నిష్కళంకోద్భవిమాత మహోత్సవము

నిష్కళంకోద్భవిమాత మహోత్సవము
డిశంబర్ 8
ఆ.కాం. 3:9-15, 20ఎఫెసీ. 1:3-6, 11-12లూకా 1:26-38

ధ్యానాంశము: మరియ - నిష్కళంకమాతా! వందనము!


ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు (1:28). నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు 'యేసుఅని పేరు పెట్టుము.” (1:31)


ధ్యానము: సర్వేశ్వరునియందు నేను ఆనందించి సంతోషించెదను. నా ఆత్మ నా దేవునియందు ఆనందించుచున్నది. ఎందుకనఆయన నాకు రక్షణ వస్త్రములను తొడిగెను. ధర్మమునే ఆభరణముగా చుట్టి పెండ్లి కుమార్తె తన భర్తకై తయారైన విధమున నన్ను తయారు చేసెను." తల్లి తిరుసభ నిష్కళంకోద్భవిమాత మహోత్సవమును ప్రతీ దైవార్చన సం.లో డిశంబర్ 8న కొనియాడుచున్నది. "నిష్కళంకము" అనగా "పాపరహితము." ఈ మహోత్సవము ద్వారా మరియతల్లి  పాపరిహితముగా జన్మించినదని లేక జన్మపాపములేక జన్మించినదను విశ్వాసమును కొనియాడుచున్నాము.


దశాబ్దాలనుండి కూడా శ్రీసభమరియ తల్లి దేవుని ద్వారా "అనుగ్రహ పరిపూర్ణురాలు" అనిఆమె జన్మపాపము లేకుండా ఉద్భవించిన మాత అను విశ్వాసమును బోధిస్తున్నది. ఈ విశ్వాసాన్నిఅధికారపూర్వకముగా 9వ భక్తినాధ పాపుగారు 8 డిశంబర్ 1854వ సం.లో ప్రకటించియున్నారు. "మిక్కిలిగా ఆశీర్వదింపబడిన పరిశుద్ధ కన్య మరియమ్మతను గర్భములో పడిన క్షణమునుండిసర్వశక్తి మంతుడైన దేవుని ఏకైక అనుగ్రహముఆశీర్వాదముఅనుమతి వలనలోకరక్షకుడైన యేసు క్రీస్తునాధుని సుకృత పుణ్యములద్వారాఆదిపాపము అను మచ్చనుండి ఆమె పరిశుద్ధముగా ఉంచబడియున్నది."

 

గబ్రియేలు దూత పలికిన "దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మావందనము" అను శుభవచనములను మనము ప్రతీరోజు జపిస్తున్నాము. గబ్రియేలు దూత వచనముల ద్వారాదేవుని యొక్క పరమ రహస్యము పరిపూర్ణముగానిండుగా మరియమ్మపై ఉన్నదని విదితమగుచున్నది.


దేవుడు సమస్త విశ్వమును తన కుమారుని ద్వారాకుమారుని కొరకు సృష్టించెను. సర్వపరిపూర్ణత కుమారునిలో ఉండెను. ఈ పరిపూర్ణతశ్రీసభకు శిరస్సుసమస్తమును అయిన క్రీస్తునుండి పొంగిపొరలితన శరీరమునయిన శ్రీసభలో ప్రవహిస్తూ ఉన్నది (కొలస్సీ. 1:12-20). తన శరీరమునయిన శ్రీసభలోనికి ఈ పరిపూర్ణత్వము దిగివచ్చుటకు ముందుగాప్రత్యేక విధముగాదేవుని తల్లిగా నెంచుకొనబడిన మరియ తల్లిపై రావడం జరిగియున్నది. అందుకేఆమె పరిశుద్దురాలుపరిపూర్ణురాలుజన్మపాపరహితముగా ఉద్భవించిన మాతస్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు.


ఏవమ్మను మానవ లోకమునకు తల్లిగా ఆదికాండములో చూస్తున్నాము. ఆమె అవిధేయత వలన లోకమునకు పాపము సంక్రమించియున్నది. నూతన ఏవమ్మ అయిన మరియ తల్లి విధేయతద్వారాలోకరక్షణమునకు ద్వారములు తెరువబడియున్నాయి. దీనినిమిత్తమైఆమె నిర్మలత్వముగాపరిపూర్ణముగా సృష్టింపబడియున్నది. ఎందుకనఆమెద్వారావాక్కులోకరక్షకుడురెండవ ఆదాముపాపపరిహారముగా ఉద్భవింపనున్నాడు.


మరియమ్మనిష్కళంకోద్భవిమాత అని 9వ భక్తి నాధ పాపుగారు 1854వ సం.లో మాత్రమే అధికారపూర్వకముగా ప్రకటించినప్పటికినిఈ విశ్వాసం తిరుసభ ఆరంభమునుండియే (7వ శతాబ్దము నుండి) ఉన్నది. అధికారపూర్వకముగా ప్రకటింపబడిననాలుగు సం.ల తరువాత అనగా 1858వ సం.లోలూర్దునగరములో పునీత బెర్నదెత్తకు దర్శనములో మరియ తల్లి తననుతాను "నేను నిష్కళంకోద్భవిమాతను" అని సంభోదించి మన విశ్వాసాన్నినమ్మకాన్ని దృఢపరచియున్నది.


మరియ నిష్కళంకోద్భవము ద్వారాత్రిత్వైక దేవుని లోకరక్షణ ప్రణాళికను సుస్పష్టముగా చూడవచ్చు. పాపములో పడియున్న లోకాన్ని రక్షించుటకు దేవుడు ముందుగానే ప్రణాళికను ఏర్పాటు చేసియున్నాడు. దానినిమిత్తమై మరియను జన్మపాపరహితగా సృష్టించాడు.  తద్వారాఈ లోకానికి పరిశుద్ధమైనపరిపూర్ణమైన మానవత్వమును తీసుకొని వచ్చిఆయనద్వారా మరల లోకాన్ని దేవునిలో ఏకమగునట్లు చేసియున్నాడు.


అవిధేయతద్వారాస్వతంత్రమును దుర్వినియోగము చేసికోవడముద్వారాఆమె కుమారుడు యేసు క్రీస్తుద్వారా మరల మనము స్వతంత్రమునుపరిశుద్ధమును పొందగలుగుచున్నాము. మరియ నిష్కళంక మాతజన్మపాప రహిత. ఎందుకనఆమె దేవునికి తల్లిగా ఎన్నుకొనబడియున్నది. పరిశుద్ధత్వమునుపరిపూర్ణతను పొందియున్నది. దేవునియొక్క చిత్తముఅనుగ్రహముతో సహకరించినచో మనమూ ఆ దేవుని అనుగ్రహములను పొందగలము.


నిర్మల ఆత్మలను ప్రేమించు ఓ సర్వేశ్వరా! కన్య మరియమ్మ పాపరహిత ఉద్భవముద్వారా మీ కుమారునికి ఒక యోగ్యవాసమును తయారు చేసితిరి. ముందు లభించనున్న మీ కుమారుని మరణ ఫలితమున ఆమెను సమస్త మలినమునుండి కాపాడితిరి. మేముకూడా ఆమె ప్రార్ధనా సహాయమున శుద్ధమనసులతో మిమ్ము చేరుకొను భాగ్యమును ప్రసాదింపుమని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము.

No comments:

Post a Comment