పేదవారిపట్ల మన దృక్పధం - బాధ్యత (నిజమైన క్రిస్మస్)

పేదవారిపట్ల మన దృక్పధం - బాధ్యత

    2017వ సంవత్సరములో పోపు ఫ్రాన్సిస్‌గారు కతోలిక శ్రీసభ, ప్రతీ సంవత్సరంలో ఒక రోజును కేటాయించి ప్రత్యేకంగా ఆరోజు ‘‘పేదరికం ఎలా సువార్తా ప్రధానాంశమో ధ్యానించాలి’’ అని కోరుతూ, ప్రతి సామాన్య 33వ ఆదివారమును ‘ప్రపంచ పేదల దినోత్సవము’నకు అంకితం చేశారు.

1. ఈ సంవత్సరం ‘ప్రపంచ పేద దినోత్సవ’ సందేశంగా పోపు ఫ్రాన్సిస్‌ కీర్తన 9:18ని ధ్యానిస్తున్నారు: ‘‘దేవుడు పీడితు ఆశను ఏనాడు వమ్ము చేయడు.’’ లోకంలోని కోట్లాదిమంది పేదరికంతో బాధనను భవిస్తున్నవారు దేవునిలో నమ్మకమును, ఆశను కలిగియున్నారు. ఎందుకన దేవుడు నమ్మకపాత్రుడని హామీ యిస్తున్నాడు.

    దురహంకారులు, భక్తీహీనులు పేదవారిని పీడిస్తు, వారికున్న కొద్దిదాంట్లోనుండి అన్యాయంగా దోచుకొంటూ, వారిని బానిసత్వంలోనికి నెట్టే నేపధ్యంలో ఈ 9వ కీర్తన కూర్చడం జరిగింది. ఈనాటి పేద పరిస్థితి కూడా అలాగే ఉన్నది...! ఆర్ధిక సంక్షోభంలో కూడా అనేకమంది సంపదను కూడబెట్టుకుంటూనే ఉన్నారు, మరోవైపు పట్టణ వీధులో అనేకమంది పేదవారు, కనీసం, నిత్యావసారాలు కూడా లేకుండా తిరుగాడటం మనం చూస్తున్నాము. వారు అనేకసార్లు దోపిడీకు, వేధింపుకు గురవుతూనే ఉన్నారు.

2. ఈనాడు స్త్రీలు, పురుషులు, యువతీ యువకులు అనేకరకమైన బానిసత్వపు జీవితాకు లోనై ఉన్నారు: మాతృభూమినుండి వెళ్ళగొట్ట బడుచున్న శరణార్ధులు, అనాధులు, నిరాశ్రయులు, మానవ అక్రమ వ్యాపారానికి తరలింపబడుతున్న స్త్రీలు, పిల్లలు, నిరుద్యోగ యువత, దురాశ, దోపిడీ, హింసకు గురవుతున్న బాధితులు.... తరుచుగా పేదవారిని ‘చెత్త’గా పరిగణిస్తున్నారు. వారిని పరాన్న జీవులుగా, సమాజానికి ముప్పుగా భావిస్తున్నారు.

3. పేదవారు ప్రభువునందు నమ్మకము ఉంచువారు (9:10). దేవుడు తమను చేయి విడువడని నమ్మువారు. దేవుడు తమను కాపాడును అనే నమ్మకముతో జీవించువారు.

4. దేవుడు మాత్రమే వారి ఆక్రందనను ఆకించును, వారిని ఆదుకొనును, రక్షించును, కాపాడును, వారికి సహాయము చేయును. దేవుడు మాత్రమే వారికి న్యాయమును ఒసగును. దేవుడు వారిని ఎన్నటికి మరువడు, ఎడబాయడు. దేవుడు వారి ఆదరువు. వారిని ఆదుకొనుటకు ఎన్నడు ఆస్యం చేయడు.

5. యేసు పేదవారితో గుర్తింపబడినాడు, ఆయనే స్వయంగా నిరుపేద అయ్యాడు (2 కొరి 8:9): పేదతోను సంఘ బహిష్క్రుతుతోను కలిసి మెసి జీవించారు. ‘‘ఈ నా సోదరులో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినపుడు అవి నాకు చేసితిరి’’ (మత్తయి 25:40). భవిష్యత్తుపై నమ్మకము లేనివారికి, నిరాశపడు వారికి ప్రభువు ఆశను ఒసగును. యేసు ప్రభువు దైవరాజ్యమును ఈ లోకములో ఆరభించి, దాని కొనసాగింపు, నిర్మాణ బాధ్యతను ఆయన శిష్యుమైన మనకు అప్పగించాడు. పేదకు ఆశను కల్పించు బాధ్యతను మనకు ఇచ్చియున్నాడు.

