లూకా 8:19-21 - ఆత్మ బంధువులు
లూకా 8:19-21. యేసు తల్లియు, సోదరులును, ఆయన యొద్దకు వచ్చిరి. జనులు క్రిక్కిరిసి ఉండుట వలన, ఆయనను కలసికొనలేక పోయిరి. “నీ తల్లియు, సోదరులును, నీతో మాటలాడుటకై వెలుపల వేచియున్నారు” అని ఒకరు చెప్పిరి. అందుకు యేసు వారితో, “దేవుని వాక్కును ఆలకించి, పాటించు వారే నా తల్లియు నా సోదరులు” అని పలికెను. దేవుని వాక్యాన్ని విశ్వాసంతో ఆలకించడం, దేవుని చిత్తాన్ని పాటించడం వలన మనం దైవీక కుటుంబ సభ్యుల మవుతాము. ఆత్మ బంధువులమవుతాం.
ఈ వచనాల నుండి మనం మూడు ముఖ్యమైన
ఆధ్యాత్మిక సత్యాలపై ధ్యానం చేయవచ్చు.
1. నిజమైన కుటుంబ సంబంధం (లూకా 8:19-20). యేసును చూడడానికి ఆయన తల్లి, సహోదరులు
వచ్చారు. ఈ సన్నివేశం మనకు యేసు మానవత్వాన్ని గుర్తుచేస్తుంది. ఆయనకు కుటుంబం ఉంది,
దానితో ఆయనకు సంబంధం ఉంది. అయితే, ఈ లోక సంబంధాల కన్నా ఉన్నతమైన ఒక సంబంధాన్ని యేసు ఈ వచనాలలో వెల్లడి
చేస్తున్నారు. జనసమూహం కారణంగా వారు ఆయన దగ్గరకు రాలేకపోయారు, ఇది మన జీవితంలో మనకు ఎదురయ్యే అడ్డంకులకు ప్రతీక. మనలో చాలామంది
దేవుని దగ్గరకు వెళ్లడానికి, ప్రార్థించడానికి సమయం కేటాయించలేరు.
మన కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి, లేదా ఇతర లోకసంబంధమైన విషయాలు దేవునితో మనకున్న సంబంధానికి అడ్డుగా
నిలబడతాయి. నా జీవితంలో దేవునితో నా సంబంధానికి అడ్డుగా ఉన్నవి ఏమిటి? నా కుటుంబం, స్నేహితులు, లేదా నా లోకసంబంధమైన ఆలోచనలు ఆయనకు అడ్డుగా ఉన్నాయా?
2. దేవుని వాక్యం విని, పాటించడం (లూకా 8:21). యేసు తన నిజమైన కుటుంబం ఎవరనేది స్పష్టం చేస్తారు. “దేవుని వాక్కును ఆలకించి, పాటించు వారే నా తల్లియు నా సోదరులు” అని యేసు పలికారు. క్రీస్తుతో మనకు ఉన్న సంబంధం రక్త సంబంధం కన్నా,
లోకసంబంధమైన బంధాల కన్నా ఉన్నతమైనది. దేవుని బిడ్డగా
మారడానికి మనకు ఉన్న ఏకైక మార్గం ఆయన వాక్యాన్ని వినడం, దాన్ని మన జీవితంలో పాటించడం. ఇక్కడ, యేసు తల్లి అయిన పరిశుద్ధ మరియ గురించి మనం ఆలోచించాలి. ఆమె దేవుని
వాక్యాన్ని పరిపూర్ణంగా విన్నది, దాన్ని తన జీవితంలో పాటించింది. “నేను
ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక” అని
ఆమె చెప్పిన మాటలు ఈ వచనానికి సరైన ఉదాహరణ. అందువల్ల, పరిశుద్ధ మరియ యేసుకు తల్లి మాత్రమే కాదు, ఆయన మాటను విని, పాటించి, ఆయనకు అత్యంత సన్నిహితమైన శిష్యురాలు. నేను దేవుని వాక్యాన్ని ఎంత
శ్రద్ధగా వింటున్నాను? దాన్ని నా జీవితంలో పాటించడానికి నేను
ఎంతగా ప్రయత్నిస్తున్నాను?
No comments:
Post a Comment