మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు - అతిదూతలు

 మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు - అతిదూతలు


కతోలిక శ్రీసభ అతిదూతలు లేదా మహాదూతలు అయిన మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు గార్ల పండుగను సెప్టెంబరు 29న కొనియాడుతుంది. ఈ రోజును సాధారణంగా మైఖేల్‌మాస్ (Michaelmas) అని పిలుస్తారు, ఎందుకంటే, 5వ శతాబ్దం నుండే మిఖాయేలు పండుగను మాత్రమే జరుపుకునేవారు. కాలక్రమేణా మిగతా ఇద్దరు అతిదూతలనుకూడా చేర్చబడింది. ‘దూత’ అనగా ‘సేవకుడు’ లేదా ‘సందేశకుడు’ అని అర్ధం. బైబులులో పేర్కొనబడిన తొమ్మిది సమూహాలలో అతిదూతలు ఒకరు. ముందుగా, ‘దూతలు’ సజీవుడైన దేవున్ని ఆరాధించే అపారమైన సమూహాన్ని సూచిస్తారు. వారిలోనున్న రెండు లక్షణాలు ఏమిటంటే, ఒకటి ఆరాధన: దూతలు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉంటారు, నిరంతరం దేవున్ని మహిమపరుస్తారు, కీర్తిస్తారు. మనం కూడా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కొనసాగిస్తూ, ప్రార్థనలో ఆయనను ధ్యానించాలి. రెండు, సేవ: ఆరాధన నుండి శక్తిని పొంది, దేవుని సంకల్పాన్ని ప్రపంచంలో, (ఇతరుల రక్షణ కోసం) నెరవేర్చడానికి సేవ చేస్తారు. మనం కూడా ప్రార్థన తర్వాత ఇతరులకు సేవచేస్తూ, దేవుని ప్రేమను ప్రకటించాలి.

మనకు ఎవరైనా అనుకోకుండా సహాయం చేసినవారిని, మంచి సలహా ఇచ్చిన వారిని దేవదూతలా వచ్చి నన్ను ఆదుకున్నావు అని అంటాం. నిర్గమ కాండములో దేవుడు ఇలా పలికాడు, “మీరు బయలుదేరి పోవుచున్నప్పుడు, త్రోవలో మిమ్ము కాపాడుచు, నేను సిద్ధపరచిన చోటికి మిమ్ము చేర్చుటకు, నా దూతను మీకు ముందుగా పంపెదను” (నిర్గమ 23:20). మనం ఊహించని సమయములో దేవుడు మనకు కల్పించిన రక్షణను బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేద్దాం!

ఈరోజు ముగ్గురు అతిదేవదూతలను స్మరించుకుంటున్నాము. తోబితు గ్రంధం 12:15 ప్రకారం, ఏడుగురు అతిదూతలు ఉన్నప్పటికీ, బైబులులో పేర్లతో ప్రస్తావించబడిన మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు మాత్రమే కతోలిక శ్రీసభ అధికారికంగా గుర్తించే అతిదూతలు. వారి పేర్లు వారి పాత్రలను, స్వభావాన్ని సూచిస్తాయి. ఆ పేర్లన్నీ ఎల్ (El) అనే అక్షరంతో ముగుస్తాయి. ఈ ఎల్ అనేది హీబ్రూ భాషలో దేవుడు’ అని అర్ధం, కనుక వారు దేవుని దూతలు లేదా సందేశకులు అనే అర్థాన్ని సూచిస్తుంది.

(1). మిఖాయేలు: సాతాను, అతని దుష్టశక్తులకు వ్యతిరేకముగా పోరాడు దేవదూతల సమూహమునకు అధిపతి. ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప అధిపతిగా, “పారశీక రాజ్యమునకు కావలికాయు దేవదూత” అని, “జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు” అని దాని 10:13 మరియు 12:1లో చదువుచున్నాం. మరియు యూదా వ్రాసిన లేఖ 1:9లో మోషే శరీరము కొరకు సాతానుతో వాదించాడు అని చదువుచున్నాం. మరియు పిశాచము, సైతాను అయిన సర్పముతో యుద్ధము చేసి దానిని ఓడించినట్లుగా దర్శన గ్రంధం 12:7-12లో చదువుచున్నాం. కనుక, అతిదూత మిఖాయేలు, సాతానుకు మరియు అతని అనుచరులకు (దూతలకు) వ్యతిరేకంగా పోరాడే వీరుడు. శ్రీసభకు ప్రధాన రక్షకుడు, దేవున్ని ప్రేమించే వారిని కాపాడువాడు, మరియు దైవజనానికి సంరక్షకుడు. ‘మిఖాయేలు’ అనగా ‘దేవునితో సమానం ఎవరు?’ అని అర్ధం.

(2). గాబ్రియేలు: బప్తిస్త యోహాను జననమును అతని తండ్రి జెకర్యాకు (లూకా 1:11-20), మరియు యేసుక్రీస్తు జననాన్ని మరియమ్మకు ప్రకటించిన (లూకా 1:26-38) వారు గాబ్రియేలు. అలాగే, దానియేలుకు దర్శనాలను వివరించిన (దాని 8:16; 9:21) దేవదూత గాబ్రియేలు. గాబ్రియేలు దూత యోసేపుకు కలలో కనిపించాడని, బెత్లేహేములో గొర్రెల కాపురులకు కనిపించాడని, గేత్సేమని తోటలో యేసు మహావేదనలో ఓదార్చాడని (లూకా 22:39-46) శ్రీసభ సాంప్రదాయం చెబుతుంది. ‘గాబ్రియేలు’ అనగా ‘దేవుని బలం’ అని అర్ధం.

(3). రఫాయేలు గురించి తోబీతు గ్రంధము 12వ అధ్యాయంలో చూస్తాం. ప్రధానంగా స్వస్థపరచేవాడు. తోబీతు కుమారుడైన తోబియాకు, మాదియాకు వెళ్ళు ప్రయాణములో మనిషిగా మారువేషములో మార్గదర్శకుడిగా ఉన్నాడు. అతనికి చూపును కలుగజేశాడు. అలాగే, తోబియా భార్యయైన సారాను దురాత్మనుండి విముక్తి చేయడానికి, స్వస్థత పరచడానికి సహాయ పడ్డాడు. ‘రఫాయేలు’ అనగా ‘దేవుని స్వస్థపరచెను’ అని అర్ధం.

కతోలిక శ్రీసభ బోధనల ప్రకారం, దేవదూతలు, అతిదేవదూతలతో సహా నిజమైన ఉనికిని కలిగి యున్నారని, వారు కేవలం ఊహాత్మక వ్యక్తులు కాదని శ్రీసభ బోధిస్తుంది. వారు నిర్ధేహ ఆత్మలు (non-corporeal spiritual beings). వారు దేవుని సేవకులు, సందేశకులు (messengers). అతిదూతలు (Archangels) అనేవారు దూతల సమూహంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటారు. వీరు దేవుని నుండి అత్యంత ముఖ్యమైన కార్యముల కొరకు, మహోన్నత రహస్యాల ప్రకటన కొరకు పంపబడతారు. దేవదూతలు మానవులకు కూడా సేవలు, సహాయం చేస్తారు. మానవుల రక్షణ, మార్గదర్శకత్వం కొరకు దేవునిచే పంపబడతారు. ప్రతీ వ్యక్తికి ఒక కావలి సన్మనస్కుడు లేదా దూత (Guardian Angel) ఉన్నట్లే, అతిదూతలు కూడా మానవ చరిత్రలో ముఖ్యమైన ప్రాత్రను పోషించారు.

అతిదూతలకు కతోలిక శ్రీసభ ఎందుకంత ప్రాధాన్యతనిచ్చి గౌరవిస్తుందని ఆలోచిస్తే, మన జీవితంలో వారి పాత్ర, పునీతుల పాత్రకు భిన్నంగా ఉంటుంది. పునీతుల విషయంలో, వారి విజ్ఞాపన కోసం మనం ప్రార్థించడమే కాక, వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని, వారిని అనుకరించడానికి ప్రయత్నిస్తాం. కానీ దేవదూతలు అందుకు భిన్నం. దేవదూతలు ఒక నిర్దిష్ట ప్రయోజనం కొరకు దేవునిచే సృష్టించబడిన నిర్దేహ ఆత్మ ప్రాణులు.

 “పరిశుద్ధ గ్రంథం సాధారణంగా దూతలు అని పిలిచే, ఈ ఆత్మ సంబంధమైన, దేహము లేని ప్రాణులు (spiritual, non-corporeal beings) యొక్క ఉనికి ఒక విశ్వాస సత్యం (a truth of faith). ఈ సత్యానికి పరిశుద్ధ గ్రంథ సాక్ష్యం ఎంత స్పష్టంగా ఉందో, సంప్రదాయం (Tradition) యొక్క ఏకాభిప్రాయం కూడా అంతే స్పష్టంగా ఉంది” అని కతోలిక శ్రీసభ సత్యోపదేశం నం. 328లో చదువుచున్నాం.

దేవదూతలు శుద్ధ ఆధ్యాత్మిక జీవులు కనుక దూతలకు మేధస్సు, సంకల్పం ఉన్నాయి. వాళ్ళు వ్యక్తులు, చిరంజీవులు. కంటికి కనిపించే సృష్టి జలాన్ని మించిన పరిపూర్ణత వాళ్లకుంది. వాళ్ళని ఆవరించి ఉండే తేజస్సే ఇందుకు సాక్ష్యం” అని కతోలిక శ్రీసభ సత్యోపదేశం నం. 329లో చదువుచున్నాం.

శ్రీసభ పండితులు, పునీతులు, జగద్గురువుల బోధనల ప్రకారం,

పునీత మిఖాయేలు దేవుని సైన్యానికి అధిపతి, శ్రీసభ సంరక్షకుడు. 13వ లియో జగద్గురువులు 19వ శతాబ్దంలో భయంకరమైన దుష్టశక్తులు శ్రీసభను నాశనం చేయడాన్ని దృష్టితో చూసిన తరువాత, ‘పునీత మిఖాయేలు ప్రార్ధన’ను రచించి, ప్రతీ దివ్యబలి పూజ తరువాత, ప్రార్ధించేలా ఆదేశించారు. పునీత రెండవ జాన్ పాల్ జగద్గురువులు, సాతానుకు వ్యతిరేకంగా మిఖాయేలు పోరాటం నేటికీ కొనసాగుతుందనీ నొక్కి చెప్పారు. వాటికన్ గార్డెనులో, పునీత మిఖాయేలు స్వరూపాన్ని ప్రతిష్టించిన సందర్భంగా (2013), పోప్ ఫ్రాన్సిస్ ఇలా అన్నారు, “అతిదూత మిఖాయేలు దైవిక న్యాయాన్ని తిరిగి నెలకొల్పడానికి పోరాడుతాడు; ఆయన దేవుని ప్రజలను వారి శత్రువుల నుండి, ముఖ్యంగా శత్రువులకల్లా ముఖ్య శత్రువు అయిన సాతాను నుండి రక్షిస్తాడు. పునీత మిఖాయేలు విజయం సాధిస్తాడు, ఎందుకంటే అతని ద్వారా పనిచేసేది స్వయంగా దేవుడే.

పునీత గాబ్రియేలు దేవుని శక్తిని, బలాన్ని సూచిస్తాడు. చరిత్రలో అత్యంత ముఖ్యమైన సందేశాలను తీసుకువచ్చాడు. ఈవిధంగా, దేవుని రక్షణ ప్రణాళికలో అత్యంత ప్రధాన పాత్రను పోషించాడు.

పునీత రఫాయేలు స్వస్థపరచేవాడు, మార్గదర్శకుడు. రఫాయేలు దేవుని స్వస్థతను సూచిస్తాడు. యోహాను సువార్తలో ప్రస్తావించబడిన బెతెస్దా కోనేటిని (యోహాను 5:2-4) స్వస్థత కొరకు కదిలించిన దూత రఫాయేలే అని పునీత అగుస్తీనుగారు నమ్మేవారు. రఫాయేలు కేవలం శారీరక స్వస్థతనే గాక, ఆధ్యాత్మిక స్వస్థతను, ప్రయాణాలలో, జీవితంలోని కష్ట సమయాలలో మార్గదర్శకత్వంను కూడా ఇస్తాడని పునీతులు బోధించారు. తోబీతు గ్రంథంలోని అతని పాత్ర ద్వారా, కుటుంబాలకు, వివాహాలకు రక్షకుడిగా కూడా అతని ప్రార్ధన సహాయాన్ని వేడుకుంటారు.

ఈవిధంగా, కతోలిక శ్రీసభ ఈ ముగ్గురు అతిదూతలను పరలోక యోధులుగా, దైవసందేశకులుగా, స్వస్థపరిచేవారిగా గౌరవిస్తుంది. వారి మధ్యస్థ ప్రార్ధన ద్వారా, దేవుడు మనకు రక్షణ, మార్గదర్శకత్వం, స్వస్థతను పొందుకుంటామని విశ్వసిస్తుంది.

