయముతో తానే స్వయముగా తన గృహానికి ఆహ్వానించెడివాడు. ఒకసారి కాలుకు లోతైన గాయముతో మూడు సంవత్సరములు బాధపడుచున్న వ్యక్తిని, తన చేతును రొమ్ముపై ఉంచి, కన్నులెత్తి తీక్షణముగా ప్రార్థన చేసి స్వస్థతను చేకూర్చాడు. ఇలా అనేకమైన స్వస్థతను, అద్భుతాను తంబిగారు చేసియున్నారు. ఆయన మరణానంతరం కూడా, మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందిన స్వస్థతగూర్చి చాలామంది సాక్ష్యమిచ్చియున్నారు.
హైదరాబాద్‌ అగ్రపీఠాధిపతులు మారంపూడి జోజిగారు ఇలా సాక్ష్యమిచ్చి యున్నారు, ‘‘1984-85 సంవత్సరములో ఎముక క్యాన్సర్‌తో భరించలేని బాధకు లోనైయ్యాను. ఎంతో మంది వైద్యులను సంప్రదించి, ఎన్నో మందులను వాడినప్పటికిని, ఆరోగ్యం మెరుగుపడలేదు, నొప్పి తగ్గలేదు. ఆ సమయములో స్వస్థత కొరకు, తంబిగారి ప్రార్థన సహాయాన్ని కోరియున్నాను. ఆ తర్వాత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాను. వైద్యమునకు నా శరీరం ఎంతగానో సహకరించింది. తంబిగారి ప్రార్ధనవలన, స్వస్ధత వరము వలన, నేను నా వ్యాధి నుండి, బాధనుండి పూర్తిగా స్వస్ధుడనైతినని విశ్వసిస్తున్నాను.’’
దర్శనకారి, ప్రవక్త: బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారు, రెండవ ప్రపంచయుద్ధములో జరుగుచున్న వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లుగా చెప్పెడివాడు. ఆయన ప్రవచించిన విషయాలు మరునాడు వార్తా పత్రికలో ప్రచురింపబడేవి. మరణావస్ధలోనున్న ఒక బాలుని  గురించి ‘ఏమీ కాదు, బ్రతుకుతాడు’ అని చెప్పియున్నాడు. పెదావుటపల్లి గ్రామములో అగ్ని ప్రమాదం జరుగునని ముందుగానే చెప్పియున్నాడు. తాను ముందుగానే ప్రవచించిన వాటిలో ప్రాముఖ్యముగా చెప్పుకొనవసినది తన మరణం గూర్చి తాను ముందుగానే చెప్పడం, తన మరణానికి కొన్ని నెలలు ముందుగానే తన శవపేటికను ఏర్పాటు చేసుకొన్నాడు. ఏ రోజు మరణిస్తాడో కూడా ప్రవచించియున్నాడు. ఆ శవ పేటికను  తన గదిలోనే ఉంచుకొని, దానిలో పడుకొని మరణము గూర్చి ధ్యానించేవాడు. పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌వారు మరణమును సహోదరి అని సంబోధిస్తూ ఆహ్వానించిన విధముగా, బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారు మరణం కొరకు సంసిద్ధపడినాడు. ఎంతో సంతోషముగా, నిశ్చమైన హృదయముతో మరణాన్ని స్వాగతించాడు.
మరణం, భూస్ధాపితం: తను ప్రవచించిన విధముననే 15జనవరి 1945వ సంవత్సరములో తంబిగారు తుదిశ్వాసను విడచినారు. మరణానికి ముందుకూడా, గ్రామాకు వెళ్ళి, ప్రజలను కలిసి, సువార్త ప్రచారాన్ని చేసాడు. 6 జనవరి 1945న అస్వస్థతతో పెదావుటపల్లికి తిరిగివచ్చాడు. ఆ రోజునుండి కూడా మంచములోనే ఉండిపోయాడు. ఆ దినాలలో కేవలం నీళ్ళు, డికాషిన్‌ మాత్రమే త్రాగెడివాడు. 14 జనవరిన అతని పరిస్థితి విషమించినది. 15 జనవరి ఉదయం లింగతోటి శిఖామణి గారి సహాయముతో దేవాలయమును వెళ్ళి ప్రార్ధన చేసుకున్నాడు. విచారణ గురువుయిన ఫాదర్‌ జె.బి.  