6. శ్రీసభ దేవుని ప్రజ. శ్రీసభ పేద పక్షాన నివాలి. కనుక ఎవరుకూడా అపరిచితులుగా, బయటివారిగా అనుభూతిని పొందకుండా ఉండుటకు శ్రీసభ అభయాన్ని ఇవ్వాలి. రక్షణ ప్రయాణంలో అందరూ భాగస్తులే. పేదవారినుండి మనము దూరంగా ఉండలేము. వారుకూడా క్రీస్తు శరీరంలో భాగమే. క్రీస్తు వారిలో కూడా శ్రమనుభవించును. మన సేవద్వారా పేదవారిని చేరుకోవాని, వారిని లేవనెత్తానేదే సువర్తా సందేశం.

7. దైవరాజ్యమునకు ప్రాముఖ్యముగా ఏమి కావలెనో కనుగొను విషయంలో మన దృక్పధం మారాలి. ‘‘సమాజంలో అత్యల్పులైన పేదలు, సాటివారి అనాదరణకు నిర్లక్ష్యానికి గురవుతోన్న పేద ప్రజ పక్షాన నిబడి, అన్ని విధా వారిని ఆదుకోవడంలో (సువార్తానందం, 195) శ్రీసభ, క్రీస్తానుచరులు ఎల్లప్పుడు ముందుండాలి. నిజమైన అంకితభావంతో కకాలం వారికి తోడుగా ఉండి వారిలో గొప్ప నమ్మకాన్ని కలిగించాలి.

8. పేదవారి అవసరతలో మనం ఎ్లప్పుడూ వారికి తోడుగా ఉండాలి. అయితే కేవలం భౌతిక సహాయముతో ఆగిపోక వారి ఆధ్యాత్మిక, భావోద్వేగ అవసరతలో కూడా మనం అండగా నిబడాలి. మనం మన ‘‘పొరుగువారికి పునీతులం’’ కావాలి. వారికి దేవుని ప్రేమ, స్నేహ శక్తిని సుస్పష్టంగా తెలియ బరచాలి. తద్వారా, వారిలోని అంత:ర్గత సౌదర్యాన్ని, మంచితనమును చూడగగాలి.

9. పేదవారు మన రక్షణకుపకరించెదరు, ఎందుకన యేసు క్రీస్తు దివ్య ముఖమును గాంచుటకు మనకు సహాయపడుదురు. మనము చేసే కార్యాను, ప్రాజెక్టును పొగడుకొనుటకు పేదవారు గణాంకాలు కాకూడదు. పేదవారు కలుసుకొనబడే వ్యక్తులు. పేదవారిలో ఒంటరివారు, యువకులు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, పిల్లలు ఉన్నారు, వారు మన స్నేహపూర్వకమైన ఒక్క మాటకోసం, ఒక చిరునవ్వుకోసం, వినగలిగే ఒక చెవికోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

10. ఆయనను వెదకువారిని, ఆయన నామమును పిలుచువారిని దేవుడు ఎన్నడు విడనాడడు. ‘‘పేదవారి మొరను దేవుడు తప్పక వినును’’ (కీ. 9:12). వారి స్వరముకు దేవుడు చెవియొగ్గి వినును. నిరాశ నిస్పృహ పరిస్థితిలో కూడా పేదవారు దేవుని యందు నమ్మకం ఉంచెదరు, ఎందుకన, వారు దేవునిచేత ప్రత్యేకంగా ప్రేమింపబడుచున్నారని ఎరిగియున్నారు. ఈ నమ్మకం, వారి బాధలు, శ్రమలు, అవమానము కన్న బమైనది.

    కనుక, మనం క్రైస్తవ నమ్మకమునకు నిజమైన సాక్షుగా నివాలి. ఇది సాధ్యం కావాలంటే, వివిధ కార్యాద్వారా (వ్యక్తిగత / సామూహిక) పేదవారికి నమ్మకమును, ఓదార్పును ఇవ్వగగాలి. పేదవారికి సేవచేయుటలో ఇంకా అనేకమందిని ప్రోత్సహించాలి. మన వ్యక్తిగత, స్థిరమైన అంకింతభావము ద్వారా పేదవారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి.

    పోపు ఫ్రాన్సిస్‌ ‘‘సువార్తానందం’’లో సూచించినట్లుగా, పేద ప్రజకు సమాజంలో గౌరవ స్థానం కల్పించాలి. పేద ఆర్తిని ఆకించి, సకాలంలో స్పందించాలి. దైవ ప్రజలో పేదకు ప్రత్యేక స్థానం ఉంచాలి. పేదరికానికి మూమైన వ్యవస్థాగత సమస్యను సత్వరమే పరిష్కరించాలి. నిస్సహాయుకు (ప్రవాసులు, వస వచ్చేవారు) మనం అండగా ఉండాలి.

No comments:

Post a Comment