దూతలు దేవుని నిరంతరంగా మహిమపరచే మరియు ఇతర ప్రాణుల రక్షణ ప్రణాళిక కొరకు సేవచేసే ఆత్మ సంబంధమైన ప్రాణులు. “దూతలు మనందరి మేలు కొరకు కలిసి పనిచేస్తారు” అని పునీత థామస్ అక్వినాస్ గారు బోధించారు. పునీత అగుస్తీను ప్రకారం, దూతలు సృష్టి యొక్క మొదటి రోజున సృష్టించబడ్డారు. దీనిని ఆదికాండము 1:3-4లో చూడవచ్చు. దేవుడు, “వెలుగు కలుగుగాక అని ఆజ్ఞాపించగా, వెంటనే వెలుగు కలిగెను. ఆ వెలుగు కంటికి బాగుగా ఉండెను. దేవుడు చీకటి నుండి వెలుగును వేరు చేసెను. ఆ విధంగా వెలుగును చీకటి నుండి వేరుచేయడం అనేది మంచి మరియు చెడ్డ దూతలకు పెట్టిన పరీక్షగా, వారి విభజనగా పరిగణించబడింది. ఆ సమయంలోనే పునీత మిఖాయేలు, ‘దేవునితో సమానం ఎవరు?’ అనే యుద్ధ నినాదంతో సాతానును, ఇతర దురాత్మలను పరలోకం నుండి వెళ్ళగొట్టాడు.”

అతిదూతల పండుగ మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, “దేవుని దయ, సహాయం మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. మనం ఒంటరిగా పోరాడనవసరం లేదు.” జీవితంలోని ప్రతి క్షణంలోనూ, దూతలు కనిపించకపోయినా, చురుకుగా ఉండి, మార్గనిర్దేశం చేస్తూ, రక్షిస్తూ, దేవుని సంకల్పాన్ని తెలియజేస్తూ ఉంటారు.

“దుష్టశక్తులకు వ్యతిరేకంగా దేవుడు మన పక్షాన పోరాడుతున్నాడు.” ఈ లోకంలో మనకు శోధనలు, చెడు అలవాట్లు, ఆందోళనలు, ఆధ్యాత్మిక పోరాటాలు అనేవి ఎల్లప్పుడూ ఉంటాయి. అయితే, ఈ పోరాటంలో మనకు దేవుని వైపు నుండి ఒక శక్తివంతమైన సంరక్షకుడు ఉన్నాడని పునీత మిఖాయేలు గుర్తుచేస్తాడు. కనుక, ధైర్యంగా ఉంటూ, చెడు లేదా అన్యాయం మన చుట్టూ ఉన్నప్పుడు, భయపడకుండా దేవుని శక్తిని, మిఖాయేలు రక్షణను వేడుకోవాలి.

“దేవుని సంకల్పం మరియు శుభవార్త మన జీవితాల్లో ప్రకటించబడతాయి.” దేవుడు మన జీవితాలలో కూడా కొన్ని ముఖ్యమైన శుభవార్తలను లేదా ప్రణాళికలను ప్రకటిస్తాడు. అవి మన ఆత్మలో కలిగే ప్రేరణలు కావచ్చు. మన కర్తవ్యం గురించి కలిగే స్పష్టత కావచ్చు. దేవుని పిలుపును వినడానికి, అది కష్టంగా ఉన్నా దానిని నమ్మకంతో అంగీకరించడానికి మనకు ధైర్యం ఇవ్వడానికి గాబ్రియేలు అతిదేవదూత సిద్ధంగా ఉన్నాడు. కనుక, ప్రార్థనలో దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నించాలి. మన జీవితంలో దేవుని సంకల్పం గురించి స్పష్టత కోసం గాబ్రియేలును వేడుకోవాలి.

“దేవుడు మన గాయాలను మాన్పి, మన ప్రయాణంలో నడిపిస్తాడు.” మన జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనకు శారీరక వ్యాధులు, మానసిక గాయాలు, ఆధ్యాత్మిక నష్టాలు సంభవించవచ్చు. దేవుని స్వస్థపరిచే కరుణ మనకు అందుబాటులో ఉందని, ఆయన ఒక నమ్మకమైన స్నేహితుడిలా మనకు సహాయం చేయడానికి, సరైన మార్గంలో నడిపించడానికి పునీత రఫాయేలు సిద్ధంగా ఉన్నాడని గుర్తుచేస్తుంది. కనుక, మన గాయాలు లేదా ఇతరుల బాధల కోసం స్వస్థతను కోరుకోవాలి. జీవితంలో తికమక పడినప్పుడు, సరైన నిర్ణయాల కోసం మార్గదర్శకత్వం కోసం పునీత రఫాయేలును వేడుకోవాలి.

ఈవిధంగా, అతిదూతల పండుగ మనకు బోధించే ముఖ్య సత్యం ఏమిటంటే, పరలోకంలోని దూతల మాదిరిగానే, మనమూ దేవుని పట్ల నమ్మకంతో, విధేయతతో, వినయంతో జీవించాలి. ఎందుకంటే, అతిదూతలు దేవుని సేవకులు మాత్రమే, దేవుడే అంతటికీ మూలం కనుక.

కనుక, నేడు మనం దేవుని దయలో భాగమైన అతిదూతలను మన జీవితంలోకి ఆహ్వానించుదాం. తద్వారా, వారి ప్రత్యేక సహాయాన్ని, మార్గదర్శకత్వాన్ని, రక్షణను పొందవచ్చు. భయం, శోధన లేదా ఆధ్యాత్మిక పోరాటాలను ఎదుర్కొంటున్నప్పుడు, రక్షణ యోధుడైన మిఖాయేలును ఆహ్వానించుదాం! జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు, దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, సందేశకుడైన గాబ్రియేలును ఆహ్వానించుదాం! శారీరక లేదా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, సరైన జీవిత భాగస్వామి లేదా స్నేహితుని కోసం వెతుకుచున్నప్పుడు, స్వస్థపరిచేవాడు, మార్గదర్శకుడైన రఫాయేలును ఆహ్వానించుదాం!

ఈ ముగ్గురు అతిదూతల యొక్క ప్రత్యేక సహాయాన్ని కోరుతూ, మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకుందాం. మన ప్రార్థనలో వారిని ఎంత తరచుగా గుర్తు చేసుకుంటే, దేవుని ద్వారా వారు మనకు అంత దగ్గరగా ఉంటారు.

ఈ అతిదూతలు మీ ఆత్మకు, శరీరానికి, మీ దైనందిన జీవితానికి రక్షణ, మార్గదర్శకత్వం, స్వస్థతను తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను!

లూకా 11:47-54 - అధర్మ క్రియలు III

లూకా 11:47-54 - అధర్మ క్రియలు III

లూకా 11:47-54. అధర్మ క్రియలు III. ఈ వచనాల నుండి మనం మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలపై ధ్యానం చేయవచ్చు.

1. ప్రవక్తల రక్తం మరియు సాక్ష్యం (లూకా 11:47-51). యేసు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను వారి పూర్వీకులు ప్రవక్తలను చంపినప్పటికీ, వారి సమాధులను కట్టడం ద్వారా వారి పనులను ఆమోదిస్తున్నారని మందలించారు. ఇది దేవుని ప్రజలు తరచుగా చేసే ఒక తప్పును సూచిస్తుంది, వారు దేవుని సందేశాన్ని తిరస్కరించినప్పటికీ, ఆ సందేశాన్ని తెచ్చినవారిని గౌరవించడానికి ప్రయత్నిస్తారు. ఇది ద్వంద్వ స్వభావం. నిజమైన గౌరవం అనేది వారి సందేశాన్ని అంగీకరించి, దాని ప్రకారం జీవించడమే. యేసు హేబెలు నుండి జెకర్యా వరకు చంపబడిన ప్రవక్తలందరి రక్తం గురించి మాట్లాడారు, ఇది దేవుని సత్యానికి వ్యతిరేకంగా చేసే పాపాలకు లెక్క ఉంటుందని సూచిస్తుంది. నేను దేవుని సేవకులను, వారి సందేశాన్ని తిరస్కరిస్తూ, వారిని గౌరవిస్తున్నట్లు నటిస్తున్నానా? నా జీవితంలో దేవుని సత్యాన్ని నేను ఎలా అంగీకరిస్తున్నాను?

2. జ్ఞానపు తాళం (లూకా 11:52).మీరు జ్ఞానాలయపు ద్వారమును బిగించి, తాళపు చెవిని మీ స్వాధీనము చేసికొని ఉన్నారు. మీరు ప్రవేశింప లేదు. ప్రవేశించు వారిని మీరు అడ్డగించితిరి” అని యేసు చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన మాట. ధర్మశాస్త్ర పండితులు దేవుని సత్యాన్ని, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజలకు సహాయం చేయవలసినవారు, కానీ వారు జ్ఞానపు తాళాన్ని తమవద్దే ఉంచుకుని, ఇతరులు దేవుని దగ్గరకు రాకుండా అడ్డుకున్నారు. ఇది ఆధ్యాత్మిక నాయకులు, లేదా బోధకులు తమ స్థానాన్ని స్వార్థానికి, అధికారం కోసం ఉపయోగించినప్పుడు వచ్చే ప్రమాదాన్ని సూచిస్తుంది. నిజమైన నాయకుడు ఇతరులను దేవుని దగ్గరకు నడిపిస్తాడు, అడ్డుకోడు. నేను దేవుని గురించి, ఆయన సత్యం గురించి నాకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటున్నానా, లేదా దానిని నా స్వార్థం కోసం మాత్రమే వాడుకుంటున్నానా?

3. యేసును అపార్థం చేసుకోవడం మరియు అడ్డుకోవడం (లూకా 11:53-54). యేసు కఠినమైన మాటలు చెప్పినప్పుడు, ధర్మశాస్త్ర బోధకులు,, పరిసయ్యులు ఆయనను తీవ్రంగా వ్యతిరేకించారు. వారు ఆయనను తప్పు బట్టడానికి ప్రయత్నించారు. ఇది దేవుని సత్యం, ఆయన మాటలు మన పాపాలను, తప్పులను బయటపెట్టినప్పుడు మనం ఎలా స్పందిస్తామో సూచిస్తుంది. మనం మన తప్పులను అంగీకరించడానికి బదులుగా, దేవుని మాటలను, ఆయన సేవకులను విమర్శించవచ్చు లేదా అపార్థం చేసుకోవచ్చు. యేసు చెప్పిన మాటలు వారి అహంకారాన్ని, కపటాన్ని బయటపెట్టాయి, అందువల్ల వారు ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దేవుని వాక్యం నా జీవితంలోని తప్పులను బయటపెట్టినప్పుడు నేను ఎలా స్పందిస్తాను? నా తప్పులను అంగీకరించి పశ్చాత్తాపం చెందుతున్నానా, లేదా దానిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నానా?

ఈ వచనాలు మనల్ని మన హృదయాన్ని నిజాయితీగా పరిశీలించుకోవడానికి ఆహ్వానిస్తాయి. మనం దేవుని సేవకుల మాటలను వింటున్నామా, లేదా వారికి వ్యతిరేకంగా ఉన్నామా? మనం దేవుని జ్ఞానాన్ని ఇతరులకు పంచుకుంటున్నామా, లేదా మన స్వార్థం కోసం దానిని దాచుకుంటున్నామా? ఈ ధ్యానం ద్వారా, మనం క్రీస్తును, ఆయన సత్యాన్ని మన జీవితంలో సంపూర్ణంగా అంగీకరించడానికి కృపను పొందుదాం.

లూకా 11:42-46 - అధర్మ క్రియలు II

లూకా 11:42-46 - అధర్మ క్రియలు II

లూకా 11:42-46. అధర్మ క్రియలు II. ఈ వచనాల నుండి మనం మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలపై ధ్యానం చేయవచ్చు.

1. న్యాయం మరియు దేవుని ప్రేమను విస్మరించడం (లూకా 11:42). యేసు పరిసయ్యులను మందలించారు. వారు తమ మతపరమైన నియమాలను కచ్చితంగా పాటిస్తారు - చిన్న పుదీనా ఆకులో కూడా దశమ భాగం ఇస్తారు - కానీ న్యాయం, దేవుని ప్రేమ వంటి ముఖ్యమైన వాటిని విస్మరిస్తారు. ఇది మన క్రైస్తవ జీవితానికి ఒక ముఖ్యమైన పాఠం. మనం బాహ్య ఆచారాలకు, నియమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, అంతరంగంలో ఉన్న కరుణ, ప్రేమ, న్యాయం వంటి వాటిని విస్మరించే ప్రమాదం ఉంది. దేవునికి మన ప్రేమ, ఆయన ప్రజల పట్ల న్యాయం చాలా ముఖ్యం. దేవుని ప్రేమను అనుభవించి, ఇతరులకు ఆ ప్రేమను పంచడం అనేది అన్ని నియమాలకంటే గొప్పది. నా విశ్వాస జీవితంలో నేను బాహ్య ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానా, లేదా దేవుని ప్రేమను, న్యాయాన్ని అనుసరించడానికి కృషి చేస్తున్నానా?