కల్దిరారో గారిని కలిసి అవస్ధ అభ్యంగమును ఇవ్వమని కోరాడు. కాని విచారణకర్తలు, తంబిగారు ఆరోగ్యముగానే ఉన్నాడని భావించి అవస్ధ అభ్యంగమును ఇవ్వలేదు. ఆ తర్వాత, తంబిగారు పెదావుటపల్లి గ్రామములో, తన సువార్త ప్రచారము ద్వారా జ్ఞానస్నానమును పొందిన బోయపాటి ఫ్రాన్సిస్‌, క్లారమ్మ గృహానికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే సరాసరి తన స్వహస్తాలతో నిర్మించిన పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ పీఠము వద్దకు వెళ్ళియున్నాడు. ఆరోజే తను మరణిస్తాడని చెప్పియున్నందున అనేకమంది తంబిగారిని చూడటానికి వచ్చియున్నారు. అందరిలో భయం, ఆందోళన! శ్వాసను గట్టిగా తీసుకుంటూ, శక్తిని కూడదీసుకుని అక్కడనున్న వారితో, ‘‘తండ్రికుడి ప్రక్కన కూర్చొనియున్న మహిమగల క్రీస్తు ప్రభువు చెంతకు వెళ్ళుచున్నాను. నేను మీ అందరికోసం ప్రార్థన చేస్తాను. తన ప్రాణాలను అర్పించిన క్రీస్తు మిమ్మును ప్రేమిస్తూ ఉన్నాడని మరువరాదు. ఆయన మిమ్మును బాగుగా చూసుకునే మంచికాపరి. కాబట్టి, భవిష్యత్తుగూర్చి చింతించవద్దు. ఆయన నిన్న, నేడు, ఎల్లప్పుడు ఒక్కటే! దేవుడు తన జ్ఞానముతో మిమ్మును కాపాడును. ఆయన వరమును మీ కొసగును. నన్ను తన సాధనముగా వాడుకొనును. కనుక, నేను వెళ్ళినను, దేవుని ఆశీర్వాదము కొరకు మీ అందరికోసం ప్రార్థిస్తూ ఉంటాను’’ అని బలహీన స్వరముతో వారికి వీడ్కోలు చెప్పియున్నారు. సాయంత్రం 5 గంటలకు బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారు తుదిశ్వాస విడచినారు. వార్తను తెలుసుకున్న విచారణ గురువు వచ్చి అభ్యంగము ఇచ్చియున్నారు.
ఆ తరువాత, ఆయన భౌతిక కాయమును విచారణ దేవాలయమునకు ప్రక్కగానున్న తన గృహమునకు చేర్చారు. తాను స్వయముగా ఏర్పాటు చేసుకున్న శపపేటికలో ఉంచారు. తంబిగారి మరణవార్త వినగానే అనేకమంది అవుటపల్లి గ్రామస్థుల, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, తమ ఆధ్యాత్మిక తండ్రి చివరి చూపు కొరకు అచ్చట గుమికూడారు.
మరుసటి రోజు 16 జనవరి 1945 పూజానంతంరం, సమాధుల స్ధములో ఆయనను భూస్ధాపితం చేసారు. భూస్ధాపిత కార్యక్రమములో అనేకమంది క్రైస్తవేత్తరులు కూడా పాల్గొని యున్నారు.
ప్రేమమూర్తి, శాంతి స్థాపకుడు: తంబిగారు ప్రేమమూర్తి, అందరిని గౌరవించేవాడు. అందరితో ఎంతో సవ్యముగా మాట్లాడేవాడు. ఎప్పుడు ఎవరిమీద, దేనికోసం, ఫిర్యాదు చేయలేదు. అతను నిరాడంబరి. ఎంతో ప్రేమ కలిగి జీవించాడు. పేదవారు, ఆడపిల్లలు చదువుకోవాని ఆశించాడు. తను పేదరికములో నున్నప్పటికిని, తను స్వీకరించిన వాటిని పేదలకు, పిల్లలకు పంచేవాడు. వారికి సహాయం చేయుటకు భిక్షాటన కూడా చేసేవాడు. ఇలా తంబిగారి జీవితమంతయు కూడా దైవసేవకు, మానవసేవకు అంకితం చేయబడినది. అందరిని సమానంగా ఆదరించాడు. గ్రామ గ్రామాలకు వెళ్ళి తన ప్రేమను పంచాడు.
తంబిగారు ఎప్పుడూ ప్రశాంతముగా ఉండేవాడు. గ్రామాలలో ప్రజలమధ్య శాంతిని నెలకొల్పేవాడు. ప్రజలు ఆయనను ఎంతగానో గౌరవించేవారు.
