పునీత
చిన్న యాకోబు, పునీత ఫిలిప్పు (3
మే)
పునీత చిన్న యాకోబు: పునీత
చిన్న యాకోబు గారినే జేమ్సు అని కూడా అంటాము. అనగా యాగప్ప గారు. యాగప్ప అనగా
అందమైన, భక్తి గల, విరక్తత్వము
గల వ్యక్తి. వారు అల్ఫయీ కుమారుడు (అ. కా. 1:13). యేసు ప్రభువుకు శిష్యులు మరియు వరుసకు సహోదరుడు
అవుతాడు. (మత్త 13: 55, మార్కు 6: 3, గల. 1:
19) చిన్న యాకోబు గారి తల్లి క్లోఫా మరియ (యో. 19: 25), కన్య
మరియమ్మ అక్క చెల్లెండ్రు అవుతారని చరిత్ర తెలియచేస్తుంది. చిన్న యాకోబు గారు
పవిత్ర నగరం జెరూసలేం పీఠంకు బిషపుగా సేవలు అందించారు. ప్రేమదాత్రుత్వాలకు
పెట్టింది పేరుగా ఎల్లప్పుడు దేవాలయంకు వేదప్రచారంలో ఉండేవారు. యూదుల ఆచారాలంటే
ఎక్కువ ఇష్టం. హేరోదు అగ్రిప్ప వేదహింసలు ప్రబలినపుడు తమ గొప్ప పదవికి న్యాయం
చేయలేక పోతున్నందుకుగాను మౌనముగా రాజీనామా చేశారు. పునీత యాకోబుగారు వ్రాసిన లేఖను
క్రీ.శ. 47లో వ్రాసారు. ఈ లేఖ సిరియా శ్రీసభను ఉద్దేశించి
వ్రాసినట్లు అర్ధమౌతుంది. ఎందుకంటే, దైవ ప్రేమ, సహోదరప్రేమ
పునాదిపై గల క్రైస్తవవేదం అనుసరించడం వల్ల సమాజంలో తాము తక్కువగా చూడబడడం, అనగద్రొక్కబడడం
అనుభవిస్తున్న క్రొత్త విశ్వాసుల కోసం వారిని ప్రోత్సహిస్తూ ఈ లేఖ వ్రాసారు. బట్టలు
ఉతికే వారల సంఘం వారు ఆగ్రహంతో విరుచుకు పడి చిన్న యాకోబు గారిని దేవాలయంకు వున్న
పిట్ట గోడపై నుండి బలంగా విసిరివేసి కొట్టి చంపారు. వారు క్రీ.శ. 62 లో వేదసాక్షి
మరణం పొందారు. వీరు డ్రగ్గిస్టులు, చాకలి వృత్తివారు, దొర
టోపీ తయారీ దార్ల పాలక పునీతులు.
ధ్యానంశం: కేవలము
వినుటయేనని ఆత్మ వంచన చేసికొనకుడు. దానిని ఆచరింపుడు. (యాకోబు. 1: 22)
No comments:
Post a Comment