2. అహంకారం మరియు పైకి కనిపించే భక్తి (లూకా 11:43-44). పరిసయ్యులు ప్రార్ధనామందిరాలలో ఉన్నత స్థానాలను, ప్రజల నుండి వందనాలు కోరుకున్నారు. వారి భక్తి దేవుని పట్ల కాకుండా ప్రజల దృష్టిలో గొప్పగా కనిపించడానికి ఉద్దేశించబడింది. వారు “పైకి కనిపించని సమాధుల వంటివారు” - బయట శుభ్రంగా, పవిత్రంగా కనిపించినా, లోపల వారు చెడుతో నిండి ఉన్నారు. ఇది మన జీవితంలో ఉన్న అహంకారానికి ప్రతీక. మనం మన భక్తిని ఇతరులకు చూపించడానికి ప్రయత్నిస్తే, అది దేవునికి విరుద్ధం అవుతుంది. నిజమైన భక్తి అనేది వినయంతో కూడుకుని, దేవునికి మాత్రమే మహిమను ఇస్తుంది. నేను నా భక్తిని ఇతరులకు చూపించడానికి ప్రయత్నిస్తున్నానా? నా హృదయంలో అహంకారం ఉందా?

3. ఇతరులపై భారాన్ని మోపడం (లూకా 11:46). యేసు ధర్మశాస్త్ర బోధకులను కూడా మందలించారు. వారు ఇతరులపై మోయడానికి కష్టమైన నియమాలను మోపారు, కానీ వారి స్వంత జీవితంలో వాటిని పాటించలేదు. ఇది ఒక నాయకుడు, ఉపాధ్యాయుడు లేదా తల్లిదండ్రిగా ఉన్న మనందరికీ ఒక హెచ్చరిక. మనం ఇతరులకు ఏదైనా బోధించే ముందు, మనం దానిని మన జీవితంలో అన్వయించుకోవాలి. కతోలిక విశ్వాసంలో, మన గురువులు, బిషప్‌లు మరియు ఇతర ఆధ్యాత్మిక నాయకులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. మనం కూడా ఇతరులపై భారాన్ని మోపకుండా, వారిని అర్థం చేసుకుని, ప్రేమతో సహాయం చేయాలి. నేను ఇతరులకు నేను పాటించలేని నియమాలను బోధిస్తున్నానా? ఇతరులపై భారాలను మోపే బదులు, వారికి సహాయం చేయడానికి నేను ఏమి చేయగలను? నేను ఇతరులకు నేను పాటించలేని నియమాలను బోధిస్తున్నానా? ఇతరులపై భారాలను మోపే బదులు, వారికి సహాయం చేయడానికి నేను ఏమి చేయగలను?

ఈ వచనాలు మనల్ని మన విశ్వాస జీవితాన్ని నిజాయితీగా పరిశీలించుకోవడానికి ఆహ్వానిస్తాయి. మనం దేవునికి మన హృదయాన్ని అంకితం చేస్తున్నామా, లేదా కేవలం బాహ్య ఆచారాలకు పరిమితం అవుతున్నామా? మన భక్తి అహంకారంతో కూడుకొని ఉందా, లేదా వినయంతో ఉందా? ఈ ధ్యానం ద్వారా, మనం క్రీస్తు వలె న్యాయం, ప్రేమ, మరియు వినయంతో కూడిన జీవితాన్ని గడపడానికి కృపను పొందుదాం.

లూకా 11:37-41 - అధర్మ క్రియలు I

లూకా 11:37-41 - అధర్మ క్రియలు I

లూకా 11:37-41. అధర్మ క్రియలు. ఈ వచనాల నుండి మనం మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలపై ధ్యానం చేయవచ్చు.

1. బాహ్య స్వచ్ఛత vs. అంతరంగ స్వచ్ఛత (లూకా 11:37-39). యేసు భోజనానికి ముందు శుద్ధి చేసుకోకపోవడం చూసి పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు. పరిసయ్యులకు మతపరమైన నియమాలు, సంప్రదాయాలు చాలా ముఖ్యం. వారు వాటిని ఖచ్చితంగా పాటిస్తారు. కానీ యేసు వారిని మందలించారు. “మీ పరిసయ్యులు గిన్నెలకు, పళ్ళెములకు, బాహ్యశుద్ది చేయుదురు. కానీ మీ అంతరంగము దౌర్జన్యముతో, దుష్టత్వముతో నిండియున్నది” అని యేసు అన్నారు. ఈ మాటలు దేవుడు బాహ్య ఆచారాల కన్నా మన అంతరంగ స్వచ్ఛతను ఎక్కువగా చూస్తాడని సూచిస్తున్నాయి. మనం కూడా తరచుగా బయటకు మంచి క్రైస్తవులుగా కనిపించడానికి ప్రయత్నిస్తాం - చర్చికి వెళ్ళడం, ప్రార్థనలు చేయడం, మంచి దుస్తులు ధరించడం వంటివి. కానీ మన హృదయం అసూయ, కోపం, అహంకారం, స్వార్థం వంటి పాపాలతో నిండి ఉంటే, దేవుని దృష్టిలో మన భక్తి నిష్ప్రయోజనం. నేను నా జీవితంలో బయట స్వచ్ఛతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానా, లేదా నా హృదయాన్ని శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానా?

2. దేవుని సంపూర్ణ సృష్టి (లూకా 11:40).అవివేకులారా! వెలుపలి భాగమును చేసినవాడు లోపలి భాగమును కూడ చేయలేదా?” అని యేసు అడుగుతారు. ఈ వాక్యం దేవుడు మన హృదయాన్ని, మన మనస్సును, మన శరీరంతో పాటు సృష్టించారని గుర్తు చేస్తుంది. ఆయన మనల్ని సంపూర్ణంగా ఎరుగుతారు. మనం బయట పవిత్రంగా ఉండి, లోపల అపవిత్రంగా ఉండలేము. దేవుడు మనల్ని సంపూర్ణంగా సృష్టించారు, ఆయనకు మన సంపూర్ణత కావాలి. మన అంతరంగం, మన బాహ్య జీవితం రెండూ దేవునికి పవిత్రంగా ఉండాలి. దేవుడు నా అంతరంగంలో ఉన్న పాపాలను కూడా చూస్తున్నారని నేను నమ్ముతున్నానా? నా అంతరంగం కూడా దేవునికి పవిత్రంగా ఉండాలి అని నేను గుర్తిస్తున్నానా?

3. ధర్మం ద్వారా శుభ్రత (లూకా 11:41). యేసు చివరగా, “మీకున్న దానిని పేదలకు ఒసగుడు. అప్పుడు అంతయు శుద్ధియగును” అని చెప్పారు. ఈ వాక్యం చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ఇక్కడ ధర్మం చేయడం అంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు, మన హృదయంలో ఉన్న దోపిడీని, దుర్మార్గతను వదిలిపెట్టి, పేదవారికి సహాయం చేయడం. మన స్వార్థాన్ని, దురాశను వదిలిపెట్టి, ఇతరులకు ప్రేమ, కరుణ, దయ చూపించినప్పుడు, మన హృదయం నిజంగా శుభ్రపడుతుంది. నిజమైన పశ్చాత్తాపం మరియు ధర్మం మన అంతరంగ స్వచ్ఛతకు దారితీస్తాయి. ఈ అంతరంగ మార్పు జరిగినప్పుడు, మన బాహ్య ఆచారాలు కూడా అర్ధవంతమవుతాయి. నేను చేసే ధర్మం నిజమైన ప్రేమ, కరుణ నుండి వస్తున్నాయా, లేదా కేవలం పేరు కోసం మాత్రమేనా? నా అంతరంగం శుభ్రం కావడానికి నేను ఏమి చేయాలి?

ఈ వచనాలు మనల్ని మన విశ్వాసాన్ని నిజాయితీగా పరిశీలించుకోవడానికి ఆహ్వానిస్తాయి. మన హృదయం శుభ్రంగా ఉందా? లేదా కేవలం బాహ్యంగానే మంచిగా కనిపిస్తున్నామా? ఈ ధ్యానం ద్వారా, మనం క్రీస్తు వలె అంతరంగ స్వచ్ఛతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, మన హృదయాన్ని పవిత్రం చేసుకోవడానికి కృషి చేద్దాం.

లూకా 11:27-28. ధన్యులు

లూకా 11:27-28. ధన్యులు

లూకా 11:27-28. ధన్యులు. ఈ వచనాల నుండి మనం మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలపై ధ్యానం చేయవచ్చు.

1. తల్లి యొక్క ధన్యత మరియు దానికన్నా గొప్ప ధన్యత (లూకా 11:27). యేసు బోధనలు, అద్భుతాలు చూసి జనసమూహంలో నుండి ఒక స్త్రీ ఆశ్చర్యపోయి, ఆయన తల్లిని ప్రశంసించింది. “నిన్ను మోసిన గర్భమును, నీకు పాలిచ్చిన స్తనములును ధన్యమైనవి!” అని ఆమె అన్నది. ఈ మాటలు దేవుని ప్రణాళికలో తల్లి పాత్ర యొక్క గొప్పతనాన్ని సూచిస్తాయి. పరిశుద్ధ మరియ, క్రీస్తు తల్లిగా, నిజంగా ధన్యురాలు. ఆమె దేవుని కుమారుడిని తన గర్భంలో మోసి, ఆయనకు జన్మనిచ్చింది. ఆమె ఈ లోకంలో అత్యంత ధన్యమైన స్త్రీ. ఆమెను ప్రశంసించడం సరైనదే, కతోలిక విశ్వాసంలో మనం ఆమెను ఈ కారణంగానే గౌరవిస్తాం. దేవుని ప్రణాళికలో పరిశుద్ధ మరియ యొక్క పాత్ర ఎంత గొప్పది? ఆమెను మనం ఎలా గౌరవిస్తాం?

2. దేవుని వాక్యం విని, పాటించడం యొక్క ప్రాముఖ్యత (లూకా 11:28). యేసు ఆ స్త్రీ యొక్క ప్రశంసను అంగీకరిస్తూ, దానిని ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సత్యం వైపు మళ్లించారు. “దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించు వారు మరింత ధన్యులు!” అని ఆయన అన్నారు. ఈ మాటలు దేవుని వాక్యాన్ని వినడం, దాన్ని మన జీవితంలో పాటించడం అనేది శారీరక సంబంధం కన్నా, లోకసంబంధమైన ప్రశంసల కన్నా గొప్పదని సూచిస్తాయి. పరిశుద్ధ మరియ యేసుకు తల్లి అయినప్పటికీ, ఆమె యొక్క నిజమైన గొప్పతనం ఆమె దేవుని వాక్యాన్ని విని, దాని ప్రకారం జీవించడమే. ఆమె “నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక” అని చెప్పి, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా అంగీకరించింది. అందువల్ల, ఆమె క్రీస్తుకు తల్లి మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా పాటించిన మొదటి శిష్యురాలు కూడా. నేను దేవుని వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వింటున్నాను? నేను దాన్ని నా జీవితంలో పాటించడానికి ఎంత ప్రయత్నిస్తున్నాను?

3. నిష్క్రియ భక్తిని నివారించడం. యేసు మాటలు మనకు ఒక హెచ్చరిక కూడా. మనం కేవలం క్రీస్తు గురించి వినడం, ఆయనను ప్రశంసించడం లేదా ఆయన అద్భుతాల గురించి తెలుసుకోవడం సరిపోదు. మన విశ్వాసం అనేది క్రియాశీలకంగా ఉండాలి. మనం దేవుని వాక్యాన్ని మన జీవితంలో అన్వయించు కోవాలి. కతోలిక విశ్వాసంలో, సకల ఆరాధన, ప్రార్థన, మంచి క్రియల ద్వారా మనం దేవుని వాక్యాన్ని మన జీవితంలో అనుసరిస్తాం. దేవుని వాక్యం మన జీవితాన్ని మార్చకపోతే, మనం కేవలం దాని గురించి విని, దానిని పక్కన పెడుతున్నాము. ఇది యేసు చెప్పిన ధన్యతను మనం కోల్పోవడానికి కారణమవుతుంది. నా విశ్వాసం కేవలం మాటలకే పరిమితం అయి ఉందా, లేదా అది నా జీవితంలో మార్పును తీసుకొచ్చిందా?

ఈ వచనాలు మనల్ని దేవునితో మన సంబంధాన్ని పునఃపరిశీలించు కోవడానికి ఆహ్వానిస్తాయి. క్రీస్తును ప్రశంసించడం మంచిదే, కానీ ఆయన వాక్యం విని, దాన్ని పాటించడం ద్వారా మనం నిజమైన ధన్యతను పొందుతాం. పరిశుద్ధ మరియ మనకు ఒక గొప్ప ఉదాహరణ, ఆమె దేవుని వాక్యాన్ని తన జీవితంలో అన్వయించుకుని, దాని ప్రకారం జీవించింది. ఈ ధ్యానం ద్వారా, మనం కూడా దేవుని వాక్యాన్ని వినడానికి, దాని ప్రకారం జీవించడానికి మనల్ని మనం అప్పగించుకుందాం.