ప్రాయశ్చిత్తము, వినమ్రత: తంబిగారి ప్రాయశ్చిత్త జీవితములో ప్రాముఖ్యమైనది, తనను తాను ఇష్టపూర్తిగా దేవునికి అర్పించుకోవటం. పంచగాయాలను పొంది క్రీస్తు శ్రమలో పాలుపంచుకున్నాడు. సువార్త ప్రచారానికి అనేక మైళ్ళు నడచి వెళ్ళేవాడు. ఉపవాసము చేసేవాడు. ఎంతో వినయముగా         ఉండెడివాడు. తనను తప్పుగా  అర్ధంచేసుకున్నప్పుడు, అవమానించినప్పుడు ఎంతో ఓర్పుగా ఉండెడివాడు. ఆయన వేషధారణ చూసి పిల్లలు పిచ్చివాడని పిలిచేవారు. రాళ్ళు విసిరేవారు. వాటన్నింటిని ఓపికగా భరించేవాడు. పాపములో జీవిస్తున్నారని, మారు మనస్సు పొందాలని వినయముగా వేడుకొనెడివాడు. పాపసంకీర్తనం చేసి దివ్యపూజా బలిలో పాల్గొనాలని చెప్పెడివాడు.
చిన్న పిల్లలనగా ఎనలేని ప్రేమ: బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారు చిన్న పిల్లలతో ఎంతో ప్రేమగా, అప్యాయముగా ఉండెడివాడు, వారితో ఎంతో ఓపికగా, సహనంగా ఉండెడివాడు. వారికి ప్రార్థనను, జపమాలను నేర్పించెడివాడు. పిల్లలు ఆయనను అవమానించినను, పిచ్చివాడంటూ ఆయనపై రాళ్ళు విసిరినను, కోపగించక వారిని ప్రేమతో చేరదీసేవాడు.
పవిత్ర జీవితం, కీర్తి: మరణించిన కొద్ది కాలానికే ప్రజలు ఆయనను పునీతునిగా గుర్తించారు. భక్తులు ఆయన సమాధిని సందర్శించడం ప్రారంభించారు. ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని వేడుకొనెడివారు. అనేకమంది ఆయన ప్రార్థన ద్వారా ఎన్నో మేలులను పొందియున్నారు. ఇప్పటి వరకు వేలమంది భక్తులు ఆయన సమాధిని సందర్శించి, ప్రార్ధను చేసి ఎన్నో మేలులను పొందియున్నారు. ప్రతీ సంవత్సరము తంబిగారి మహోత్సవములు జనవరి 13,14,15 తారీఖులో నిర్వహింపబడుచున్నాయి.
ముగింపు: నవంబర్‌ 11,1890 వ సంవత్సరములో తమిళనాడు, పాండిచ్చేరిలోని కరైకల్‌ అనే గ్రామమునకు చెందిన  శవరిముత్తు, అన్నమలై దంపతులకు సైగోన్‌ (ఫ్రెంచి కానీ) అను ప్రాంతములో జన్మించారు. తన ఏడవ యేటనే తల్లిని కోల్పోయాడు. 1902 వ సంవత్సరములో దివ్య సత్ప్రసాదమును, భధ్రమైన అభ్యంగమును స్వీకరించాడు. అదే సంవత్సరములో ఇంటిని విడచి కేరళ రాష్ట్రమునకు వెళ్ళి అక్కడ ఒక భక్తురాలి దగ్గర పెరిగి, విద్యను అభ్యసించాడు. 1915 వ సంవత్సరములో సన్యాస జీవితమును జీవించుటకు పయణమయ్యాడు.
1931 వ సంవత్సరములో కపూచిన్‌ సభలో చేరియున్నాడు. అచ్చట పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ గారి తృతీయ సభకు చెందిన అంగీని స్వీకరించాడు.  1933వ సంవత్సరములో నొవిషియేటులో చేరకముందు అనారోగ్యము కారణముగా, కపూచిన్‌ సభను వీడాల్సి వచ్చినది. అయినప్పటికిని, తృతీయ సభ అంగీని ధరించడం కొనసాగించాడు. 1936 వ సంవత్సరము వరకు కేరళ, తమిళనాడు రాష్ట్రాలో సువార్త ప్రచారం చేసాడు. 1937వ సంవత్సరములో ఆంధ్రప్రదేశ్‌లోని బిట్రగుంట ప్రాంతములోని, విజయవాడ దగ్గర కేసరపల్లి గ్రామములో సువార్త ప్రచారం చేసాడు. 1939వ సంవత్సరములో తంబిగారు పెదావుటపల్లి గ్రామములో విచారణ ప్రాంగణములోని ఒక చిన్న గృహములో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అచ్చటనే తన మరణమువరకు జీవించాడు. 24 జూన్‌ 2007 వ సంవత్సరమున తంబిగారు ‘‘దైవసేవకుడు’’గా ప్రకటింపబడియున్నారు. 

