పునీత మదర్ థెరెసా (5 సెప్టెంబరు)

పునీత మదర్ థెరెసా (5 సెప్టెంబరు)

‘‘దేవుని చేయిలో నేనొక చిన్న పెన్సిల్‌ ముక్కను. వ్రాసేవాడు ఆయనే. ఆలోచించేవాడు ఆయనే. నడిపించేవాడు ఆయనే. నేను చేయాల్సిందంతా ఒక చిన్న పెన్సిల్‌ ముక్కగా ఉండటమే’’ - పునీత కకత్తా పురి థెరెసా గారు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన థెరెసా గారు దీనతకు, వినమ్రతకు, సేవకు ఒక రూపం. అవే సుగుణాలు ఆమెను ప్రపంచ తారను చేశాయి. అటువంటి మలువైన సుగుణాలను కలిగి జీవించిన ఆమె జీవితాన్ని మనం ఆదర్శవంతంగా తీసుకోవాలి. ఆమె ఏవిధంగా వినయం, సేవాభావం కలిగి జీవించిందో తెలుసుకుందాం.

‘‘వినయం అన్ని సుగుణాలకు మాతృమూర్తి, సంరక్షకురాలు’’ అని పునీత అగస్తీను వారు చెప్పి యున్నారు. దీనత్వము కలిగి ప్రవర్తించడం వినయం. వినయము గలవారు తమను తాము తగ్గించుకొని అణుకువ కలిగి జీవిస్తారు. ఎప్పుడు తమ గొప్పను ఇతరుల యెదుట ప్రదర్శించాలని కోరుకోరు. గొప్ప వ్యక్తిత్వము గలవారు వినయం కలిగి జీవిస్తారు. వినయం గలవారు నిరాడంబరంగా జీవిస్తారు. ఇతరుల అభిప్రాయాలకు సముచిత స్థానాన్ని ఇస్తారు. వినమ్రులు గొప్ప ఆశయాలు కలిగి జీవిస్తారు. నిందకు, అవమానాలకు గురియైనా, వినయం గలవారు సమతుల్యాన్ని పాటించి ఆదర్శంగా జీవిస్తారు. ఇలాంటి మలువైన, గొప్పదైన వినయ సుగుణాన్ని తన జీవితంలో రంగరింప జేసుకొని, జీర్ణింప జేసుకొని జీవించి పేద సాధలను అక్కున చేర్చుకున్న అమృత వర్షిణి, దయార్ద్ర హృదయిణి, పునీత కలకత్తా పురి థెరెసా గారు. పునీత పేతురు గారి మాటలను గుర్తు చేసుకుందాం: ‘‘మీరు అందరును వినయము అను వస్త్రమును ధరింప వలెను. ఏయన, దేవుడు అహంకారులను ఎదిరించి, వినయశీలురను కటాక్షించును. శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు. ముక్తి సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును’’ (1 పేతురు 5:5-6).

రెండవదిగా, థెరెసా గారి సేవాభావ జీవితాన్ని పరిశీలించుదాం. ‘‘దేవుని చేతిలో నేను ఒక చిన్న పెన్సిల్‌ లాంటి దానిని. మొద్దుబారి విరిగిన పెన్సిల్‌ నేను. కాని ఆయనే నన్ను తన సేవకు ఉపయోగించు కుంటాడు. తన అవసరం కొద్ది నన్ను పదును చేస్తాడు. అసు నన్ను నడిపించేది, వ్రాసేది ఆయన హస్తమే. ఆయన చిత్తానికి తల దించుతాను. తన సేవలో నేను తరియించడమే నా భాగ్యం’’ అని పునీత థెరెసా గారు స్పష్టంగా చెప్పి యున్నారు.  యెషయా ప్రవక్త పలుకులను గుర్తుకు చేసుకుందాం: ‘‘ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాడ్యుని చేసితిని. ఇతడిని ఎన్నుకొంటిని. ఇతని వలన ప్రీతి చెందితిని. ఇతనిని నా ఆత్మతో నింపితిని’’ (యెషయా 42:1). ఈ సృష్టిలో మనిషి మహోన్నతుడు. స్వార్ధాన్ని త్యాగం చేసి, సేవాతత్పరతతో పరు శ్రేయస్సు కోసం పరిశ్రమించినపుడు మనిషి మహోన్నతుడు అవుతాడు. జగాలు మారినా, యుగాలు గడచినా, నిస్వార్ధ సేవ అందరి నీరాజనాలు పొందుతుంది. సేవ చేయటంలో పొందు ఆనందం ఎంతో గొప్పది. అలుపెరుగక అందించే సేలు ఆత్మ తృప్తికి   ఉత్తమ సాధనాలు. ఇతరుల మెప్పుకోసం లేదా ఆర్ధిక ప్రతిఫలం కోసం లేదా పేరు ప్రఖ్యాత కోసం ఒనర్చే సేలు, స్వంత గొప్పలు చాటుకొనేందుకు స్వప్రయోజన సాధనాలు అవుతాయి. ఉత్తమమైన సేవలో పరమార్ధం ఉంటుంది. పరుల ప్రీతి కోసం గాక దేవుని ప్రసన్నత కోసం సేలు చేయాలి. అటువంటి మంచి దృక్పధం కలిగి చరిత్రలో, ప్రజల గుండెల్లో జీవించిన స్త్రీ పునీత థెరెసా గారు.

ఈమె జీవించిన కాలం ప్రతిరోజును దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానంగా భావించి పేదలను, రోగులను, అనాధులను, పసిపిల్లలను ఆదరించి వారికి నిజమైన ప్రేమను, దయను, సేవను అందించిన గొప్ప తల్లి, ప్రేమమూర్తి, వినయమూర్తి, సేవామూర్తి పునీత థెరెసా గారు.

మనంకూడా ఈమెవలె మన దైనందిన జీవితాల్లో ప్రేమ, దయ, సేవాభావంతో జీవిస్తూ, ‘‘మీలో గొప్ప వాడిగా ఉండదచిన వాడు, ముందుగా సేవకుడై ఉండవలయును’’ (మార్కు 10:43) అన్న క్రీస్తు ప్రభువుని పలుకులను పాటిస్తూ జీవించుదాం. తద్వారా, క్రీస్తు ప్రేమను, సేవను ఈలోకానికి అందించుదాం.

No comments:

Post a Comment