లూకా 11:15-26. దైవము-దయ్యము; అపవిత్రాత్మ వలన దుర్దశ

లూకా 11:15-26. దైవము-దయ్యము; అపవిత్రాత్మ వలన దుర్దశ

లూకా 11:15-26. దైవము-దయ్యము; అపవిత్రాత్మ వలన దుర్దశ. ఈ వచనాల నుండి మనం మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలపై ధ్యానం చేయవచ్చు.

1. అద్భుతాల వెనుక ఉన్న శక్తి (లూకా 11:15-20). యేసు చేసిన అద్భుతాలను చూసి, కొందరు ఆయనను బెల్జబూలు సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు అవిశ్వాసం మరియు అపార్థం నుండి వచ్చాయి. యేసు వారికి స్పష్టమైన సమాధానం ఇచ్చారు, సాతాను తనకు తానుగా విడిపోడు, ఎందుకంటే అది అతని రాజ్యానికి హాని కలిగిస్తుంది. యేసు దేవుని శక్తితోనే అద్భుతాలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. మనం మన జీవితంలో గొప్ప విషయాలు చూసినప్పుడు, దానిని దేవుని శక్తికి కాకుండా, వేరే వాటికి ఆపాదించే ప్రమాదం ఉంది. ఈ వచనం మనం దేవుని శక్తిని, ఆయన మహిమను గుర్తించాలని బోధిస్తుంది. నేను దేవుడు చేసే గొప్ప పనులను గుర్తించడానికి బదులుగా వాటి వెనుక ఉన్న శక్తిని అపార్థం చేసుకుంటున్నానా?

2. క్రీస్తు వైపు లేదా క్రీస్తుకు వ్యతిరేకంగా (లూకా 11:21-23). యేసు తనను బలవంతుడిని జయించే బలవంతునిగా పోల్చుకున్నారు. ఇక్కడ బలవంతుడు సాతాను, అతన్ని జయించే బలవంతుడు యేసు. యేసు సాతానును ఓడించి, మనల్ని అతని నుండి విడిపిస్తారు. “నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు. నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టు వాడు.” ఈ వాక్యం మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధిస్తుంది, క్రీస్తు మార్గంలో మధ్యేమార్గం లేదు. మనం క్రీస్తుతో ఉంటే, మనం ఆయనతో కలిసి పనిచేస్తాం, లేకపోతే మనం ఆయనకు వ్యతిరేకంగా ఉంటాం. మనకు క్రీస్తుపై విశ్వాసం లేకపోతే, మన జీవితం గందరగోళం, నాశనం వైపు నడుస్తుంది. నేను క్రీస్తుతో కలిసి పని చేస్తున్నానా? నా జీవితం క్రీస్తుతో సంబంధం కలిగి ఉందా, లేదా ఆయన నుండి దూరంగా ఉందా?

3. తిరిగి పడిపోవడం యొక్క ప్రమాదం (లూకా 11:24-26). ఈ వచనాలు ఒక వ్యక్తి నుండి అపవిత్రాత్మ బయటకు వెళ్ళిన తర్వాత, అది తిరిగి వచ్చి, ఆ మనిషిలో నివసించడం గురించి మాట్లాడుతుంది. ఆ మనిషి యొక్క చివరి స్థితి మొదటి దానికన్నా చెడుగా ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన హెచ్చరిక. పాపాన్ని వదిలిపెట్టి, ఆ తర్వాత దేవునితో మన సంబంధాన్ని బలోపేతం చేసుకోకపోతే, మనం మరింత తీవ్రమైన పాపంలోకి తిరిగి పడిపోయే ప్రమాదం ఉంది. పాపవిమోచన తర్వాత, మనం మన హృదయాన్ని దేవుని వాక్యం, ప్రార్థన, సత్క్రియలు మరియు సకల ఆరాధనతో నింపాలి. మన జీవితం దేవునికి అంకితం చేయబడకపోతే, మనం పాపానికి తిరిగి ఒక మార్గాన్ని ఇస్తాం. నేను పాపాన్ని వదిలిపెట్టిన తర్వాత, నా జీవితాన్ని దేవునికి అంకితం చేయడానికి నేను ఏమి చేస్తున్నాను? నేను తిరిగి పాపంలో పడిపోకుండా ఉండటానికి ఎలా కృషి చేయాలి?

ఈ వచనాలు మనల్ని మన జీవితాన్ని నిజాయితీగా పరిశీలించుకోవడానికి ఆహ్వానిస్తాయి. మన హృదయం క్రీస్తుకు పూర్తిగా అంకితమై ఉందా? మనం పాపాన్ని వదిలిపెట్టిన తర్వాత, దేవునితో మన సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి కృషి చేస్తున్నామా? ఈ ధ్యానం ద్వారా, మనం క్రీస్తును మన ప్రభువుగా, మన రక్షకుడిగా అంగీకరించి, ఆయనతో ఉన్న మన బంధాన్ని మరింత లోతుగా చేసుకుందాం.

లూకా 11:1-4 - ప్రభు ప్రార్ధన

లూకా 11:1-4 - ప్రభు ప్రార్ధన

లూకా 11:1-4. ప్రభు ప్రార్ధన. ఈ వచనాల నుండి మనం మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలపై ధ్యానం చేయవచ్చు.

1. ప్రార్థన నేర్చుకోవడం ఒక అవసరం (లూకా 11:1). శిష్యులు యేసును ప్రార్థన చేయడం నేర్పించమని అడిగారు. ఇది ప్రార్థన కేవలం మనం సహజంగా చేసే పని కాదని, అది నేర్చుకోవలసిన, అభ్యసించవలసిన ఒక ఆధ్యాత్మిక మార్గం అని సూచిస్తుంది. గొప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి ప్రార్థన చాలా అవసరం. కతోలిక విశ్వాసంలో, ప్రార్థన దేవునితో మన సంబంధాన్ని బలోపేతం చేసుకునే మార్గం. ప్రార్థన నేర్పించమని శిష్యులు యేసును అడిగినట్లే, మనం కూడా దేవుని దగ్గర సరైన రీతిలో ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి. నేను ప్రార్థనను కేవలం ఒక కర్తవ్యంగా చూస్తున్నానా, లేదా దేవునితో నా వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకునే ఒక మార్గంగా భావిస్తున్నానా?

2. దేవుని ప్రాముఖ్యత (లూకా 11:2). ప్రభువు ప్రార్థనలో మొదటి భాగం దేవుని గురించి మాట్లాడుతుంది: “తండ్రీ, నీ నామము పవిత్ర పరపబడు గాక! నీ రాజ్యం వచ్చును గాక!” ఈ ప్రార్థనలో మనం మన గురించి కాకుండా దేవుని గురించి అడుగుతాం. దేవుని నామం, ఆయన రాజ్యము, ఆయన చిత్తం మన జీవితంలో ప్రథమ స్థానంలో ఉండాలని ఈ వాక్యం మనకు బోధిస్తుంది. మన ప్రార్థనలు మన సొంత అవసరాల గురించి మాత్రమే కాకుండా, దేవుని మహిమ, ఆయన చిత్తం నెరవేరడం కోసం కూడా ఉండాలి. ఇది మన ప్రార్థన జీవితాన్ని స్వార్థపూరితం కాకుండా దైవికంగా మారుస్తుంది. నా ప్రార్థనలు ఎక్కువగా నా సొంత కోరికల గురించి ఉన్నాయా, లేదా దేవుని మహిమ, ఆయన చిత్తం కోసం ఉన్నాయా?

3. మానవ అవసరాలు మరియు క్షమ (లూకా 11:3-4). ప్రభువు ప్రార్థనలో రెండవ భాగం మానవ అవసరాల గురించి మాట్లాడుతుంది: “మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిరోజు దయచేయుము. మా పాపములను క్షమించుము. ఏలయన, మేమును, మా ఋణస్థులందరును క్షమించు చున్నాము. మమ్ము శోధనలో చిక్కుకొన నీయకుము.” ఈ ప్రార్థన మనం మన శరీర, ఆత్మ సంబంధమైన అవసరాల కోసం దేవునిపై ఆధారపడతామని సూచిస్తుంది. ఇది మనకు కావలసిన వాటిని దేవుడు ఇస్తారని నమ్మకంతో అడగమని నేర్పిస్తుంది. ముఖ్యంగా, క్షమ అనేది చాలా ముఖ్యం. మనం మన పాపాలకు క్షమాపణ కోరే ముందు ఇతరులను క్షమించాలి. ఇది క్షమాపణ యొక్క శక్తిని, దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. దేవుని క్షమాపణ పొందడానికి, మనం మొదట ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. నేను ఇతరులను క్షమించకుండా, దేవుని నుండి క్షమాపణను కోరుకుంటున్నానా? నా హృదయంలో నేను ఎవరినైనా క్షమించకుండా ఉన్నానా?

‘ప్రభువు ప్రార్థన’ అనేది కేవలం ఒక ప్రార్థన కాదు, అది ఒక జీవిత మార్గదర్శి. ఈ ప్రార్థన దేవునితో ఎలా సంబంధం పెట్టుకోవాలో, ఆయనకు మొదటి స్థానం ఎలా ఇవ్వాలో, మరియు మన అవసరాల గురించి, క్షమాపణ గురించి ఎలా అడగాలో మనకు నేర్పిస్తుంది. ఈ ధ్యానం ద్వారా, మనం ఈ ప్రార్థన యొక్క లోతైన అర్థాన్ని తెలుసుకుని, మన ప్రార్థన జీవితాన్ని మరింత లోతుగా, అర్థవంతంగా మారుద్దాం.

లూకా 10:17-24 - తిరిగి వచ్చిన శిష్యులు, ప్రభువు పరమానందము

లూకా 10:17-24 - తిరిగి వచ్చిన శిష్యులు, ప్రభువు పరమానందము

లూకా 10:17-24. తిరిగి వచ్చిన శిష్యులు, ప్రభువు పరమానందము. ఈ వచనాల నుండి మనం మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలపై ధ్యానం చేయవచ్చు.

1. నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? (లూకా 10:17-20). డెబ్బైది ఇద్దరు శిష్యులు తాము సాధించిన విజయం చూసి ఆనందించారు. పిశాచములు కూడా వారికి లోబడటం వారిలో గొప్ప సంతోషాన్ని నింపింది. కానీ యేసు వారి సంతోషాన్ని ఒక ఉన్నతమైన లక్ష్యం వైపు మళ్లించారు: “మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి యున్నవని ఆనందింపుడు”. ఇది చాలా ముఖ్యమైన పాఠం. మనం మన ఆధ్యాత్మిక జీవితంలో, మనం చేసే గొప్ప పనుల కోసం, సాధించిన విజయాల కోసం సంతోషించ కూడదు. ఎందుకంటే అవి తాత్కాలికమైనవి. నిజమైన సంతోషం దేవునితో మన సంబంధంలో ఉంది, మన పేర్లు నిత్యజీవం కోసం పరలోకంలో వ్రాయబడ్డాయి అనే సత్యంలో ఉంది. మనం దేవుని అనుగ్రహాన్ని పొంది ఆయన బిడ్డలుగా మారడం, ఆయనతో నిత్యజీవంలో ఉండటం అనేది పిశాచములను వెళ్లగొట్టే శక్తి కంటే గొప్ప ఆశీర్వాదం. నేను నా విశ్వాస జీవితంలో నేను చేసే మంచి పనుల కోసం సంతోషిస్తున్నానా, లేదా దేవుడు నన్ను ప్రేమించి, నిత్యజీవానికి నన్ను ఎన్నుకున్నాడు అనే సత్యం కోసం సంతోషిస్తున్నానా?

2. దేవుని జ్ఞానం యొక్క రహస్యం (లూకా 10:21).నీవు ఈ విషయములను జ్ఞానులకును, వివేకులకును మరుగు పరచి, పసి బిడ్డలకు వీనిని  తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు” అని యేసు అన్నారు. ఈ వాక్యం దేవుని జ్ఞానం మానవ జ్ఞానం కన్నా భిన్నమైనదని సూచిస్తుంది. దేవుని సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచం యొక్క తెలివితేటలు, లేదా అహంకారం పనికిరావు. దానిని అర్థం చేసుకోవడానికి చిన్నపిల్లల వంటి వినయం, సరళత్వం అవసరం. మనం మన స్వంత జ్ఞానంపై ఆధారపడకుండా, దేవునిపై సంపూర్ణంగా ఆధారపడినప్పుడు, ఆయన మనకు తన రహస్యాలను బయలుపరుస్తారు. కతోలిక విశ్వాసంలో, దేవుని సత్యం మనకు సకల ఆరాధన, ప్రార్థన మరియు పవిత్ర గ్రంథం ద్వారా లభిస్తుంది. దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి నేను వినయంగా ఉన్నానా, లేదా నా సొంత తెలివితేటలపై ఆధారపడుతున్నానా?