దైవ సేవకుడు, బ్రదర్ జోసఫ్ తంబి 

దైవ సేవకుడు, బ్రదర్ జోసఫ్ తంబి ఆధ్యాత్మిక జీవితం మనందరికి ఓ సవాలు!

దేవుడు పరమ రహస్యం. పరమ రహస్యమైన దేవుడు తన కరుణ, అనంతమైన ప్రేమలద్వారా, తననుతాను, ఈలోకానికి, ముఖ్యముగా, తన ప్రియబిడ్డలమైన మనందరికి బహిరంగ పరస్తూఉన్నాడు. తనకుతానుగానే కాకుండా, అనేక విధాలుగా (వ్యక్తులు, సంఘటనల ద్వారా) పరమరహస్యాన్ని బహిర్గతమొనర్చడం రక్షణచరిత్రయ౦తయు చూస్తున్నాము. దేవుడు ప్రేమ, మరియు ఆ ప్రేమ అనంతమైనది, అపారమైనది, ఏమియు ఆశించనటువంటిది. ఈ ప్రేమే మనలను ఆ దేవునికి, ఆ ప్రేమకి అంటిపెట్టుకొనేల చేస్తుంది. తన ప్రియకుమారుడు, యేసుక్రీస్తుప్రభువుద్వారా, దేవుడు ఏవిధముగా, తననుతాను మరియు తన హద్దులులేనిప్రేమను బహిరంగపరచినది మనందరికీ తెలిసినదే! దేవుడు అయినప్పటికిని, మానవరూపమును, స్వభావమునుదాల్చి, జీవించి, మరణించి, మనలను ఇహలోకమునకుచెందిన జీవితమునుండి విముక్తినిగావించి, తండ్రి రాజ్యమునకు, అర్హులను మరియు వారసులుగా చేసియున్నాడు. క్రీస్తునందు, దైవప్రేమ రూపమునుదాల్చి యున్నది. తద్వారా, ఆ పరమరహస్యముతో, బాంధవ్యాన్ని ఏర్పరచుకోగల్గుతున్నాము. దేవుడు పరమరహస్యం. కాని, క్రీస్తునందు తననుతాను బహిర్గతమొనర్చుతూ మనదరికి చేరువవుతూ ఉన్నాడు. ఈ పరమరహస్య బహిర్గత, ప్రతి క్రైస్తవ జీవితముద్వారా, ఈనాటికి కొనసాగుతూ ఉన్నది. ఎందుకన, క్రీస్తునందు ప్రతి ఒక్కరు సంపూర్ణ జీవితమునకు పిలువబడి ఉన్నారు. పునీతులు, దైవభక్తులు, ఈ కార్యాన్ని ప్రత్యేక విధముగా ప్రదర్శించి మనందరికీ ఆదర్శ ప్రాయులుగా నిలుస్తున్నారు. దైవమానవ ప్రేమలో సంపూర్ణముగా ఎదగడానికి మనం పిలువబడినామని గుర్తు చేస్తున్నారు.

అలాంటివారిలో మనం గుర్తుకుచేసుకోదగ్గ వారు దైవసేవకుడు బ్రదర్ . జోసఫ్ తంబి. తనదైనశైలిలో, దేవుని అపారప్రేమను, దైవ రక్షణ సందేశమును బహిర్గతమొనర్చుటకు తన జీవితాన్ని అంకితముచేసిన ఓ గొప్ప మహనీయుడు. పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి జీవితము అతనికి ప్రధాన ప్రేరణగా నిలచింది. ఫ్రాన్సిస్ వారి జీవిత ఆదర్శవిలువలు ఆయన జీవితాన్ని ముందుకు నడిపించాయి. దైవకృపతో పునీత ఫ్రాన్సిస్ వారి మార్గములో, శ్రమల కొలిమిలో, పవిత్ర వస్త్రాన్ని ధరించిన కుసుమం బ్రదర్. జోసఫ్ తంబి.

పునీత ఫ్రాన్సిస్ వారి త్రితీయ సభలో సభ్యునిగా ఉండి , తన జీవిత చివరి అంఖము వరకూ, అనంతమైన దేవుని ప్రేమను, నలుదిశల వ్యాపింపచేయడానికి కృషిచేసియున్నాడు. ఈ క్రమములోనే, విజయవాడ మేత్రాసనములోని పెద్దావుటపల్లికి చేరుకొని యున్నాడు. ఆయన అచ్చట 1939 వ సం.ము నుండి 1945 వ సం.ము వరకు, దైవ ప్రేమను, రక్షణ సందేశమును బోధిస్తూ, దైవ సేవలో జీవించి యున్నాడు. తన బోధన మరియు సేవాజీవితము తన వాక్తుచర్యము వలనగాక, సాధారణమైన, ప్రమాణసిద్ధమైన మరియు సిలువలోని క్రీస్తానుకరణము ద్వారా కొనసాగింది.

