క్రీస్తు సాక్షాత్కార పండుగ, 5 జనవరి 2020

యేసు సాక్షాత్కార పండుగ

యెషయా 60: 1-6, కీర్తన 72:1-2, 7-8, 10-13, ఎఫెసీ 3:2-3, 5-6, మత్తయి 2:1-12

ఇదిగో! సర్వాధికారియైన సర్వేశ్వరుడు వచ్చుచున్నాడు.
తన చేతియందు రాజ్యాధికారము,
శక్తి సామర్ధ్యమును కలిగి వచ్చుచున్నాడు. 
దేవుడు నమ్మదగిన వాడు

మనలో ప్రతి ఒక్కరముకూడా, నమ్మకము కలిగిన వ్యక్తిని కోరుకొంటాం. అలాంటి వ్యక్తికోసం ఎదురు చూస్తూ ఉంటాము. మనలను ఎల్లప్పుడు అంటిపెట్టుకొని ఉండటము మాత్రమేగాక, వాగ్దానాలను చేయడం మాత్రమేగాక, మంచితనము కలిగి చేసిన వాగ్దానాలను నెరవేర్చుటకు కావసిన శక్తిని కలిగియున్న వ్యక్తికోసం ఎదురుచూస్తూ ఉంటాం. అధారపడదగిన వ్యక్తి, నమ్మదగిన వ్యక్తి, విశ్వాసముగల వ్యక్తి మనదరికీ కావాలి... ఆ వ్యక్తియే దేవుడు. జ్ఞానులు శిశుసందర్శనము, దేవుని విస్వసనీయతకు, నమ్మకమునకు ఋజువుగా, బైబిలు గ్రంధములోనున్న అత్యంత అందమైన ప్రామాణాలలో ఒకటి.

క్రీస్తు జనమ్మునకు 500సం.ల పూర్వమే యెషయ ప్రవక్తద్వారా, రక్షణ వెలుగును పంచుకొనుటకు అన్నిదేశములను యేరూషలేమునకు నడిపిస్తానని దేవుడు వాగ్ధానము చేసియున్నాడు (యెషయ 49:6). కీర్తనకారునిద్వారా, ఇదే వాగ్దానాన్ని మరోమాటలో చేసియున్నాడు: ‘‘తర్శీషు రాజు, ద్వీపము నృపులు కప్పము కట్టుదురు. షేబా, సెబా పాలకులు కానుకలు కొనివత్తురు’’ (కీర్తన 72:10). 500సం.లు యుద్ధాలు జరిగినను, ప్రజలు వలసలు పోయినను, చారిత్రాత్మక కలతలు జరిగినను, నాగరికత ప్రపంచములో మూడు వేర్వేరుసార్లు ప్రపంచ పటమును తిరగరాసినను, దేవుడు వాగ్ధానము చేసిన దానిని నెరవేర్చియున్నాడు. మంచి వ్యక్తులు, నమ్మకము కలిగిన వ్యక్తులు మాత్రమే మంచి వాగ్దానాలను నిబెట్టగలరు. జ్ఞానులద్వారా, వారి కానుకలద్వారా, సకల జాతులు రక్షణ వెలుగులోనికి ప్రవేశించి యున్నాయి. 

జ్ఞానులు శిశుసందర్శనము దేవుని మంచితనాన్ని, ఆయన శక్తికలవాడని నిరూపిస్తున్నది. ఆయన మన దేవుడు, అందరి దేవుడు. దేవుని మంచితనము, ఆయన శక్తి మనవే, ఎందుకన, మనము క్రీస్తుకు చెందినవారము. దేవుడు, నీకు, నాకు వ్యక్తిగతముగా విశ్వసనీయుడు, నమ్మదగినవాడు. ఆయన మన ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం. అన్నివేళల, అన్నిసమయాలో, ఆయనను పరిపూర్తిగా విశ్వసించుదాం, పూర్ణహృదయముతో ప్రేమించుదాం. మనమూ ఆయనకు నమ్మదగినవారముగా జీవించుదము. 

రాజైన దేవుడు పరిపాలించుటకు వేంచేయును 
జ్ఞానులు శిశుసందర్శనములో, లోకరాజు జన్మనుగూర్చి ఎరిగి, హేరోదు రాజు కలత చెందాడు. అదే వార్తను ఎరిగిన జ్ఞానులు ఎంతో ఆనందించారు. హేరోదు తన జీవితాంతం హత్యలుచేస్తూ, అన్యాయముగా, స్వార్ధముతో జీవించియున్నాడు. వ్యక్తిగత కీర్తికోసం, పేరుప్రతిష్టల కోసం రాజ్యాన్ని పరిపాలించాడు. పరలోకమునుండి, గొప్ప అధికారముతో క్రీస్తు లోకరాజుగా ఈ లోకములో ఉద్భవించాడు. హేరోదు భయపడి, క్రీస్తును హంతం చేయకపోతే, తన జీవితం ముగుస్తుందని కలత చెందాడు. మరోవైపు, అన్య దేశాలనుండి వచ్చిన జ్ఞానులు లోకరక్షకునిపట్ల ఎంతగానో సంతోషించారు.

No comments:

Post a Comment