3. మన అదృష్టాన్ని గుర్తించడం (లూకా 10:23-24).మీరు చూచెడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి! ప్రవక్తలు, రాజులు, అనేకులు మీరు చూచుచున్నవి చూడ గోరిరి. కాని చూడలేక పోయిరి.” ఈ మాటలు మనకున్న అదృష్టాన్ని, ఆధిక్యతను తెలియ జేస్తున్నాయి. పాత నిబంధనలోని ప్రవక్తలు, రాజులు యేసు రాక కోసం, ఆయన సందేశం కోసం ఎంతగానో ఎదురు చూశారు. కానీ వారు చూడని, వినని సత్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం, వింటున్నాం. మనం క్రీస్తు ద్వారా పొందిన విశ్వాసం, సత్యం, ఆశీర్వాదం ఎంత గొప్పవి అని ఈ వచనం మనకు గుర్తుచేస్తుంది. ఈ ఆధిక్యత మనకు ఒక బాధ్యతను కూడా ఇస్తుంది: మనం ఈ సత్యాన్ని ఇతరులకు ప్రకటించి, దాని ప్రకారం జీవించాలి. నాకున్న విశ్వాస ఆశీర్వాదాలను నేను ఎంత విలువైనవిగా భావిస్తున్నాను? వాటిని ఇతరులతో పంచుకోవడానికి నేను ఏమి చేయగలను?

ఈ వచనాలు మనల్ని మన హృదయాన్ని పరీక్షించుకోవడానికి ఆహ్వానిస్తున్నాయి. మన సంతోషం లోకసంబంధమైన విజయాలపై ఆధారపడి ఉందా, లేక దేవునితో ఉన్న మన సంబంధంపై ఆధారపడి ఉందా? దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మనం వినయంగా ఉన్నామా? మనకున్న ఆధ్యాత్మిక అదృష్టాన్ని మనం గుర్తిస్తున్నామా? ఈ ధ్యానం ద్వారా, మనం క్రీస్తును మరింత లోతుగా తెలుసుకుని, ఆయనను మన జీవితంలో సంపూర్ణంగా అనుసరించడానికి కృపను పొందుదాం.

లూకా 10:13-16 - అవిశ్వాస నగరములు

లూకా 10:13-16 - అవిశ్వాస నగరములు

లూకా 10:13-16. అవిశ్వాస నగరములు. ఈ వచనాల నుండి మనం మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలపై ధ్యానం చేయవచ్చు.

1. అవకాశాన్ని కోల్పోవడం (లూకా 10:13-15). యేసు కోరాజీను, బెత్సయిదా, మరియు కఫర్నాము పట్టణాలను గద్దించారు. ఎందుకంటే, అక్కడ అనేక అద్భుతాలు జరిగాయి, యేసు బోధనలను వారు విన్నారు, కానీ పశ్చాత్తాపం చెందడానికి నిరాకరించారు. యేసు వారికి దేవుని దయను, సత్యాన్ని స్వీకరించే గొప్ప అవకాశాన్ని ఇచ్చారు, కానీ వారు దానిని నిర్లక్ష్యం చేశారు. ఈ వచనాలు మనం కూడా దేవుని దయను, సువార్తను మన జీవితంలో ఎంతగా స్వీకరిస్తున్నామో ఆలోచించుకోవడానికి సహాయపడతాయి. మనకు దేవుని వాక్యం, సకల ఆరాధన, మరియు పశ్చాత్తాపపడే అవకాశం ఉన్నాయి. మనం వాటిని విలువైనవిగా భావిస్తున్నామా, లేక కోరాజీను, బెత్సయిదా ప్రజల వలె నిర్లక్ష్యం చేస్తున్నామా? నా జీవితంలో దేవుని దయను, ఆశీర్వాదాలను నేను ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నాను? వాటిని పూర్తిగా స్వీకరించడానికి నేను ఏమి చేయాలి?

2. దేవుని సందేశానికి బాధ్యత (లూకా 10:15). యేసు కఫర్నాము పట్టణాన్ని పాతాళమునకు పడద్రోయబడుదువని హెచ్చరించారు. ఇది తీర్పు యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. దేవుని వాక్యాన్ని, అద్భుతాలను చూసి కూడా పశ్చాత్తాపం చెందనివారికి తీర్పు చాలా కఠినంగా ఉంటుంది. మన విశ్వాస జీవితంలో, మనకు దేవుని వాక్యం, సకల ఆరాధన, మరియు మంచి పనులు చేయడానికి అవకాశాలు లభిస్తాయి. ఈ అవకాశాలను నిర్లక్ష్యం చేస్తే, మనం కూడా తీవ్రమైన తీర్పును ఎదుర్కోవలసి వస్తుంది. కతోలిక విశ్వాసంలో, దేవుడు మనకు ఇచ్చిన కృపను, సత్యాన్ని మనం బాధ్యతాయుతంగా స్వీకరించాలి. ఎందుకంటే, మనకు ఎక్కువ ఇవ్వబడినప్పుడు, మన నుండి ఎక్కువ ఆశించబడుతుంది. దేవుని వాక్యం పట్ల, ఆయన కృప పట్ల నా బాధ్యతను నేను ఎలా నిర్వర్తిస్తున్నాను? నా జీవితంలో నేను ఈ బాధ్యతను ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నాను?

3. క్రీస్తును, దేవునిని అంగీకరించడం లేదా తిరస్కరించడం (లూకా 10:16).మీ మాట ఆలకించు వాడు నా మాటలను ఆలకించును. మిమ్ము నిరాకరించు వాడు నన్నును నిరాకరించును. నన్ను నిరాకరించు వాడు నన్ను పంపిన వానిని నిరాకరించును”. ఈ వచనం క్రీస్తును అనుసరించే వారి ప్రాముఖ్యతను వెల్లడి చేస్తుంది. క్రీస్తును నమ్ముకున్నవారిని అంగీకరించడం, దేవునిని అంగీకరించడంతో సమానం. అలాగే, వారిని తిరస్కరించడం దేవునిని తిరస్కరించడంతో సమానం. కతోలిక విశ్వాసంలో, క్రీస్తు తన అధికారాన్ని సంఘానికి (తిరుసభకు) అప్పగించారు. అందువల్ల, మనం పోప్, బిషప్‌లు, మరియు ఇతర గురువుల ద్వారా బోధించబడే సువార్తను, సకల ఆరాధనను అంగీకరించాలి. వారిని తిరస్కరించడం క్రీస్తును తిరస్కరించడం, తద్వారా దేవునిని తిరస్కరించడం అవుతుంది. దేవుని సంఘం ద్వారా నాకు అందించబడే సువార్తను, ఆశీర్వాదాలను నేను అంగీకరిస్తున్నానా? నేను నా విశ్వాసాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నాను?

ఈ వచనాలు మన హృదయాన్ని పరీక్షించుకోవడానికి ఒక అవకాశం ఇస్తాయి. దేవుడు మనకు ఇచ్చిన అవకాశాలను మనం ఎలా ఉపయోగిస్తున్నాం? ఈ ధ్యానం ద్వారా, మనం దేవుని వాక్యాన్ని, ఆయన కృపను నిర్లక్ష్యం చేయకుండా, వాటిని హృదయపూర్వకంగా స్వీకరించడానికి కృషి చేద్దాం.

లూకా 9:57-62 - శిష్యుని లక్షణము

లూకా 9:57-62 - శిష్యుని లక్షణము

లూకా 9:57-62. శిష్యుని లక్షణము. ఈ వచనాల నుండి మనం మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలపై ధ్యానం చేయవచ్చు.

1. క్రీస్తును అనుసరించడానికి ఖర్చు (లూకా 9:57-58). మొదటి వ్యక్తి యేసును అనుసరించడానికి తన నిబద్ధతను తెలియజేశాడు. కానీ యేసు అతనికి క్రీస్తును అనుసరించడంలో ఉన్న కష్టాలను, త్యాగాలను స్పష్టం చేశారు. “మనుష్యకుమారునకు తల దాచుకొనుటకు ఇసుమంతైనను తావులేదు” అని యేసు చెప్పారు. ఇది క్రీస్తును అనుసరించేవాడు సౌకర్యవంతమైన, సులభమైన జీవితాన్ని ఆశించకూడదని సూచిస్తుంది. క్రీస్తు మార్గం తరచుగా కష్టాలతో కూడి ఉంటుంది. మనం మన స్వంత సౌకర్యాలను, భద్రతను, మరియు లోకసంబంధమైన కోరికలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, అది జీవితకాల నిబద్ధత, దానిలో మనకున్న సమయం, శక్తి, మరియు వనరులను క్రీస్తు కోసం త్యాగం చేయాలి. నేను క్రీస్తును అనుసరించడానికి నా జీవితంలో ఏమి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను? సౌకర్యవంతమైన జీవితాన్ని ఆశిస్తున్నానా, లేక ఆయన మార్గాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నానా?

2. క్రీస్తు మార్గానికి మొదటి స్థానం ఇవ్వడం (లూకా 9:59-60). రెండవ వ్యక్తి, నన్ను అనుసరింపుము” అని యేసు చెప్పినప్పుడు, తన తండ్రిని సమాధి చేసి వచ్చుటకు సెలవిమ్ము అని మనవి చేసాడు. ఇది సహజంగా ఒక మంచి, న్యాయమైన కోరిక. కానీ యేసు జవాబు చాలా కఠినంగా ఉంది: “మృతులు  తమ మృతులను  సమాధి చేయనిమ్ము. కాని నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటింపుము”. ఈ మాటలు క్రీస్తును అనుసరించడంలో అత్యవసరతను, ప్రాముఖ్యతను తెలియ జేస్తున్నాయి. దేవుని రాజ్యానికి సంబంధించిన కార్యంనకు మనం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మన కుటుంబ బాధ్యతలు, లేదా ఇతర లోకసంబంధమైన పనులు ముఖ్యమైనవే అయినప్పటికీ, అవి దేవుని పిలుపుకు అడ్డుగా ఉండకూడదు. క్రీస్తుకు మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలి. నా జీవితంలో దేవుని పిలుపుకు అడ్డుగా ఉన్న విషయాలు ఏమిటి? నేను దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి, సేవ చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నానా?

3. వెనక్కి చూడకుండా ముందుకు సాగడం (లూకా 9:61-62). మూడవ వ్యక్తి తన కుటుంబాన్ని వదిలిరావడానికి అనుమతి అడిగాడు, ఇది కూడా సహజమైన కోరికలా అనిపిస్తుంది. కానీ యేసు, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు ఎవ్వడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు” అని అన్నారు. ఈ మాటలు వెనక్కి చూడకూడదని సూచిస్తున్నాయి. నాగలి దున్నేవాడు వెనక్కి చూస్తే, సరైన మార్గంలో దున్నలేడు. అలాగే, క్రీస్తును అనుసరించే మనం వెనక్కి తిరిగి మన పాత జీవితాన్ని, మన పాత కోరికలను, లేదా మనం వదిలిపెట్టిన వాటిని చూస్తూ ఉంటే, మనం క్రీస్తు మార్గంలో సరైన రీతిలో నడవలేం. క్రీస్తును అనుసరించడానికి మనం సంపూర్ణంగా, హృదయపూర్వకంగా నిబద్ధత కలిగి ఉండాలి. నేను క్రీస్తును అనుసరించడానికి వెనక్కి చూస్తున్నానా? నా పాత అలవాట్లు, పాపాలు లేదా లోకసంబంధమైన ఆలోచనలు నన్ను ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నాయా?

ఈ వచనాలు మనల్ని దేవుని పిలుపుకు మనం ఎలా స్పందిస్తున్నామో ఆలోచింపజేస్తాయి. క్రీస్తును అనుసరించడం కేవలం ఒక మాట కాదు, అది మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు అప్పగించడం. ఈ ధ్యానం ద్వారా, మనం క్రీస్తు మార్గంలోని కష్టాలను అంగీకరించడానికి, ఆయనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడానికి, మరియు వెనక్కి చూడకుండా ఆయనను సంపూర్ణంగా అనుసరించడానికి కృపను పొందుదాం.

లూకా 9:51-56 సమరీయుల నిరాకరణ

లూకా 9:51-56 సమరీయుల నిరాకరణ

లూకా 9:51-56 సమరీయుల నిరాకరణ. ఈ వచనాల నుండి మనం మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలపై ధ్యానం చేయవచ్చు.

1. క్రీస్తు యొక్క దృఢ సంకల్పం (లూకా 9:51).ఆయన యెరూషలేముకు వెళ్లాలని దృఢంగా నిశ్చయించుకున్నారు.” ఈ వాక్యం యేసు యొక్క సంకల్పం, ఆయన అంతిమ లక్ష్యం పట్ల ఉన్న అచంచలమైన నిబద్ధతను తెలియజేస్తుంది. ఆయనకు యెరూషలేములో శ్రమలు, బాధలు మరియు సిలువ మరణం ఎదురు చూస్తున్నాయని తెలుసు. అయినప్పటికీ, ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ధైర్యంగా ముందుకు సాగారు. ఇది మన క్రైస్తవ జీవితానికి ఒక గొప్ప ఉదాహరణ. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో కష్టాలు, సవాళ్లు ఎదురైనా, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి క్రీస్తు వలె దృఢంగా ఉండాలి. మన విశ్వాస మార్గంలో వెనకడుగు వేయకుండా, ధైర్యంగా ముందుకు సాగాలి. నా జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఎంత దృఢంగా ఉన్నాను? కష్టాలు ఎదురైనప్పుడు నేను వెనుకంజ వేస్తున్నానా?