దీనదైవసేవకుడు, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిసువారి అనుచరుడు, దైవపుత్రుడైన బ్రదర్ జోసఫ్ తంబీ గారు జనవరి 15, 1945 సం.ము తన 63 వ యేట మరణించారు. ఆయన మరణానంతరం, కుల, మత, జాతి, అంతస్తు అను బేధాలు లేకుండా విశ్వాసులు ఆయనను ఒక పునీతునిగా గౌరవించడం ప్రారంబించారు. ఆయన సమాధిచెంతకుచేరి, ప్రార్ధన సహాయాన్ని కోరుచున్నారు. గడచిన శతాబ్దాలలో, విశ్వాసుల సందర్శన అధికమదికముగా పెరిగింది. అదేవిధముగా, దివ్యపూజాబలి పీటముయందు, పునీతుల బాంధవ్యములో తంబీగారిని చూడాలని అనేకమంది విశ్వాసులు వ్యక్తపరచియున్నారు. దీని నిమిత్తమై, విజయవాడ పీఠాధిపతుల సలహా మరియు సహాయసహకారాలతో, ఆంధ్రప్రదేశ్ పీఠాధిపతుల సమావేశ సహాయముతో, మేరిమాత కపూచిన్ ప్రావిన్సు, బ్రదర్ జోసఫ్ తంబిగారి పునీతపట్టముయొక్క కార్యమునకు ప్రతిబూనింది. అందునిమిత్తమై, 24 జూన్ 2007 సం.న, పెద్దవుటపల్లిలో, యేసుతిరుహృదయ దేవాలయమున, పవిత్ర దివ్యపూజాబలిలో, రెవ.మల్లవరపు. ప్రకాష్, విజయవాడ పీఠాధిపతులు, బ్రదర్ జోసఫ్ తంబిగారిని ''దైవసేవకుడు''గా ప్రకటించియున్నారు. తద్వారా, పునీత పట్టముయొక్క కార్యం ప్రారంభించడమైనది.

''దైవ సేవకుడు'' బ్రదర్ జోసఫ్ తంబీ గారు, మన కాలములోనే జీవించియున్నారు. తన జీవితముద్వారా, పుణ్యముగా జీవించడం సాధ్యమేనని సాక్ష్యం ఇచ్చియున్నాడు. ఈ దైవసేవకుని పుణ్యజీవితమును చాటిచెప్పడానికి, ఆంధ్రప్రదేశ్లోని కపూచిన్సభ సహోదరులు, తంబిగారి భక్తిగీతాలు, ''తంబి వెలుగు'' ద్విమాస పత్రిక, తంబి ప్రార్ధనకూటాలు మొ,,గు అనేక కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. స్వర్గీయగురువులు, కపూచియన్ సభకు చెందిన అవిటో పొట్టుకులం గారు 1984వ సం.లో, ''బ్రదర్ జోసఫ్ తంబిగారి జీవిత చరిత్ర'' అను పుస్తకమును ఆంగ్లములో రచించియున్నారు. ఈ పుస్తకం, తెలుగు, తమిళం, మలయాళం, ఫ్రెంచి భాషలలోనికి అనువాదం చేయబడింది. మూడుదశాబ్దాల అనంతరం, 2002వ సం.లో, స్వర్గీయ గురువులు ఒస్వాల్డు ప్రతాప్ కుంపలకురి గారు, తంబిగారి జీవితమునుగూర్చి చక్కటి అద్బుతమైన పుస్తకమును ఆంగ్ల బాషలో రచించియున్నారు. ఈ పుస్తకాన్ని 2011వ సం.లో తెలుగులోనికి అనువాదం చేయబడింది.

బ్రదర్ జోసఫ్ తంబి గారు దైవ ప్రేమను, కరుణను, ప్రకటించియున్నారు. ఈనాడు, మనము అదే చేయాలని దైవ సేవకుడు మనల్ని సవాలు చేస్తున్నారు. దైవరహస్యం ప్రేమరహస్యమే. ఆరహస్యాన్ని బయలుపరచడం మన అందరి ధర్మం.

Prayer for the Beatification of Br. Joseph Thamby, Servant of God

Prayer for the Beatification of Br. Joseph Thamby, Servant of God

God our Father, your servant Brother Joseph Thamby gave witness to your son, Jesus Christ, by a radical living of the Gospel in his life and by proclaiming it to the poor with great missionary zeal and Franciscan simplicity. May his total commitment to Christ, filial devotion to the blessed virgin, untainted loyalty to the church and compassionate love for the poor be an inspiration for all of us in our work of evangelization. We implore you to count him among your saints, if it serves your plan of salvation of the people. Mary our Blessed Mother, Saint Joseph, Saint Francis of Assisi and all the saints, intercede before the Triune God for the Beatification of Brother Joseph Thamby. Look kindly on the innumerable people who flock to your lowly servant, imploring your graces through his intercession. Loving Father, we humbly beg of you to grant us this favor through the intercession of Brother Joseph Thamby, so that your name be glorified in the world. We make this prayer through Christ our Lord. Amen.

