క్రైస్తవుల యొక్క సహాయ మాత పండుగ, 24 మే

క్రైస్తవుల యొక్క సహాయ మాత పండుగ


14వ శతాబ్దంలో జీవించిన పునీత స్వీడన్ బ్రిజీతమ్మ గారు ఒకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు, నిష్కళంక హృదయ మరియ తల్లికి ఒకమాట చెప్పగా విన్నారు. అదేమంటే “నీ యొక్క పవిత్ర నామమున ఎవరేమి అడిగినా అది నేను కృపతో ఆలకించి నెరవేరుస్తాను. వారు పాపాత్ములైనా కాని...... అయితే వారు తమ దోషమార్గాన్ని విడువ గట్టిగా తీర్మానించుకోవాలి.

క్రీ.శ.1808లో 7వ పయస్ [భక్తినాద] జగద్గురువులుగారిని నియంత అయిన నెపోలియన్ నిర్భందించి జైలులో పెట్టించాడు. అతడు దేవుడంటే నమ్మని పాషాణ హృదయుడు, తన శక్తియుక్తులే కాని దైవశక్తి సహాయం అంటూ ఏదిలేదని చెప్పే అహంభావి. అయితే ‘లీప్ జిగ్’ యుద్దం ముగిశాక నెపోలియన్ జగద్గురువులను విడుదలచేశాడు క్రీ.శ. 1814లో పోపుగారు విజయోత్సాహంతో విశ్వాసుల జయజయధ్వానాలమద్య రోమునగర పేతురు సింహాసనం తిరిగి అధిష్టించారు.

అయితే నూరవరోజు నెపోలియన్ ఆటకట్టు అయ్యింది. సంకీర్ణ సేనలు వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ను సైన్యాన్ని ఓడించి తరిమికొట్టాయి. క్రీ.శ.1815లో నెపోలియన్ పీడవిరగడై క్రైస్తవమతాధిపతులకు భయంగుప్పిటనుండి బైటపడినట్లయ్యింది.

ఈ సందర్భంగా 7వ పయస్ పోపుగారు దేవుని, తల్లి మరియాంబకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించారు. తాము చెరనుండి విడుదలైన వార్షికోత్సవం రోజున క్రైస్తవుల యొక్క సహాయమాత ఉత్సవాన్ని ప్రకటించి ఘనంగా ఆ తల్లిని కొనియాడారు.

ధ్యానాంశం: ఓ మేరీ మాతా! ప్రభువు నాకు దయచేయనెంచిన కృపావరాలన్నీ తమ పవిత్ర హస్తాల మీదుగా నొసంగ నిశ్చయించారు. కావున మిమ్మునే సకల వరప్రసాదాలతోను, కృపానుగ్రహాలతోను నింపి ఉన్నారు. (పు. ఇల్దేఫోన్స్)

No comments:

Post a Comment