2. తిరస్కరణను అంగీకరించడం (లూకా 9:53). సమరీయ ప్రజలు యేసును అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన యెరూషలేముకు వెళ్తున్నారు, ఇది వారి మతపరమైన విభేదాలకు సంబంధించిన విషయం. మన జీవితంలో కూడా ఇలాంటి తిరస్కరణలు ఎదురవుతాయి. మనం క్రీస్తు మార్గాన్ని అనుసరించినప్పుడు, మన విశ్వాసం కారణంగా మన కుటుంబం, స్నేహితులు లేదా సమాజం నుండి తిరస్కరణకు గురికావచ్చు. క్రీస్తు తన మార్గాన్ని కొనసాగించినట్లే, మనం కూడా తిరస్కరణను ఎదుర్కొన్నప్పుడు నిరుత్సాహపడకుండా, పగ సాధించకుండా, దేవునిపై నమ్మకంతో ముందుకు సాగాలి. నా విశ్వాసం కారణంగా నేను ఎక్కడైనా తిరస్కరణకు గురయ్యానా? నేను దానిని క్రీస్తు వలె శాంతంగా, క్షమించే మనస్సుతో అంగీకరించగలనా?

3. దేవుని ఆత్మ మరియు ప్రతీకార భావం (లూకా 9:54-56). శిష్యులు యాకోబు, యోహాను సమరీయ ప్రజలపై కోపంతో ఆకాశం నుండి అగ్నిని రప్పించాలని కోరారు. ఇది మనలోని ప్రతీకార భావానికి ప్రతీక. కానీ యేసు వారిని గద్దించి, మనుష్యకుమారుడు మనుష్యుల ప్రాణాలను నాశనం చేయడానికి రాలేదు, వాటిని రక్షించడానికి వచ్చారు అని చెప్పారు. ఈ వాక్యం క్రీస్తు ప్రేమ, దయ మరియు క్షమ యొక్క సందేశాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది. మన కతోలిక విశ్వాసంలో, క్రీస్తు యొక్క మార్గం ప్రేమ, క్షమ, మరియు దయ. పగ, ప్రతీకారం దేవుని ఆత్మకు సంబంధించినవి కాదు. మనం ఇతరుల తప్పులకు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకున్నప్పుడు, మనం క్రీస్తు ఆత్మను కాకుండా మరొక ఆత్మను కలిగి ఉన్నామని గుర్తించాలి. నేను ఇతరుల తప్పులకు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నానా? నేను నా హృదయాన్ని క్షమకు, దయకు ఎలా తెరవగలను?

ఈ వచనాలు మనల్ని క్రీస్తు మార్గాన్ని లోతుగా పరిశీలించమని కోరుతున్నాయి. మనం క్రీస్తు వలె దృఢ సంకల్పంతో ఉన్నామా? తిరస్కరణను శాంతంగా అంగీకరించగలమా? మన హృదయం దయ, క్షమతో నిండి ఉందా, లేదా ప్రతీకారంతో ఉందా? ఈ ధ్యానం ద్వారా, మనం క్రీస్తు ఆత్మను ధరించి, ఆయన వలె లోకానికి సేవ చేయడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం.

యోహాను 1:47-51 యేసు - నతనయేలు

యోహాను 1:47-51 యేసు - నతనయేలు

యోహాను 1:47-51. ఈ వచనాల నుండి మనం మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలపై ధ్యానం చేయవచ్చు.

1. నతనయేలు యొక్క సరళత్వం మరియు నిజాయితీ (యోహాను 1:47). యేసు నతనయేలును చూడగానే, ఇదిగో, కపటము లేని నిజమైన ఇశ్రాయేలీయుడు అని అన్నారు. ఈ మాటలు నతనయేలు యొక్క స్వభావం గురించి చెబుతున్నాయి. ఇశ్రాయేలీయుడైనప్పటికీ, ఆయనలో కపటం లేదు. దేవునికి సత్యం, నిజాయితీ చాలా ముఖ్యం. మనం తరచుగా ఇతరులను మెప్పించడానికి లేదా మనకు లాభం పొందడానికి కపటంగా ప్రవర్తిస్తాం. కానీ దేవుని ముందు మన హృదయాలు తెరిచి ఉండాలి. నతనయేలు యొక్క సరళత్వం అతనికి దేవుని సత్యాన్ని స్వీకరించేలా చేసింది. మనం కూడా నతనయేలులాగా కపటం లేకుండా, నిజాయితీగా దేవుని ముందు ఉండటానికి ప్రయత్నించాలి. నా జీవితంలో నేను ఎక్కడ కపటంగా ప్రవర్తిస్తున్నాను? దేవుని ముందు నేను నిజాయితీగా ఉన్నానా?

2. క్రీస్తు మన హృదయాలను ఎరుగుతాడు (యోహాను 1:48). నతనయేలు “మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు? అని అడిగాడు. అందుకు యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక పూర్వమే, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూచితిని” అని జవాబిచ్చారు. ఈ మాటలు యేసు యొక్క సర్వజ్ఞానమును, దైవత్వాన్ని వెల్లడి చేస్తాయి. ఆయన మనల్ని పేరుతో మాత్రమే కాదు, మన హృదయంలో దాగి ఉన్న విషయాలను కూడా ఎరుగుతారు. మనం ఎక్కడ ఉన్నాం, ఏమి చేస్తున్నాం, ఏమి ఆలోచిస్తున్నాం - అన్నీ ఆయనకు తెలుసు. నతనయేలు ఈ సత్యాన్ని గ్రహించి వెంటనే యేసును “దేవుని కుమారుడు” అని ఒప్పుకున్నాడు. ఇది మన విశ్వాసానికి కూడా పునాది. దేవుడు మనల్ని వ్యక్తిగతంగా, లోతుగా ఎరుగుతాడు అనే జ్ఞానం మనకు శాంతిని, ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు నా హృదయాన్ని ఎరుగుతాడు అనే సత్యం నా జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అది నాకు భయాన్ని కలిగిస్తుందా, లేదా శాంతిని ఇస్తుందా?

3. క్రీస్తు మార్గం: నిచ్చెన మరియు నిత్య సంబంధం (యోహాను 1:50-51). నతనయేలు యొక్క ఒప్పుకోలుకు యేసు, ఇంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు” అని చెప్పారు. “పరమండలము తెరువ బడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూచెదరు” అని వాగ్దానం చేశారు. ఈ మాటలు యాకోబు చూసిన నిచ్చెన దర్శనాన్ని సూచిస్తాయి (ఆదికాండం 28:12). ఆ నిచ్చెన ఆకాశానికి, భూమికి మధ్య ఒక వారధి. యేసు తానే ఆ నిచ్చెన. ఆయన దేవునికి, మానవులకు మధ్య వారధిగా ఉన్నారు. ఆయన ద్వారానే మనం దేవుని దగ్గరకు వెళ్లగలం. నతనయేలు విశ్వాసం కేవలం చిన్న అద్భుతంపై ఆధారపడి లేదు, కానీ క్రీస్తు యొక్క సంపూర్ణ దైవత్వంపై ఆధారపడి ఉంటుంది. యేసు మనకు నిత్యజీవాన్ని, దేవునితో ఒక నిత్య సంబంధాన్ని ఇస్తారు. నేను యేసును దేవునికి, నాకు మధ్య ఉన్న వారధిగా చూస్తున్నానా? ఆయన ద్వారా నిత్యజీవాన్ని, దేవునితో సంబంధాన్ని ఎలా పొందగలను?

ఈ వచనాలు మనల్ని దేవునితో మన సంబంధాన్ని పునఃపరిశీలించుకోవడానికి ఆహ్వానిస్తాయి. నతనయేలులాగా మనం కపటం లేకుండా, నిజాయితీగా దేవుని దగ్గరకు రావాలి. ఆయన మనల్ని సంపూర్ణంగా ఎరుగుతారని నమ్మాలి. అప్పుడు మాత్రమే మనం ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలను, నిత్యజీవాన్ని అనుభవించగలం. ఈ ధ్యానం ద్వారా, మనం క్రీస్తును మరింత లోతుగా తెలుసుకుని, ఆయనను మన జీవితంలో సంపూర్ణంగా అనుసరించడానికి కృపను పొందుదాం.

లూకా 9:43-45 - యేసు మరణము గూర్చిన ప్రవచనము.

లూకా 9:43-45. యేసు మరణము గూర్చిన ప్రవచనము.

లూకా 9:43-45. యేసు మరణము గూర్చిన ప్రవచనము. ఈ వచనాల నుండి మనం మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలపై ధ్యానం చేయవచ్చు.

1. లోకసంబంధమైన కీర్తిని దాటి చూడటం (లూకా 9:43). ప్రజలందరూ యేసు చేసిన అద్భుతాలు చూసి, ఆయనను కీర్తించారు. వారు ఆయన శక్తిని, గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ సమయంలో, యేసు తన శిష్యులకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేశారు: ఈ లోకసంబంధమైన గొప్పతనం తాత్కాలికం. ఆయన తన రాకకు ఉన్న నిజమైన ఉద్దేశ్యాన్ని వారికి బోధించారు - అది సిలువ, బాధలు, మరియు త్యాగం. మనం కూడా తరచుగా మన విశ్వాస జీవితంలో దేవుని గొప్పతనాన్ని చూస్తాం, కానీ దాని వెనుక ఉన్న కష్టాలను, శ్రమలను విస్మరిస్తాం. దేవుని మహిమ కేవలం అద్భుతాలలో మాత్రమే కాదు, ఆయన పడే శ్రమలలో, ఆయన మన కోసం చేసిన త్యాగంలో కూడా ఉందని మనం గ్రహించాలి. నా విశ్వాస జీవితంలో నేను దేవుని నుండి కేవలం ఆశీర్వాదాలు, అద్భుతాలు మాత్రమే ఆశిస్తున్నానా, లేక ఆయన కష్టాలలో, శ్రమలలో కూడా ఆయనను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నానా?

2. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకున్న అడ్డంకులు (లూకా 9:44).మనుష్యకుమారుడు ప్రజల చేతికి అప్పగించబడబోవుచున్నాడు” అని యేసు చెప్పినప్పుడు, శిష్యులకు అది అర్థం కాలేదు. ఇది కేవలం ఒక జ్ఞాన లోపం కాదు, అది వారి హృదయాలను అడ్డగించిన ఒక అజ్ఞానం. వారు యేసును ఒక రాజకీయ నాయకుడిగా, రోము నుండి తమను విడిపించేవానిగా ఊహించుకున్నారు. ఆయన శ్రమల గురించి మాట్లాడినప్పుడు, అది వారి ఆలోచనలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. మనం కూడా కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని మనకు నచ్చినట్లుగా, మన ఆలోచనలకు సరిపోయేట్లుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ దేవుని వాక్యాన్ని దాని సంపూర్ణతలో స్వీకరించాలంటే, మన సొంత ఊహలను, అంచనాలను పక్కన పెట్టాలి. దేవుని వాక్యం అర్థం చేసుకోవడంలో నాకు ఉన్న అడ్డంకులు ఏమిటి? నా సొంత ఆలోచనలు, అంచనాలు దేవుని సత్యానికి అడ్డుగా ఉన్నాయా?

3. భయం మరియు మౌనం (లూకా 9:45). శిష్యులు యేసు మాటలను అర్థం చేసుకోలేకపోయినప్పటికీ, దాని గురించి ఆయనను అడగడానికి భయపడ్డారు. వారు ఆయనను ప్రశ్నిస్తే, ఆయనకు కోపం వస్తుందని లేదా వారు బలహీనంగా కనిపిస్తారని భయపడి ఉంటారు. ఇది మన క్రైస్తవ జీవితంలో కూడా జరుగుతుంది. మనం కొన్నిసార్లు దేవుని వాక్యంలో లేదా విశ్వాసంలో కొన్ని విషయాలను అర్థం చేసుకోలేకపోయినప్పటికీ, ఇతరులు ఏమనుకుంటారోనని భయపడి వాటి గురించి అడగడానికి సందేహిస్తాం. కానీ నిజమైన శిష్యుడి లక్షణం ఏమిటంటే, నిస్సంకోచంగా జ్ఞానాన్ని, సహాయాన్ని కోరడం. మన భయం మనకు దేవుని సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని అడ్డగిస్తుంది. దేవుని గురించి లేదా నా విశ్వాసం గురించి నేను అడగడానికి భయపడే ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఆ భయాన్ని అధిగమించడానికి నేను ఏమి చేయాలి?

ఈ వచనాలు మన విశ్వాస ప్రయాణాన్ని సూచిస్తాయి. దేవుని శక్తిని చూసి ఆనందించే దశ, ఆ తర్వాత ఆయన మార్గంలోని కష్టాలను ఎదుర్కొనే దశ. మనం దేవుని సత్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే, మన సొంత అంచనాలను వదిలిపెట్టి, భయం లేకుండా ఆయనను అడగడానికి ధైర్యం చేయాలి. ఈ ధ్యానం ద్వారా, మనం క్రీస్తు మార్గంలోని బాధలను కూడా అంగీకరించడానికి, ఆయనను మరింత లోతుగా తెలుసుకోవడానికి కృపను పొందుదాం.