జోసఫ్ తంబి, దైవ సేవకుడు (1883 -1945)

జోసఫ్ తంబి, దైవ సేవకుడు (1883 -1945)

దైవసేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిసువారి తృతీయసభ (Third Order) సభ్యుడు. తన జీవిత చివరికాలాన్ని (1939 వ సం,,మునుండి) విజయవాడ మేత్రాసణము, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, ఉత్తర భారరత దేశంలోని పెదావుటపల్లి గ్రామములో గడిపియున్నాడు. అక్కడే ఆయన 15 జనవరి 1945 వ సం,,లో పరమపదించియున్నారు. ఇంతకుముందు ఆయన పుదుచేరి, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలలో పనిచేసియున్నారు. ఆయన నిరాడంబరత్వం, ప్రార్ధన మరియు పరోపకారముతో కూడిన జీవితాన్ని జీవించారు. తన అంతరార్ధమైన (mystical) అనుభవాలవలె, ఆయన సువార్త బోధనా కార్యక్రమాలు బాగా ప్రసిద్ధిలోఉండెడివి. ఇంతలో, ఆయన కుటుంబము భారత దేశములోను మరియు బయట చెదరిపోయినది. తన వినయత్వమువలన తననుగూర్చితాను మాట్లాడటానికి ఎప్పుడూ నిరాకరించెడివారు. తన జీవితమునుగూర్చి ఈనాడు ఖచ్చితమైన మరియు విలువైన సమాచారమును ఇచ్చియుండెడు పత్రాలను, అధారాలన్నింటినీ ఆయన తప్పక కాల్చివేయడముగాని, నాశనం చేయడముగాని జరిగియున్నది.

Br. Joseph Thamby, Servant of God (1883-1945)

Joseph Thamby, Servant of God (1883-1945)

The Servant of God Joseph Thamby was a Franciscan tertiary layman who spent the last years of his life (from 1939 onwards) in Peddavutapally, in the federal State of Andhra Pradesh in South India, where he died on 15 January 1945. He had previously worked in the federal States of Puducherry, Kerala and Tamil Nadu, leaving behind him a reputation for austerity, prayer and charity. His works of evangelisation, like his mystical experiences, were well known. Meanwhile, his family had been scattered within India and beyond; he himself, on account of his humility, always avoided talking about himself, and he meticulously burned or made sure to destroy documents which today might have provided a more accurate reconstruction of his life, which cannot be documented in all its stages.

fr. Joseph Thamby, Servo di Dio (1883-1945)

Joseph Thamby, Servo di Dio (1883-1945)

Thamby Joseph, laico, terziario francescano, Servo di Dio. Joseph trascorse gli ultimi anni (dal 1939) della sua vita in Peddavutapally, nello stato federale di Andhra Pradesh in India, dove morì il 15 gennaio 1945. Egli aveva prima dimorato e lavorato negli stati federali di Puducherry, Kerala e Tamil Nadu, lasciando un ricordo di austerità, preghiera, e carità; erano ben conosciute le sue opere di evangelizzazione come le sue esperienze mistiche. Nel frattempo, la sua famiglia si era dispersa dentro e fuori l’India; egli stesso, per la sua umiltà, evitò sempre di parlare di sé e meticolosamente bruciava o faceva distruggere documenti che oggi avrebbero potuto servire per una più accurata ricostruzione alla sua vita, che non può essere documentata in ogni sua fase.

Nacque nel settembre 1883 dai coniugi Thamby Savarymuthu e Annamalle; la sua era una famiglia benestante della comunità Vellala in Sirone. Crebbe in Puducherry (Pondicherry), allora una colonia francese in India. Ebbe un fratello più giovane, Dhayirian; la madre morì quando i due avevano rispettivamente sette e due anni. Il padre si risposò e dal secondo matrimonio nacque Maria. A dodici anni Giuseppe, insieme con altri compagni, stava preparandosi alla prima comunione e alla cresima; la matrigna si mostrava contraria, ma nonostante ciò, egli ricevette i sacramenti. A causa delle avverse circostanze create dalla matrigna, il ragazzo lasciò la famiglia e raggiunse il Kerala, dove fu accolto ed educato da una pia donna. Il fratello, invece, andò a Saigon, in Vietnam, colonia francese fino al 1956, dove sposò Mary Therese: ebbero tre maschi e una femmina, che divenne monaca carmelitana a Puducherry. Dhayirian Thamby morì nel 1935.

Br. Joseph Thamby, Servant of God (1883-1945)

Br. Joseph Thamby
A Franciscan Tertiary, Servant of God
September 1883 to 15 January 1945

little brother gopu, Rome.

Early life and his desire to become a Capuchin

• Born in September 1883 in Sirone and brought up in Pondicherry, Tamil Nadu, South India.
• At the age of 12 (1895), he received the sacraments of Holy Communion and Confirmation.
• Left home as a boy to Kerala, the neighboring state and was educated with the help of a pious lady in whose house, he must have worked as a house taker.
• Though he had frequent visits to his home-town from Kerala, only in 1928 he was recognized by his grandmother on the occasion of a funeral service of a relative. He was then 45.
• He joined the Capuchins at Kollam in 1930. He was then 47.
• On 14 September 1932, he was present for the religious profession of his niece Gabrielle Marie Therese OCD (died in 1985) in Puducherry.
• By the time he has finished his training as a Franciscan Tertiary, he was around 50. So, for sure, his being aged around fifty was not in his favour to be admitted into the novitiate of the Capuchin Order. Hence, he had to leave the Capuchins in 1933.
• Br. Roch Vengathanam of Kozhuanal, the first Capuchin brother from Kerala, vested 14 July 1930 has given witness about Br. Joseph Thamby for not being admitted to the Capuchin Order: “he was not accepted to the Capuchin Order because of elephantiasis in his right leg and on account of his ‘excessive piety’ and his experiences of ecstasy were judged to be the fruit of epileptic fits.”
• After leaving the Capuchins, the Tertiary Brother Joseph Thamby continued to wear the habit, as confirmed by a few photographs and a number of testimonies. He remained a staunch member of the Third Order.