లూకా 9:18-22. యేసు ప్రశ్న – పేతురు [నా] సమాధానము

లూకా 9:18-22. యేసు ప్రశ్న – పేతురు [నా] సమాధానము

లూకా 9:18-22. యేసు ప్రశ్న – పేతురు సమాధానము. ఈ వచనాల నుండి మనం మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలపై ధ్యానం చేయవచ్చు.

1. ప్రార్థన మరియు ఏకాంతం యొక్క ప్రాముఖ్యత (లూకా 9:18). గొప్ప అద్భుతాలు చేసి, ప్రజల మధ్య ఉన్నప్పటికీ, యేసు తన తండ్రితో ఏకాంతంగా గడపడానికి సమయం కేటాయించారు. ఇది మనకు ప్రార్థన, ఏకాంతం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. మన జీవితంలో ఎన్ని పనులు ఉన్నా, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మనం సమయాన్ని వెచ్చించాలి. ఏకాంతంలో ప్రార్థన చేయడం మన విశ్వాసాన్ని లోతుగా చేస్తుంది. అప్పుడే మనం మన జీవిత లక్ష్యం గురించి, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతల గురించి స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. నేను నా బిజీ జీవితంలో దేవునితో ఏకాంతంగా గడపడానికి సమయం కేటాయిస్తున్నానా?

2. క్రీస్తును ఎవరు అని ఒప్పుకోవడం (లూకా 9:19-20). యేసు తన శిష్యులను అడిగిన ప్రశ్న చాలా ముఖ్యం: “ప్రజలు నేను ఎవరినని భావించు చున్నారు?” ఆ తర్వాత, మరి నేను ఎవరినని మీరు భావించు చున్నారు?” అని అడిగారు. ప్రజలు చెప్పిన సమాధానాలు యేసును గొప్ప ప్రవక్తగా చూశాయి. కానీ పేతురు, నీవు దేవుని క్రీస్తువు” అని సరైన సమాధానం ఇచ్చాడు. ఇది కేవలం ఒక జ్ఞానం కాదు, అది దేవుడు అతనికి ఇచ్చిన ప్రత్యక్షత. కతోలిక విశ్వాసంలో, ప్రతి ఒక్కరూ క్రీస్తును వ్యక్తిగతంగా ‘ఎవరు’ అని ఒప్పుకోవాలి. మనం ఆయనను కేవలం ఒక చరిత్ర వ్యక్తిగా, ఒక బోధకుడిగా, లేదా ఒక గొప్ప మనిషిగా మాత్రమే చూస్తున్నామా, లేక మన వ్యక్తిగత రక్షకుడిగా, ప్రభువుగా ఒప్పుకుంటున్నామా? మనకు క్రీస్తుతో ఉన్న సంబంధం మన విశ్వాసానికి పునాది. నేను యేసును ఎవరు అని ఒప్పుకుంటున్నాను? నా జీవితంలో ఆయన పాత్ర ఏమిటి?

3. క్రీస్తు మార్గం: సిలువ మరియు పునరుత్థానం (లూకా 9:21-22). పేతురు క్రీస్తును ఒప్పుకున్న తర్వాత, యేసు వెంటనే తన శిష్యులకు తన సిలువ మార్గం గురించి చెప్పారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించారు, ఎందుకంటే ప్రజలు క్రీస్తును ఒక రాజకీయ రాజుగా లేదా తమ లోకసంబంధమైన అవసరాలు తీర్చేవానిగా భావించే ప్రమాదం ఉంది. యేసు మార్గం సిలువ మార్గం. ఆయన శ్రమలు అనుభవించి, తిరస్కరించబడి, చంపబడి, మూడవ రోజున తిరిగి లేవాలి. ఇది క్రీస్తును అనుసరించే మనందరికీ ఒక ముఖ్యమైన పాఠం. మనం క్రీస్తుతో ఆయన కీర్తిని పంచుకోవాలంటే, ఆయన శ్రమలలో కూడా పాలుపంచుకోవాలి. క్రీస్తు మార్గంలో కష్టాలు, తిరస్కరణలు ఉంటాయి, కానీ దాని ముగింపు పునరుత్థానం మరియు నిత్యజీవం. క్రీస్తును అనుసరించడంలో శ్రమలు ఉంటాయని నేను అంగీకరిస్తున్నానా? సిలువను నా జీవితంలో భాగం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానా?

ఈ వచనాలు మనల్ని దేవునితో మన సంబంధాన్ని పునఃపరిశీలించుకోవడానికి ఆహ్వానిస్తాయి. మనం దేవునితో ప్రార్థనలో ఎంత సమయం గడుపుతున్నాం? మన మనస్సులో, మన హృదయంలో యేసు ఎవరు? ఆయన మార్గం సిలువ మార్గమని మనం అర్థం చేసుకుంటున్నామా? ఈ ధ్యానం ద్వారా మనం క్రీస్తును మరింత లోతుగా తెలుసుకుని, ఆయనను మన జీవితంలో సంపూర్ణంగా అనుసరించడానికి కృపను పొందుదాం.

లూకా 9:7-9. హేరోదు [నా] కలవరపాటు

లూకా 9:7-9. హేరోదు [నా] కలవరపాటు

లూకా 9:7-9. హేరోదు కలవరపాటు. “హేరోదు యేసును గూర్చి అంతయు విని, కలవర పడెను... హేరోదు ఆయనను చూడగోరెను.” ఈ వచనాల నుండి మనం మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక అంశాలపై ధ్యానం చేయవచ్చు.

1. చెడు మనస్సాక్షి యొక్క గందరగోళం (లూకా 9:7). హేరోదు రాజు యేసు గురించి విన్నప్పుడు, ఆయన గందరగోళానికి గురయ్యాడు. యేసు చేస్తున్న అద్భుతాలు, బోధనలు అతని మనస్సులో ఒక కల్లోలాన్ని సృష్టించాయి. ఈ గందరగోళం తన గతంలో చేసిన పాపం నుండి వచ్చింది. హేరోదు యోహాను బాప్తిస్మమిచ్చువానిని అన్యాయంగా చంపించాడు. ఇప్పుడు యేసును గురించి విన్నప్పుడు, తన చర్యలకు దేవుడు ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారేమోనని భయపడ్డాడు. ఇది చెడు మనస్సాక్షి యొక్క ఫలితం. మనం చేసిన పాపాలు మన జీవితంలో శాంతిని లేకుండా చేసి, మన మనస్సులో గందరగోళాన్ని సృష్టిస్తాయి. పశ్చాత్తాపం చెంది, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోనంత కాలం, ఈ గందరగోళం మనల్ని వెంటాడుతుంది. నా జీవితంలో ఏ పాపాలు నా మనస్సుకు శాంతిని లేకుండా చేస్తున్నాయి? నేను వాటి గురించి పశ్చాత్తాపం చెంది, క్రీస్తు దగ్గరకు వస్తున్నానా?

2. యేసును అర్థం చేసుకోవడంలో ఉన్న తప్పుడు ఆలోచనలు (లూకా 9:7-8). కొంతమంది యేసును యోహానుగా, మరికొంతమంది ఏలియాగా, ఇంకొంతమంది పూర్వ ప్రవక్తలలో ఒకరిగా భావించారు. ఈ ప్రజలందరూ యేసును ఒక ప్రవక్తగా, దేవుని మనిషిగా మాత్రమే చూశారు, కానీ ఆయన దేవుని కుమారుడని, రక్షకుడని వారు గుర్తించలేకపోయారు. కతోలిక విశ్వాసంలో, యేసు క్రీస్తు నిజమైన దేవుడు, నిజమైన మానవుడు. మనం తరచుగా యేసును మనకు అనుకూలమైన రూపంలో చూస్తాం - ఆయన ఒక గొప్ప గురువు, ఒక నీతిమంతుడు లేదా ఒక అద్భుతాలు చేసేవాడు - కానీ ఆయన మనకు పాపవిమోచనను ఇచ్చే దైవిక కుమారుడని మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. మనం యేసును సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి, ఆయన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. యేసును నేను ఎవరుగా చూస్తున్నాను? కేవలం ఒక గురువుగానా, లేదా నా ప్రభువు, రక్షకుడిగానా?

3. యేసును చూడాలనే కోరిక (లూకా 9:9). "నేను యోహాను తల తీయించితిని గదా! మరి నేను వినుచున్న వార్తలన్నియు ఎవరిని గురించియై ఉండవచ్చును" అని హేరోదు ప్రశ్నించుకుని, యేసును చూడడానికి ప్రయత్నించాడు. హేరోదు యొక్క కోరిక నిజమైన విశ్వాసం నుండి రాలేదు, అది భయం, ఆందోళన, మరియు కుతూహలం నుండి వచ్చింది. చాలామంది ప్రజలు అద్భుతాలను చూసి, దాని వెనుక ఉన్న వ్యక్తి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు, కానీ క్రీస్తును అనుసరించడానికి వారి జీవితాలను మార్చుకోరు. మనకు కూడా యేసును చూడాలనే కోరిక ఉండాలి, కానీ అది ఆయన మాటలను విని, ఆయనను అనుసరించడానికి, మన జీవితాలను మార్చుకోవడానికి ఉండాలి. క్రీస్తును చూడాలనే మన కోరిక నిజమైన సంబంధం కోసమై, ఆయన ప్రేమను అనుభవించడం కోసమై ఉండాలి. నేను యేసును చూడాలని ఎందుకు కోరుకుంటున్నాను? నిజమైన సంబంధం కోసం లేదా కేవలం ఒక కుతూహలం కోసం మాత్రమేనా?

ఈ వచనాలు మన హృదయాన్ని పరీక్షించుకోవడానికి ఒక అవకాశంను ఇస్తున్నాయి. మనం యేసును ఎలా చూస్తున్నాం? మన జీవితంలో పాపం నుండి కలిగిన గందరగోళం ఉందా? మనం యేసును నిజంగా తెలుసుకోవడానికి, ఆయనతో ఒక వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? ఈ ధ్యానం ద్వారా, మనం క్రీస్తును మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, ఆయనతో మన బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి సహాయం పొందుదాం.

లూకా 9:1-6 - సువార్త ప్రచారం

లూకా 9:1-6 - సువార్త ప్రచారం

లూకా 9:1-6. సువార్త ప్రచారం. యేసు తన పన్నెండుమంది శిష్యులను పంపిస్తూ వారికి ఈ ఉపదేశాన్ని చేసారు. ఈ వచనాల నుండి మనం మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలపై ధ్యానం చేయవచ్చు.

1. దేవుడు మనకు శక్తిని ఇస్తాడు (లూకా 9:1). యేసు తన శిష్యులకు కేవలం ఒక పనిని, బాధ్యతను (సువార్త ప్రచారం) అప్పగించలేదు, దాన్ని నెరవేర్చడానికి అవసరమైన శక్తిని, అధికారాన్ని కూడా ఇచ్చారు. ఈ శక్తి దయ్యాలను పారద్రోలడానికి, వ్యాధులను పోగొట్టుటకు ఉద్దేశించబడింది. కతోలిక విశ్వాసంలో, దేవుడు మనకు అప్పగించిన ప్రతి బాధ్యతకు, ఆయన ఆ బాధ్యతను నెరవేర్చడానికి అవసరమైన కృపను, శక్తిని కూడా ఇస్తారని మనం నమ్ముతాం. జ్ఞానస్నానం ద్వారా మనం కూడా క్రీస్తు శిష్యులుగా మారతాం. దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి, అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచడానికి మనందరికీ ఒక బాధ్యత ఉంది. ఈ బాధ్యతను నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ ద్వారా మనకు శక్తి లభిస్తుంది. దేవుడు నాకు ఏ శక్తిని ఇచ్చాడు? నేను ఆ శక్తిని ఎలా ఉపయోగిస్తున్నాను?

2. దేవునిపై సంపూర్ణ నమ్మకం (లూకా 9:2-5). యేసు తన శిష్యులకు కొన్ని కఠినమైన సూచనలు ఇచ్చారు: “ప్రయాణం చేయునపుడు, కర్ర, సంచి, రొట్టె, ధనము తీసుకొని పోరాదు. రెండు అంగీలను కూడా తీసుకొని పోరాదు.” ఈ సూచనలు దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉంచడానికి ఒక పరీక్ష. శిష్యులు తమ అవసరాల కోసం లోకసంబంధమైన వనరులపై ఆధారపడకుండా, దేవుని సంరక్షణపై ఆధారపడాలి. ఇది క్రీస్తును అనుసరించే మనందరికీ ఒక ముఖ్యమైన పాఠం. మనం దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి బయలుదేరినప్పుడు, మనం మన స్వంత శక్తిపై, సంపదపై ఆధారపడకూడదు. బదులుగా, దేవుడు మన అవసరాలు తీరుస్తారని, ఆయన మనలను జాగ్రత్తగా చూసుకుంటారని మనం విశ్వసించాలి. ఈ వచనం మనకు ప్రార్థన, ఉపవాసం, దేవునిపై ఆధారపడటం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. నా జీవితంలో దేవునిపై సంపూర్ణంగా ఆధారపడకుండా ఏ లోకసంబంధమైన విషయాలపై ఆధారపడుతున్నాను?