His Ministry as a Franciscan Tertiary

Life of Br. Joseph Thamby, Servant of God

Br. Joseph Thamby, a Perpetual Franciscan Tertiary (1882-1945) is a Holy Man of Pedavutapally in the Diocese of Vijayawada, Andhra Pradesh, South India.  He has done the work of evangelization in the states of Tamilnadu, Kerala and Andhra Pradesh.  He made his home in Pedavutapally in 1939 and lived the rest of his life and died on 15 January 1945.  He is declared ''Servant of God'' on 24 June 2007 and thus began the process of his Beatification.

To honor and make known the Servant of God, we have  2 blogs dedicated to the life and spirituality of  Br. Joseph Thamby:
 

http://josephthamby.blogspot.com/
http://brjosephthamby.wordpress.com/

God in his infinite goodness and mercy intervenes in the lives of his people time and again in order to draw them closer to Himself. Besides his ordinary providential interventions, occasionally he enters into history of peoples by raising individuals with remarkable qualities to lead others to the true path of righteousness and devotion. Thus we see that in the twelth and thirteenth centuries, when the values of the Gospel were being forgotten by a large section of Christians and the leaders of the Church, God brought St. Francis of Assisi to give a new impetous to evangelical form of life.

The humble and poor life of Francis and his followers made such an impact on the lives of Christians of that time that there was an over all awakening to the Gospel way of life. Even if not with the same intensity of its initial period, the Franciscan Movement has been in the forefront of the renewal of Christian life until today.

Thus the life and ministry of ''The Holy Franciscan of Avutapally,'' Br. Joseph Thamby, is indeed a powerful sign of God's special intervention. During his life, he has lead many people to the ideal life of the Gospel, and even after his death he is continuing to draw thousands of people to the true God.

The information regarding his birth, childhood, ealry life and activity are scanty. Br. Joseph Thamby spent the last six years of his life at Pedavutapally, a small village in Vijayawada diocese. As in the case of many an extraordinary person, Br. Joseph Thamby too had often been misunderstood by many of his contemporaries especially those who were in authority. Neverthless the simple folk of the villages found in him a person who was keenly interested in their welfare, and who spoke to them about the Father in heaven. At times he came forward to help these unfortunate ones in their temporal needs.

The spiritual relationship with this wandering Franciscan has continued by the people even after his death by visiting his tomb and seeking his assistance. Thus the devotion to Br. Thamby spread in Avutapally and far beyond. Thereafter devotees began to flock to his tomb not only from nearby places but also from other regions of Andhra Pradesh. Today many pilgrims from the neighbouring states, especially from Tamil Nadu, visit his tomb and pray for his intercession.

The devotion to Br. Joseph Thamby grew steadily and extended beyond the boundaries of Vijayawada to the whole of Andrha Pradesh, and even to the adjoining states like Tamil Nadu and Kerala. A keen desire was expressed by many to have a historical and critical biography of this holy man focussed on the facts and circumstances of his life. As John Leoncini PIME says: ''The growing popular devotion, year after year, urges a new thorough study of the extraordinary virtues and attributions of Br. Thamby.''

Early life of Br. Joseph Thamby: Though Thamby means younger brother in Tamil, here it is exclusively used as a surname or rather as a family name. In fact, Thamby has been a well-known family at Karaikal in Pondicherry. Pondicherry was a French colony, and a few members of this family held government offices at home as well as abroad. Father P.S. Sebastian wrote, ''I would like to inform you that I am a relative of Brother Joseph Thamby working in the diocese of Kumbakonam. Before Joseph Thamby left our place for Pedda Avutapally, he was with me for some time. As there is no other priest related to Brother Joseph, I was invited to bless the marriage of his nephews, Victor Thamby and Robert Thamby at Pondicherry during the time of Archbishop Colas.'' The only sister, Gabrielle Marie Therese, O.C.D. ( Carmelite Order) was the daughter of his younger brother, Michael Dhayirian Thamby, and Victor Thamby and Robert Thamby were her brothers.