3. తిరస్కరణను అంగీకరించడం (లూకా 9:5-6). యేసు తన శిష్యులకు తిరస్కరణను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పించారు. “ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానింపకపోతే, వారి గ్రామం నుండి బయటకు వెళ్లేటప్పుడు వారిపై సాక్ష్యంగా మీ పాదాలకు అంటుకున్న ధూళిని దులిపివేయండి.” ఈ చర్య పగ తీర్చుకోవడం కాదు, అది దేవుని తీర్పుకు ఆ ప్రజలను అప్పగించడం. మన క్రైస్తవ జీవితంలో మన సందేశాన్ని తిరస్కరించేవారు ఉండవచ్చు. మనం నిరుత్సాహపడకుండా, నిరాశ చెందకుండా, మన కర్తవ్యాన్ని కొనసాగించాలి. మన సందేశం దేవుని వాక్యం, దానిని అంగీకరించడం లేదా తిరస్కరించడం వారి ఇష్టం. మన బాధ్యత సువార్త ప్రకటించడమే. మనం తిరస్కరణకు గురైనప్పుడు, మనం దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకు సాగిపోవాలి. శిష్యులు అలానే చేశారు. వారు “బయలుదేరి, గ్రామాలన్నీ తిరుగుతూ సువార్త ప్రకటించారు, ప్రతిచోటా రోగులను స్వస్థపరిచారు.” నేను తిరస్కరణను ఎలా ఎదుర్కొంటాను? నిరాశ చెందకుండా నా విశ్వాసాన్ని ఎలా కొనసాగించగలను?

ఈ వచనాలు మనల్ని దేవుని శిష్యులుగా మనకున్న బాధ్యత గురించి ఆలోచింపజేస్తాయి. మనం దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి శక్తిని పొందుతాం, మన అవసరాల కోసం ఆయనపై ఆధారపడతాం, తిరస్కరణను ధైర్యంగా ఎదుర్కొంటాం. ఈరోజు, నేను కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనపై సంపూర్ణంగా ఆధారపడతాను అని ప్రతిజ్ఞ తీసుకుందాం.

లూకా 8:19-21 - ఆత్మ బంధువులు

లూకా 8:19-21 - ఆత్మ బంధువులు

లూకా 8:19-21. యేసు తల్లియు, సోదరులును, ఆయన యొద్దకు వచ్చిరి. జనులు క్రిక్కిరిసి ఉండుట వలన, ఆయనను కలసికొనలేక పోయిరి. “నీ తల్లియు, సోదరులును, నీతో మాటలాడుటకై వెలుపల వేచియున్నారు” అని ఒకరు చెప్పిరి. అందుకు యేసు వారితో, “దేవుని వాక్కును ఆలకించి, పాటించు వారే నా తల్లియు నా సోదరులు” అని పలికెను. దేవుని వాక్యాన్ని విశ్వాసంతో ఆలకించడం, దేవుని చిత్తాన్ని పాటించడం వలన మనం దైవీక కుటుంబ సభ్యుల మవుతాము. ఆత్మ బంధువులమవుతాం.

ఈ వచనాల నుండి మనం మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలపై ధ్యానం చేయవచ్చు.

1. నిజమైన కుటుంబ సంబంధం (లూకా 8:19-20). యేసును చూడడానికి ఆయన తల్లి, సహోదరులు వచ్చారు. ఈ సన్నివేశం మనకు యేసు మానవత్వాన్ని గుర్తుచేస్తుంది. ఆయనకు కుటుంబం ఉంది, దానితో ఆయనకు సంబంధం ఉంది. అయితే, ఈ లోక సంబంధాల కన్నా ఉన్నతమైన ఒక సంబంధాన్ని యేసు ఈ వచనాలలో వెల్లడి చేస్తున్నారు. జనసమూహం కారణంగా వారు ఆయన దగ్గరకు రాలేకపోయారు, ఇది మన జీవితంలో మనకు ఎదురయ్యే అడ్డంకులకు ప్రతీక. మనలో చాలామంది దేవుని దగ్గరకు వెళ్లడానికి, ప్రార్థించడానికి సమయం కేటాయించలేరు. మన కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి, లేదా ఇతర లోకసంబంధమైన విషయాలు దేవునితో మనకున్న సంబంధానికి అడ్డుగా నిలబడతాయి. నా జీవితంలో దేవునితో నా సంబంధానికి అడ్డుగా ఉన్నవి ఏమిటి? నా కుటుంబం, స్నేహితులు, లేదా నా లోకసంబంధమైన ఆలోచనలు ఆయనకు అడ్డుగా ఉన్నాయా?

2. దేవుని వాక్యం విని, పాటించడం (లూకా 8:21). యేసు తన నిజమైన కుటుంబం ఎవరనేది స్పష్టం చేస్తారు. “దేవుని వాక్కును ఆలకించి, పాటించు వారే నా తల్లియు నా సోదరులు” అని యేసు పలికారు. క్రీస్తుతో మనకు ఉన్న సంబంధం రక్త సంబంధం కన్నా, లోకసంబంధమైన బంధాల కన్నా ఉన్నతమైనది. దేవుని బిడ్డగా మారడానికి మనకు ఉన్న ఏకైక మార్గం ఆయన వాక్యాన్ని వినడం, దాన్ని మన జీవితంలో పాటించడం. ఇక్కడ, యేసు తల్లి అయిన పరిశుద్ధ మరియ గురించి మనం ఆలోచించాలి. ఆమె దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా విన్నది, దాన్ని తన జీవితంలో పాటించింది. “నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక” అని ఆమె చెప్పిన మాటలు ఈ వచనానికి సరైన ఉదాహరణ. అందువల్ల, పరిశుద్ధ మరియ యేసుకు తల్లి మాత్రమే కాదు, ఆయన మాటను విని, పాటించి, ఆయనకు అత్యంత సన్నిహితమైన శిష్యురాలు. నేను దేవుని వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వింటున్నాను? దాన్ని నా జీవితంలో పాటించడానికి నేను ఎంతగా ప్రయత్నిస్తున్నాను?

3. దేవుని ఆధ్యాత్మిక కుటుంబంలో భాగం కావడం. ఈ వచనం మనందరినీ దేవుని ఆధ్యాత్మిక కుటుంబంలో భాగం కావాలని ఆహ్వానిస్తుంది. మనం మతపరమైన కట్టుబాట్లతో, కుటుంబ సంబంధాలతో కాకుండా దేవుని వాక్యానికి మన హృదయాన్ని తెరవడం ద్వారానే ఆయన కుటుంబంలోకి ప్రవేశిస్తాం. క్రీస్తు సంఘం (తిరుసభ) కూడా ఇదే సూత్రంపై ఆధారపడి ఉంది. మనం ఒకే విశ్వాసంతో, ఒకే వాక్యాన్ని అనుసరించడం ద్వారా అందరం క్రీస్తు సహోదరీ, సహోదరులమవుతాం. ఈ కుటుంబంలో మనం ఒకరికొకరు మద్దతుగా, ప్రోత్సాహంగా ఉండాలి. నేను నా కతోలిక విశ్వాసాన్ని, సంఘాన్ని దేవుని ఆధ్యాత్మిక కుటుంబంగా భావిస్తున్నానా? ఆ కుటుంబంలో నేను ఒక బాధ్యతాయుతమైన సభ్యుడిగా ఉన్నానా?

ఈ వచనాలు మనల్ని ప్రార్థనాపూర్వకంగా ఆలోచింపజేస్తాయి. దేవునితో మనకు ఉన్న సంబంధం కేవలం వారసత్వం కాదు, అది మన స్వంత ఎంపిక. మనం దేవుని మాట విని, దాన్ని పాటించడం ద్వారానే ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటాం. ఈరోజు, నా హృదయాన్ని దేవుని వాక్యానికి తెరచి, దాని ప్రకారం జీవించడానికి నేను ప్రయత్నిస్తాను అని ప్రతిజ్ఞ తీసుకుందాం. మనం అందరం దేవుని కుటుంబంలో ఒక సభ్యుడిగా మారడానికి ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఈ ఆహ్వానాన్ని స్వీకరించి, ఆయనికి దగ్గరవుదాం.

లూకా 8:16-18 దీపపు వెలుగు

లూకా 8:16-18 - దీపపు వెలుగు

లూకా 8:16-18. యేసు ఈ లోకమునకు వెలుగు. తనను అనుసరించు వారందరిని (ఆయన శిష్యులు) ఈ లోకమునకు వెలుగు ప్రసాదించు సాధనములుగా మలిచారు. వెలుగు 'జీవము'నకు గురుతు. వెలుగు అంధకారమును పారద్రోలుతుంది. వెలుగు 'దైవసన్నిధి', 'చట్టం', 'సత్కార్యముల'కు కూడా సూచిస్తుంది. నేటి సువిషేశములో, దీపము ఎలా వెలుగు నిచ్చునో, మన వెలుగు జీవితాలద్వారా, అనగా సత్కార్యముల వలన, ఇతరుల జీవితాలలో వెలుగును నింపాలని కోరుచున్నారు. అనగా, మనం క్రీస్తుకు, ఆయన వెలుగుకు సాక్షులముగా జీవించాలి. మత్తయి 5:16లో ప్రభువు చెప్పినట్లుగా, “ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోక మందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి యెదుట ప్రకాశింపనిండు.” 

మన విశ్వాసమే ఆ వెలుగు; మన విశ్వాసపు వెలుగుతో మనం నివసించే ఈ లోకమును క్రీస్తు జ్యోతితో వెలిగించాలి, పునరుద్ధరణ గావించాలి. సత్కార్యములు అనగా, క్రైస్తవ ప్రేమలో జీవించడం. ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించడం. అలా జీవించినప్పుడు, ఆ ప్రేమ, మన దయాపూరిత కార్యములద్వారా వ్యక్తపరచ బడుతుంది. త్యాగపూరితమైన సేవాభావముతో జీవించాలి. అలాంటివారు ఈ లోకమునకు వెలుగు కాగలరు. 

దీపము 'దేవుని వాక్యము'ను సూచిస్తుంది. అదియే క్రీస్తు ఈ లోకమునకు కొనివచ్చిన రక్షణ వెలుగు, రూపాంతరం చేయు వెలుగు. కనుక దాచబడిన సందేశం బయలు పరచ బడును. క్రీస్తు ఉత్థానంతో, ఆయన శిష్యులు సంపూర్ణ సందేశాన్ని గ్రహించ గలిగారు. అప్పుడు వారు ఆ సందేశమును లోకమునకు ప్రకటించిరి. లోకమునకు వెలుగుగా మారిరి. కనుక, నేడు మనం కూడా ఆ వాక్కును ప్రకటించాలి, బోధించాలి.

“ఉన్నవానికే మరింత ఒసగబడును” (8:18). మనం క్రీస్తుకు విశ్వాసపాత్రముగా ఉన్నచో, దైవరాజ్యమునకై పాటుబడినచో, మనలను అధికమధికముగా దీవించును. దేవుడు మనకొసగిన వరములను ఇతరులతో పంచుకోవాలి.

మనలోని ‘వెలుగు’ను దాచవద్దు (8:16). ఇతరులకు ప్రకాశింప జేయాలి. మనం మనలో ఉన్న దేవుని వాక్యాన్ని, ప్రేమను ఇతరులకు పంచకపోతే అది నిరుపయోగం అవుతుంది. మన జీవితాన్ని ఇతరులకు సేవ చేయడానికి, సాక్ష్యం ఇవ్వడానికి ఉపయోగించినప్పుడు, మనం దీపస్తంభం మీద ఉన్న దీపంలా ప్రకాశిస్తాం.

సత్యం బయలుపడును (8:17). మన జీవితంలో మనం చేసే మంచి, చెడు క్రియలన్నీ దేవుని ముందు బయటపడక తప్పదు. చివరికి, మన హృదయాలలో దాగి ఉన్న రహస్యాలన్నీ బయటపడతాయి. ఈ వాక్యం మనకు భయాన్ని కలిగించకూడదు, బదులుగా మన జీవితాన్ని దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించడానికి ఒక హెచ్చరికగా ఉండాలి. దేవునికి భయపడి, మన జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి ఇది మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

దేవుని వాక్యాన్ని వినాలి, పాటించాలి (8:18). మీరు ఎట్లు వినుచున్నారో గమనింపుడు” అనే మాటలు చాలా ముఖ్యం. ఇది కేవలం వినడం కాదు, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఎలా స్వీకరిస్తున్నామో, దానికి ఎలా స్పందిస్తున్నామో కూడా సూచిస్తుంది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని, దాన్ని మన జీవితంలో అన్వయించుకుంటే, దేవుడు మనకు ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని, కృపను అనుగ్రహిస్తాడు. అదేవిధంగా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, మనకు ఉన్నదని మనం అనుకున్న ఆధ్యాత్మిక జ్ఞానం కూడా మన నుండి తీసివేయబడుతుంది. ఇది దేవుని వాక్యం పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండాలో తెలియజేస్తుంది.