Joseph Thamby was born in September 1883 in Pondicherry. He had an younger brother and their mother Annamalle died when Joseph was seven years and his brother two years. Their father savarimuthu Thamby married a second time and he had one daughter by name Mary. When Thamby was twelve years old he joined the group of children being prepared for First Communion and Confirmation. But just before the Holy Eucharist in the Church during which the sacraments were to be administered, quite surprisingly, his stepmother forbade him to receive the sacraments. She conveyed her objection to the parish priest, but Thamby was administered both the Sacraments, which infuriated her all the more. When he returned home, his stepmother was indignant and as a punishment refused to give him meals. Since the stepmother was persecuting them, Joseph left the house stealthily, leaving his younger brother at home because he was too small to be taken along. Jospeh Thamby reached Kerala where he was taken care of and educated by a pious lady. After some years, Thamby came to his native place, where he begged for alms, but nobody could recognize him including his own father who gave him one anna (about 10 paise).

His younger brother Dhayirian Thamby in course of time went to Indo-China where he got a job, and married Mary Theresa by whom he had four children, three boys and one girl. Later he returned to India and the only girl joined the convent and took the religious name, Sr. Gabriele Thamby. One of her brothers, Albert, married and became bed-ridden on the day of marriage itself and died after 22 days. His wife Philomina went to her parental home and later joined the convent and received the name Sr. Angel Mary. Joseph Thamby was present for the wedding and he had objected to the marriage saying that some danger would take place; but his word was not heeded to. Later on, the other brothers Victor and Robert also got married.

Victor died after a few years. Robert took up his residence in France, and his wife, Martha, visited the tomb of Br. Joseph Thamby at Avutapally in 1984. Dhayirian Thamby who was employed in Indo-China (Saigon) lost his wife, Mary Theresa, and he himself went to his eternal aboard in 1935.

Though Joseph Thamby used to visit Pondicherry occasionally, he was not recognized by anyone untill 1928 when his grandmother identified him while attending a funeral service of a relative. He used to wear the Third Order habit, and on one of his visits he participated in the profession ceremony of his niece Sr. Gabrielle (October 14, 1932). He would never reveal to which monastery he belonged, but when asked he used to say that he had to return to his monastery at Quilon in Kerala. He used to collect money and clothes for the poor. On Fridays he was seen in agony by many, and at times in ecstasy, which means he might have been participating in the passion of Jesus Christ. He used to heal people of their various illness and perform the ministry of exorcism when called upon to do so.

It is reported that he visited Saigon in a miraculous manner. Within three days the family members in Pondicherry received a letter communicating the message that Thamby had visited them and conveyed their greetings. They wondered as how this could happen as the flights were not common in those days. This is considered to be a case of bilocation. He had a workable knowledge of Telugu, Tamil, Malayalam, French and English. It is said that he was in the habit of reciting the Divine Office in Latin as it was the official language of the Church.

During the World War II, Aloysius Gonzaga Sisters from Burma came to Pondicherry in 1942 by trekking for more than 40 days. Br. Thamby seems to have accompanied them without their knowledge, and on reaching Pondicherry he showed the Mother House near the Cathedral. When asked who he was, he evaded the answer.

In the Footsteps of St. Francis of Assisi: Br. Thamby accepted Francis of Assisi as his model whose ideals guided his life. Francis was a challenge to him whom he followed relentlessly. He read: ''One day Francis was praying before the image of the crucifix in the abandoned chapel dedicated to St. Damian. God had already put His mighty hand on him. Francis had realized in a glimpse that the earth and all that it may yield was a mere trifle in comparison with the riches, which the Lord could offer him. Yet he did not know what the Lord expected of him, and before the crucifix he poured forth his prayer both of love and anguish.... 'Lord, what do you want me to do?'.... Then the crucified Lord became alive and spoke to him: 'Francis, go and repair my house'.''


On that day, Francis had found the way which he should follow until his death: the way of a boundless devotion to Jesus crucified, the way of close imitation of Jesus as he is seen in the holy Gospel. That was the way he followed, and that is the way he proposed to all those who wished to follow him; that was his way of life, the life of the Gospel understood as it stands to the letter and witho...ut gloss, that is, without extenuation. The stigmata were, perhaps, the fulfillment of his intense desire to be identified with Christ.

There lies the secret of the tremendous impact which Francis made on the people of his day: they saw in him the picture of Christ and a living fulfillment of the Gospel. Br. Thamby shared the same vision, and became a member of the Third Order of St. Francis most likely around the year 1930 and gradually he grew up into a committed Tertiary.


According to tradition, Joseph Thamby joined the Capuchin Order; but it is not certain when and where he joined them. People considered him to be a sannyasin because of his style of life, although he was in no way different from others in his dress. As mentioned earlier, in 1928 when he came to attend the funeral of one of his relatives he was in the Third Order habit and was recognized by his grand mother. The Capuchin presence in South India commenced only in 1932. However, the Capuchins were already working in the Northern Missions for quite some time and had their established their novitiate in Sardhana, U.P., which was shifted to Mangalore. Hence Thamby might have joined the Capuchins at Sardhana and later came down to Quilon.